Jogi Ramesh: జోగి రమేష్ అరెస్ట్.. తీవ్రంగా ఖండించిన వైసీపీ నేతలు..
- నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ అరెస్ట్..
- జోగి రమేష్ అరెస్ట్ ను ఖండించిన వైసీపీ శ్రేణులు..
- జోగి రమేష్ అరెస్ట్ పూర్తిగా కక్ష సాధింపు చర్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jogi Ramesh: ఏపీలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం తయారీ కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ ను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక, మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్పై వైసీపీ నేతలు చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ, మేరుగు నాగార్జున, పేర్ని వెంకట్రామయ్య (నాని), అంబటి రాంబాబు, కురసాల కన్నబాబు, గడికోట శ్రీకాంత్రెడ్డి, మార్గాని భరత్, టీజేఆర్ సుధాకర్బాబు తీవ్రంగా ఖండించారు.
Read Also: Kanchana4 : పూజ – నోరా కాంబోతో లారెన్స్ కాంచన 4.. హారర్ కి గ్లామర్ టచ్..!
Also Read
అయితే, మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ పూర్తిగా అక్రమం.. ఇది కేవలం కక్ష సాధింపు చర్యగా వైసీపీ నేతలు పేర్కొన్నారు. కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ను దురుద్దేశంతోనే ఇరికించారు.. ఈ కేసులో కస్టడీలో ఉన్న ఏ-1 నిందితుడు జనార్థన్ రావు ద్వారా జోగి రమేష్ పేరు చెప్పించారు.. దానిపై జోగి చేసిన సవాల్, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ సాక్షిగా ఆయన చేసిన ప్రమాణంపై ఇప్పటి వరకు స్పందించని టీడీపీ నేతలు జోగి రమేష్ కుటుంబాన్ని ఇంకా వైసీపీని ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యం.. అందుకే రాజకీయ దురుద్దేశంతో తప్పుడు విచారణలు, అక్రమ అరెస్ట్లు.. లేని లిక్కర్ స్కామ్లు సృష్టించారని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆరోపించారు.
Read Also: Raj Thackeray: ప్రతిపక్ష కూటమితో చేరిన రాజ్ ఠాక్రే..
ఇక, కల్తీ మద్యం తయారు చేస్తూ టీడీపీ నాయకులు అడ్డంగా దొరికిపోవడంతో, ఆ బురదను తమకు అంటించేందుు కుట్ర చేస్తున్నారని వైసీపీ శ్రేణులు పేర్కొన్నారు. కల్తీ మద్యం కేసులో సీబీఐ దర్యాప్తు కోరిన జోగి రమేష్.. దానిపై హైకోర్టులో పిటిషన్ విచారణకు రాకముందే జోగి రమేష్ను అక్రమంగా అరెస్టు చేశారని తెలిపారు. అయితే, కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో తొక్కిసలాటలో పలువురి దుర్మరణం, మొంథా తుపాన్ సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వ వైఫల్యం నుంచి డైవర్షన్ కోసమే జోగి రమేష్ను అరెస్ట్ చేశారని ఆరోపించారు. కల్తీ మద్యం కేసులో పక్కా ఆధారాలున్నా, కొందరు టీడీపీ నాయకులను అరెస్ట్ చేయలేదు.. కేవలం కక్ష సాధింపు కోసమే జోగి రమేష్ను ఇరికించి అరెస్టు చేశారు.. ప్రభుత్వ దమనకాండను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని వైసీపీ నాయకులు వెల్లడించారు.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!