Janasena Kiran Royal : దానిపై వైవీ సుబ్బారెడ్డి సమాధానం చెప్పాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీటీడీ పాలక మండలి సమావేశంలో కొన్ని వ్యాపార లావాదేవీలు బయట పడ్డాయని తిరుపతి అసెంబ్లీ జనసేన పార్టీ ఇంఛార్జీ కిరణ్ రాయల్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. టీటీడీలో పెద్దలు వైవీ సుబ్బారెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి ఏమనుకుంటే అది జరుగుతాయా…? ఈ విషయాలు అన్ని ఎస్వీబీసీ లైవ్ ద్వారా బయటకు వచ్చాయని ఆయన అన్నారు. ఉదయస్తమాన సేవా టికెట్లను సినిమా టికెట్లు తరహాలో పాలక మండలి సభ్యులు వాటలేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. లైవ్ ద్వారా అందరూ చూడాలని టీటీడీ అదనపు ఈవో ధర్మా రెడ్డి ఈ వీడియో బయట పెట్టించారన్నారు. శ్రీవారి ఉదయస్తమాన టికెట్లు 76 వరకు భక్తులు బుక్ చేసుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారని, ఇంతకీ టికెట్లు ఎవరు బుక్ చేసుకున్నారో సీబీఐ ద్వారా ఎంక్వయిరి జరగాలన్నారు.
ఇవన్నీ లైవ్ ద్వారా తెలిసేలా చేసిన అదనపు ఈవో ధర్మారెడ్డికి జనసేన నాయకులం ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. సమాధానం చెప్తారా లేక మాకు నోటీస్ ఇస్తారా, టీటీడీ అధికారులు ఆలోచించుకోవాలి…ప్రశ్నిస్తే నోటీసులు ఇస్తున్నారని ఆయన విమర్శించారు. నిన్నటి రోజు బయోమెట్రిక్ ద్వారా ముగ్గురు వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించారు. బయోమెట్రిక్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన వాళ్ళు ఎవరు? దీనిపై టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించలేని పాలకమండలి అవసరమా…? అని ఆయన ప్రశ్నించారు. పాలకమండలి సమావేశంలో ఎవరెవరు ఎంత వాటాలు తీసుకున్నారో బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read
- AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
- TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
- MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై తీర్పు రేపటికి వాయిదా!
- Poleramma Jatara 2026: వెదురుపాకలో పోలేరమ్మతల్లి జాతర.. సందడి చేసిన దేవిశ్రీ ప్రసాద్!
తాజావార్తలు
-
Tamil Nadu Political Crisis: దళపతి దెబ్బకు ఏకం అవుతున్న బద్ద శత్రువులు? విజయ్ పొలిటికల్ పవర్కు స్టాలిన్, పళనిస్వామి చెక్!
-
Chanakya Niti: విజయం మీ బానిస కావాలా? అయితే చాణక్యుడు చెప్పిన ఈ ‘సీక్రెట్స్’ పాటించాల్సిందే!
-
Bengal: రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లపై బీజేపీ కీలక ప్రకటన
-
Radico Khaitan: మత్తులో మునిగి.. లాభాల్లో తేలిన వోడ్కా కంపెనీ! 3 నెలల్లో వందల కోట్ల లాభం..
-
Ramachandra Rao: కర్ణాటక మాజీ డీజీపీ రామచంద్ర రావుకు భారీ ఊరట.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!