Sajjala Ramakrishna: సజ్జల వద్దకు తాడికొండ పంచాయితీ.. ఆయన్ను తొలగించాలని శ్రీదేవి డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. తాడికొండ పంచాయితీ ఏపీ ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వదరకు చేరడంతో ఇది చర్చకు దారితీస్తోంది. అయితే.. తాడికొండ నియోజకవర్గ వైసిపి అదనపు సమన్వయకర్తగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ను నియమించడంపై స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవితో పాటు ఆమె వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక డొక్కాను వెంటనే ఆ పదవి నుండి తొలగించాలని ఎమ్మెల్యే వర్గం డిమాండ్ చేస్తోంది. ఈనేపథ్యంలో.. తాజాగా ఎమ్మెల్యే శ్రీదేవి భారీగా అనుచరగణంతో సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసారు. ఇక తాడికొండ బాధ్యతలు డొక్కాకు అప్పగించడంతో స్థానికంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయని, వెంటనే ఆయనను తొలగించాలని శ్రీదేవి డిమాండ్ చేసారు. అంతేకాకుండా.. అదనపు ఇన్ చార్జ్ నియామకంతో నియోజకవర్గంలో తన ఇమేజ్ డ్యామేజీ అవుతుందని.. వచ్చే ఎన్నికల్లో తనకు సీటు ఇవ్వరనే ప్రచారం కూడా జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారామె. ఇక వైసీపీ గెలిచిన 151 నియోజకవర్గాల్లో కొన్నిచోట్ల స్థానిక ఎమ్మెల్యేలపై కంప్లయింట్లు ఉన్నాయి.
మరికొన్ని చోట్ల ఎమ్మెల్యేలపై సీఎం జగన్ అసంతృప్తితో ఉన్నారని టాక్. అంతేకాదు, గడప గడపలో పాల్గొనకపోవడం.. ప్రజల్లోకి వెళ్లకపోవడం.. నియోజకవర్గాలకు దూరంగా ఉండటం. ఇలా కొన్ని కారణాలతో ఎమ్మెల్యేల విషయంలో జగన్ ఆల్టర్నేట్ ఆలోచిస్తున్నారు. ఈనేపథ్యంలో.. తాడికొండలో డొక్కాకు అదనపు బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. దీంతో.. ఎమ్మెల్యే శ్రీదేవి నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురవుతోంది. ఇక నియోజకవర్గంలోకి వస్తున్న డొక్కా మాణిక్యవరప్రసాద్ కు అడుగడుగునా శ్రీదేవి మద్దతుదారులు అడ్డుపడుతున్నారు. దీంతో.. వైసీపీలో ఈ అంతర్గత పోరు ప్రతిపక్షాలకు అనుకోని ఆయుధంగా మారుతోంది. ఇక శ్రీదేవి బాటలోనే మరికొందరు ఎమ్మెల్యేలకు జగన్ చెక్ పెడతారని.. వారంతా ఆల్టర్నేట్ వెదుక్కోవాల్సిన అవసరం వస్తుందని అంటున్నారు.
Also Read
- AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- PM Modi 12 Years Governance: డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
- Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
ఇక గతంలో గన్నవరం పంచాయితీ కూడా ఇలాగే హాట్ హాట్ గా సాగి ముగిసిపోయింది. అంతేకాదు హిందూపురం విషయంలో అంతర్గత పోరు ఇంకా సమసిపోలేదు. మరోసారి ఇప్పుడు కొత్తగా తాడికొండ నియోజకవర్గం గొడవ మొదలైంది. దీంతో.. ఈ పంచాయితీ సజ్జల వద్ద ఫైనల్ అవుతుందా.. లేక సీఎం వద్దకు వెళ్తుందా అనేది వేచి చూడాలి.
Nellore YCP : నెల్లూరు వైసీపీలో ఆయన రాజకీయ స్టైలే వేరు.. అందుకే స్వపక్షంలో విపక్షంగా శ్రీధర్ రెడ్డి
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!