Inter Exams: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. వార్షిక పరీక్షల ఫీజు గడువు పొడిగింపు..
Inter Exams: ఏపీలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇంటర్ బోర్డు శుభవార్త చెప్పింది. జరగబోయే వార్షిక పరీక్షల ఫీజు గడువును ప్రభుత్వం పొడిగించింది. వివరాల లోకి వెళ్తే.. ఏపీలో ప్రస్తుతం ఇంటర్ మొదటి సంవత్సరం, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు 2024 మార్చిలో వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ చదివే విద్యార్థులు 2024 మార్చిలో జరగబోయే వార్షిక పరీక్షలకు ఫీజు చెల్లించేందుకు డిసెంబరు 5 వరకు అవకాశం కల్పిస్తున్నట్టు ఇంటర్ బోర్డు ప్రకటించింది.
Read also:Minister Meruga Nagarjuna: జగన్ ప్రభుత్వంలో దళితుల తలరాతలు మారాయి..
Also Read
- Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్లైన్స్లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
- Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
- TDP నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం.. చంద్రబాబు ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం
- AP SSC Results 2026: రేపే ఏపీ టెన్త్ ఫలితాలు.. ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు..
ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ చదివే విద్యార్థులు 2024 మార్చిలో జరగబోయే వార్షిక పరీక్షలకు ఫీజు చెల్లించేందుకు ఉన్న గడువు నవంబరు 30వ తేదీతో ముగిసిందని.. ఈ నేపథ్యంలో విద్యార్థుల సౌలభ్యం కోసం ఫీజు చెల్లించాల్సిన గడువును మరో 5 రోజులు పెంచుతూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుందని.. కావున విద్యార్థులు డిసెంబరు 5 వరకు ఎలాంటి ఆలస్యం రుసుం చెల్లించకుండానే ఎగ్జామ్ ఫీజులు చెల్లించవచ్చని ఆయన తెలిపారు. కాగా డిసెంబరు 5వ తేదీ లోపు పరీక్ష ఫీజు చెల్లించని యెడల రూ.1000 ఆలస్య రుసుంతో డిసెంబరు 15 వరకు పరీక్ష ఫీజు చెల్లించే వెసులుబాటు ఉందని వెల్లడించారు. కనుక ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ చదువుతున్న విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుం చెల్లించకుండానే డిసెంబరు 5వ తేదీ వరకు వార్షిక పరీక్ష ఫీజును చెల్లించవచ్చు. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించు కోవాల్సిందిగా ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ సూచించారు.
తాజావార్తలు
-
Malla Reddy: పార్టీ మార్పుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు..
-
Players Caught Vaping: మ్యాచ్ మధ్యలో ఈ-సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కిన ప్లేయర్స్ వీళ్లే..
-
Arshdeep Singh Trolls: రీల్స్, గర్ల్ఫ్రెండ్పై కాదు.. బౌలింగ్పై దృష్టి పెట్టు సింగ్ సాబ్!
-
Rs 397 Crore Transformer Scam: ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో రూ.397 కోట్ల స్కామ్.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు..
-
Redmi Pad 2: రెడ్మి ప్యాడ్ 2 టాబ్లెట్ విడుదల.. 7600mAh బ్యాటరీ, డ్యూయల్ స్పీకర్లు.. తక్కువ ధరకే
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో