కరోనాకు ఆయుర్వేద మందుతో ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయారు కృష్ణపట్నం ఆనందయ్య. అయితే ఇప్పుడు ఆనందయ్య కరోనా మందు పంపిణీపై సందిగ్ధత నెలకొంది. రేపు సాయంత్రం నెల్లూరుకు ఐసీఎంఆర్ బృందం రానుంది. అయితే నిన్నటి నుండి నెల్లూరులోనే ఆయుష్ బృందం ఉన్న విషయం తెలిసిందే. ఇక ఆనందయ్య కరోనా మందును సోమవారం ఐసీఎంఆర్, ఆయుష్ బృందాలు కలిసి పరిశీలించనున్నాయి. ఈ రెండు బృందాల పరిశీలన తర్వాత మందు పంపిణీ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇక తాజాగా ఆనందయ్యను కలిసిన పేర్ని నాని మందు తయారీ వివరాలను తెలుసుకున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.