Somesh Kumar: ఏపీలో రిపోర్ట్ చేయనున్న సోమేష్ కుమార్.. ఆయన కోరిక అదే నట..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్ను రిలీవ్ చేస్తున్నట్టు పేర్కొన్న కేంద్రం.. ఆయన్ను ఏపీకి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 12వ తేదీలోగా సోమేష్ కుమార్ ఏపీలో రిపోర్టు చేయాలని మంగళవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.. తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన కొన్ని గంటల్లోనే ఈ ప్రక్రియ పూర్తి అయిపోయింది.. అయితే, సోమేష్ కుమార్ ఏపీకి వెళ్లే అవకాశం లేదనే వార్తలు వచ్చాయి.. ఏపీకి వెళ్లడానికి సోమేష్ కుమార్ విముఖత చూపుతున్నారని.. పదవీ విరమణ చేయడానికి మరింత సమయం ఉన్నా.. ఇప్పుడే వీఆర్ఎస్ తీసుకుంటారని.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు దగ్గర ఏదో ఒక పోస్టులో ఉంటారనే ప్రచారం కూడా సాగింది.. అయితే, ఆయన అనూహ్యంగా.. ఏపీలో రిపోర్ట్ చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది..
Read ALso: America: భారీ సాంకేతిక లోపం.. అమెరికా అంతటా నిలిచిన విమానాలు
Also Read
- Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
- President Murmu AP Visit: విశాఖ పర్యటనకు రాష్ట్రపతి.. గిరిజన వర్సిటీ స్నాతకోత్సవానికి ముర్ము..
- Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. కృష్ణలంక పీఎస్ సీసీటీవీలపై ఏసీపీ టీమ్ ఫోకస్..
- Sai Krishna Missing Case: సాయి కృష్ణ కుటుంబానికి అండగా ప్రభుత్వం.. సీఎం భరోసాతో సంతృప్తి వ్యక్తం చేసిన తల్లి
రేపు అనగా గురువారం రోజు ఆంధ్రప్రదేశ్కు వెళ్లనున్నారు సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్.. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులతో ఏపీలో రిపోర్ట్ చేసేందుకు సిద్ధం అయ్యారు.. రేపు ఉదయం 11 గంటల తర్వాత ఏపీ సచివాలయానికి వెళ్లే అవకాశం ఉందని.. ఆ తర్వాత మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశం అవుతారని ప్రచారం సాగుతోంది.. కాగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా మూడేళ్ల క్రితం బాధ్యతలు స్వీకరించిన సోమేష్ కుమార్ రాజకీయా పార్టీల నుంచి అనేక ఆరోపణలు, విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.. అయితే, వాటిని పట్టించుకోకుండా ప్రభుత్వ వ్యవస్థను ముందుకు నడిపిన ఐఏఎస్ అధికారిగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా ప్రభుత్వానికి ఆదాయ వనరులను సృష్టించడంలో ఆయన పనితీరుపై సీఎం కేసీఆర్ ప్రశంసలు కురిపించారట..
మొత్తంగా డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం నుండి రిలీవ్ చేయబడిన సోమేష్ కుమార్.. డీఓపీటీ నిర్దేశించిన గడువుకు అనుగుణంగా గురువారం ఆంధ్రప్రదేశ్లో విధుల్లో చేరే అవకాశం ఉంది. సమాచారం ప్రకారం.. ఆయన రేపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డిని కలవాలని నిర్ణయించుకున్నారు. జవహర్రెడ్డిని కలిసి జాయినింగ్ రిపోర్టును సమర్పించనున్నారు.. మూడు సంవత్సరాలకు పైగా అత్యున్నత పదవిలో పనిచేసిన సోమేష్ కుమార్.. ఆంధ్ర ప్రభుత్వంలో చేరడం ద్వారా సానుకూల సంకేతం పంపాలని మరియు చివరి వరకు.. అంటే పదవీ విరమణ వయస్సు వచ్చే వరకు సేవ చేయాలని భావిస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ సంవత్సరం సోమేష్ కుమార్ సివిల్ సర్వెంట్గా ఎక్కడైనా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని సందేశం పంపాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.. దీంతో, ఆయన ఏపీ ప్రభుత్వంలో చేరడాన్ని వ్యతిరేకిస్తున్నాననే ఆరోపణలకు అవకాశం లేకుండా చేస్తారని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
-
Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
-
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
ట్రెండింగ్
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!