Husband Notorious Plan: రెండో భార్య కోసం భర్త ఘాతుకం.. ఏం చేశాడో తెలిస్తే షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మానవత్వం మంటగలిసిపోతోంది. సొంతవారినే కిరాతకంగా చంపిన కర్కశత్వం. కట్టుకున్న భార్యను,కడుపున పుట్టిన కూతురిని కడతేర్చిన మూర్ఖత్వం.. రెండో భార్య మోజులో మొదటి భార్య హత్యకు ప్లాన్ వేసి కన్న కూతురికి తన పోలిక రాలేదని.. ఏడాది వయసున్న చిన్నారితో పాటు భార్యను భర్త చంపేసిన ఘటన తిరుపతి జిల్లాలో సంచలనం కలిగిస్తోంది. తిరుపతి జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్యను ,తనకు పుట్టిన బిడ్డలను అతి కిరాతకంగా హతమార్చిన భర్త ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తిరుపతి జిల్లా గురవరాజుపల్లె ఎస్టీ కాలనీకి చెందిన కుమార్, పావని రెండు సంవత్సరాల క్రితం ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఏడాది క్రితం పుట్టిన కుమార్తె అమృతకు తన పోలిక రాలేదని భార్యను కుమార్ వేధించేవాడు. చివరకి భార్యను, బిడ్డను అడ్డు తొలగించుకునేందుకు గత ఆదివారం చేపలు పట్టుకుందామంటూ పావనిని రాళ్ల కాలువ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను గాయపరిచి బిడ్డతో పాటు నీళ్లలో తోసి చంపేశాడు.
Also Read
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- APL: విద్యార్థులకు శుభవార్త.. ఏపీఎల్ మ్యాచ్లకు ఉచిత ప్రవేశం..
- Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
- Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
Read Also: Sonali Phogat Death Case: బీజేపీ లీడర్ సోనాలి ఫోగాట్ హత్య కేసులో సీబీఐ విచారణ
మూడు రోజుల నుంచి కుమార్తె, మనవరాలు కన్పించకపోవడంతో పావని తల్లిదండ్రులు.. కుమార్ ని ప్రశ్నించారు. సమాధానం చెప్పకపోవడంతో రేణిగుంట అర్బన్ పోలీసులను ఆశ్రయించారు పావని కుటుంబ సభ్యులు. మొదట తనకు సంబంధం లేదని వాదించాడు. పోలీసులు తనదైన శైలిలో విచారణ చేపట్టడంతో భార్యాబిడ్డలను చంపిన స్థలానికి పోలీసులను కుమార్ తీసుకెళ్లాడు. ఎయిర్పోర్టు సమీపంలోని కాలువలో తేలియాడుతున్న పావని,చిన్న బిడ్డ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అయితే హత్యకు బిడ్డకు పోలికలు రాలేదని అనే కారణమే కాకుండా….పావనితో గొడవలు ఉన్న సమయంలోనే పుత్తూరుకు చెందిన ఓ యువతిని రహస్యంగా వివాహం చేసుకున్నాడు కుమార్. రెండో భార్య మోజులోపడి పావని అడ్డు తొలగించుకోవడానికి బిడ్డ తన పోలికలు లేవని వేధించేవాడని స్దానికులు చెబుతున్నారు ..పక్కా ప్లాన్ ప్రాకారం పావనినీ వేధించి ,నిందలు వేసి హత్యకు ప్లాన్ వేసినట్లు స్దానికులు చెబుతున్నారు. రెండో భార్య ,కుమార్ ఇద్దరూ కలసి హత్యకు ప్లాన్ చేశారు. కన్నబిడ్డ సహా పావనిని చంపినట్లు పోలీసులు విచారణలో తేలింది. పావని మైనర్ అని కూడా చెబుతున్నారు. ఈ కేసుని క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు రేణిగుంట పోలీసులు.
Read Also: TFPC: సినీ కార్మికుల వేతనాలపై కీలక నిర్ణయం తీసుకున్న నిర్మాతల మండలి
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!