Honey Trap: యువకుడికి యువతి గాలం… రెండున్నర లక్షలు హాంఫట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈజీ మనీకోసం అర్రులు చాస్తోంది యువత. వివిధ మార్గాల్లో యువకులను ట్రాప్ చేసి వారి అకౌంట్లను కొల్లగొడుతున్నారు. ఆన్ లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి.. పరిచయంలేని వ్యక్తులు పంపే మెసేజ్ ల జోలికి వెళ్ళొద్దంటూ పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా కొందరు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి లక్షలకి లక్షలు పోగొట్టుకుంటున్నారు. ఏలూరు జిల్లా భీమడోలులో అధిక వడ్డీలు ఇస్తామని పోస్టల్ ఉద్యోగి ఏడులక్షలు పోగొట్టుకున్న ఉదంతం మర్చిపోకముందే అదే జిల్లాలో మరోసారి సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు.
ఉపాధికోసం ఊరుగాని ఊరు వచ్చిన యువకుడిని హనీ ట్రాప్ తో బొల్తా కొట్టించారు సైబర్ కేటుగాళ్లు. సూపర్ వైజర్ ఉద్యోగం చేస్తూ కష్టపడి సంపాదించుకున్న సొమ్మును అతనికే తెలియకుండా ఊడ్చిపాడేసారు. ప్రీతి పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి వీడియోకాల్ చేయడానికి ఇరవై రూపాయలు రిఛార్జి చేయమంటూ వచ్చిన మెసెజ్ కు స్పందించిన క్షణాల్లోనే అతని అకౌంట్ నుంచి ఏకంగా రెండున్నర లక్షలు మాయం చేసేసారు సైబర్ నేరగాళ్లు.
Also Read
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
- AP Crime: ఏపీలో దారుణం.. మైనర్ బాలికపై రెండేళ్లుగా అత్యాచారం.. నలుగురిపై కేసు నమోదు
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్..
- Kharif Water Release: ఖరీఫ్కు నీటి విడుదలపై ప్రభుత్వం ఫోకస్.. కృష్ణా, గోదావరి డెల్టాలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం
బాపట్ల జిల్లా చీరాల నుంచి ఉపాధి నిమిత్తం ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు వచ్చిన దేవాన గణేష్ అనే వ్యక్తి సైబర్ నేరగాళ్లకు చిక్కి రెండున్నర లక్షలు పొగొట్టుకున్నాడు. ఫేస్ బుక్ ద్వారా ప్రీతి అనే పేరుతో పరిచయం ఏర్పడింది. కొద్దిరోజులు ఛాటింగ్ నడిచింది. అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో టెలిగ్రామ్ వీడియోకాల్ మాట్లాడుకుందామంటూ ప్రీతి ఐడి నుంచి ఒక లింక్ షేరయ్యింది. అసలే అమ్మాయి…ఆమెతో వీడియో కాల్ అంటే మాములుగా ఉండదని భావించి వెనుకాముందు ఆలోచించకుండా వచ్చిన లింక్ డౌన్లోడ్ చేసాడు. వెంటనే వీడియోకాల్ కలిపి గణేష్ మాట్లాడటం మొదలు పెట్టిన కొద్దిసేపటికే నెట్ బ్యాలెన్స్ అయిపోతుందని వెంటనే 20రూపాయలతో రీఛార్జి చేయాలని ప్రీతి ఒక నెంబర్ ఇచ్చింది.
వెంటనే యువతి చెప్పిన నెంబర్ కు గణేష్ 20రూపాయలు రీఛార్జి చేశాడు. ఇరవై రూపాయలు కట్ అయినట్టుగా రావాల్సిన మెసేజ్ లో ఏకంగా రెండున్నరలక్షలు డెబిట్ అయినట్లు వచ్చింది. మెసేజ్ చూడగానే గణేష్ ఖంగు తిన్నాడు. సైబర్ నేరగాళ్లు పంపే మెసేజ్ జోలికి వెళితే ఏం జరుగుతుందో అర్ధమయ్యే సరికి కష్టపడి సంపాదించిన సొమ్ము కనిపించకుండా పోయింది. చిన్నపాటి నిర్లక్ష్యం ఎంతటి ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందో అర్ధం చేసుకున్న గణేష్ బ్యాంకుకు వెళ్లి వివరాలు సేకరించాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ లోని బ్యాంకుకు రెండున్నరలక్షలు జమ అయినట్లు తేలింది. మోసపోయానని గ్రహించిన బాధితుడు చేసేది లేక పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై కేసు నమోదు చేసిన చేబ్రోలు పోలీసులు విచారణ చేపట్టారు. యూపీలోని బ్యాంక్ అకౌంట్ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు.
Crime News: యాక్సిడెంట్లో ముగ్గురు మృతి, 3 గంటలపాటు రాస్తారోకో
తాజావార్తలు
-
SEYON : శివకార్తికేయన్ & కమల్ హాసన్ ‘సెయాన్’ షూటింగ్ స్టార్ట్
-
Salman Khan: స్కూల్ పిల్లల కోసం..సల్మాన్ రూ.15 కోట్ల విరాళం..
-
Health Awareness Wedding: ఆలోచింపజేస్తున్న ఈ వధూవరుల నిర్ణయం.. ఆ టెస్ట్ తర్వాతే వివాహబంధంలోకి అడుగుపెట్టిన జంట
-
Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బలహీనత బయటపడిందా?.. రాజస్థాన్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..