Minister Anitha: మత్స్యకారులతో రాజకీయాలు చేయొద్దు..
- బల్క్ డ్రగ్పార్క్ విషయంలో మత్స్యకారుల ఆందోళనపై స్పందించిన హోంమంత్రి అనిత..
- బయట వ్యక్తులు వచ్చి మత్స్యకారులను రెచ్చగొట్టారు.. మత్స్యకారులతో రాజకీయాలు చేయొద్దు..
- సమస్య పరిష్కారం కోసం రాజయ్యపేట రావాలని మత్స్యకారులు కోరారు..
- హెటిరో కంపెనీతో రాజయ్య పేట గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు: హోంమంత్రి అనిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Anitha: ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనితకు అనకాపల్లిలో చేదు అనుభవం ఎదురైంది. బల్క్ డ్రగ్ పార్క్ కు వ్యతిరేకంగా నక్కపల్లి మండలం రాజయ్య పేట గ్రామస్తులు హోంమంత్రి అనిత కాన్వాయ్ ను అడ్డుకుని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బల్క్ డ్రగ్ పార్క్ పై రాజయ్యపేట ప్రజలను బయట వ్యక్తులు వచ్చి రెచ్చగొట్టారు అని ఆరోపించింది. మత్స్యకారులతో దయచేసి రాజకీయాలు చేయవద్దు అని కోరింది. పోలీసులు ఎవ్వరైనా అనుచితంగా ప్రవర్తిస్తే వారి తరపున నేను క్షమాపణ కోరుతున్నాను.. 16 రోజులుగా రాజయ్య పేట గ్రామంలో బల్క్ డ్రగ్ పార్క్ మీద ధర్నా జరుగుతోంది.. సమస్య పరిష్కారం కోసం రాజయ్య పేట రావాలని ప్రజలు కోరారు.. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఇక్కడకు వచ్చాను.. రాజయ్య పేట గ్రామం టీడీపీ కంచుకోట.. 2014, 2019, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అత్యధిక మెజార్టీటీ ఇచ్చారు అని మంత్రి అనిత గుర్తు చేశారు.
Read Also: YouTube Premium Lite: ఇకపై యాడ్స్ కు బైబై.. YouTube Premium Lite భారత్ లో ప్రారంభం.. తక్కువ ధరకే
Also Read
- OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Nara Lokesh: బాధిత కుటుంబాలకు భరోసా.. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం: మంత్రి నారా లోకేష్
- CGST Superintendent: రూ.50 వేలు లంచం.. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ సీజీఎస్టీ (CGST) సూపరింటెండెంట్..
అయితే, 2024 ఫిబ్రవరిలో వైసీపీ ప్రభుత్వం వర్చువల్ గా శంకుస్థాపన చేశారు అని హోంమంత్రి అనిత తెలిపింది. అప్పటి వైసీపీ నాయకులు పాలాభిషేకాలు చేశారు.. ఎన్డీయే ప్రభుత్వంలో మోడీ విశాఖలో మరల శంకుస్థాపన చేశారు.. హెటిరో కంపెనీ వలన రాజయ్య పేట గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు.. రాజయ్య పేట గ్రామస్తులు అన్ని పార్టీలు నాయకులు, ప్రజలతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పాను.. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకు వెళ్తాను.. రాజయ్య పేట ప్రజల కోరిక మేరకు బల్క్ డ్రగ్ పార్క్ పనులు తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించామని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించింది.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!