Godavari Floods: పోలవరం ముంపు మండలాలు అతలాకుతలం..! ఇళ్లు ఖాళీ చేస్తున్న ప్రజలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోదావరి ఉగ్రరూపం దాల్చింది.. భద్రాచలం దగ్గర క్రమంగా వరద ఉధృతి పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది.. దీంతో.. దిగువ ప్రాంతంలో ప్రజలు అల్లాడిపోతున్నారు.. ముఖ్యంగా పోలవరం ముంపు మండలాల్లో పరిస్థితి దయనీయంగా తయారింది.. గోదావరి ఉగ్రరూపంతో అతలాకుతలం అవుతున్నాయి పోలవరం ముంపు మండలాలు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు ప్రజలు.. ఇప్పటికే అనేక గ్రామాలు జల దిగ్బంధంలోకి వెళ్లిపోగా.. మరోవైపు గంట గంటకు పెరుగుతున్న నీటి మట్టం.. ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది.. వేలేరుపాడు మండల కేంద్రం సహా 30 గ్రామాలను ఇప్పటికే వరదనీరు చుట్టుముట్టింది..
Read Also: CM YS Jagan: గుడ్న్యూస్ చెప్పిన ఏపీ సీఎం.. 2,61,516 మందికి లబ్ధి
Also Read
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
మరోవైపు, రేపకాగోమ్ము, కోయిదా, కట్కూరు, కన్నాయిగూడెం, వేలేరుపాడు, నల్లారం, జగన్నాథపురం వంటి పలు గ్రామాలు ఇప్పటికే నీటమునిగాయి.. భద్రాచలంలో గోదావరి నీటి మట్టం 70 అడుగులకు చేరితే కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు జల సమాధి అవుతాయనే ఆందోళనతో ప్రజలు వణికిపోతున్నారు.. లంక గ్రామాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరుతుండడంతో.. ఏటి గట్ల మీద బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు ప్రజలు.. అధికారులు బియ్యం ఇచ్చి వెళ్లారని, ఎక్కడ వండుకోవాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. పిల్లలకు పాలు కూడా దొరకడం లేదని ఆవేదన చెందుతున్నారు.. ఇక, పునరావాస కేంద్రాల్లో భోజన సౌకర్యం కూడా లేదని.. అక్కడికొచ్చి ఏం చేయాలని ప్రశ్నిస్తున్నారు లంక గ్రామాల ప్రజలు.. గోదావరి ఉధృతి మరింత పెరిగితే అల్లకల్లోలంగా లంక గ్రామాల్లో పరిస్థితి మారుతుందనే ఆందోళన మాత్రం వెంటాడుతూనే ఉంది.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!