High School Students Protest: మా హైస్కూల్ మాకే కావాలి.. సీజేకి విద్యార్ధుల లేఖాస్త్రాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమ పాఠశాల అంటే వారికెంతో అభిమానం..తమకు విద్యాబుద్ధులు నేర్పించే పాఠశాలను వేరేచోటికి తరలించడాన్ని వారు నిరసించారు. హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి మాయదార్లపల్లి విద్యార్థులు లేఖలు రాయడం చర్చనీయాంశంగా మారింది. మా పాఠశాల మాకే కావాలి.మాకు చదువును దూరం చెయ్యవద్దు అంటూ వేడుకున్నారు. గత 45 రోజులుగా పోరాటం చేస్తున్న విద్యార్థులు.. హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం మాయదార్లపల్లి గ్రామం మారుమూల ప్రాంతం. ఎక్కడో విసిరి వేయబడ్డట్లు ఉన్న కర్ణాటక బార్డర్ లో చిట్ట చివరి గ్రామాలైన ఎలాంటి అభివృద్ధి పనులకు నోచుకోని కనీసం మండల కేంద్రానికి చేరుకోవాలంటే సరైన బస్సు సౌకర్యం కూడా సరిగ్గా లేని గ్రామం మాయదార్లపల్లి గ్రామం. అలాంటి గ్రామంలో గత 45 రోజులుగా ఆ విద్యార్థులను బసాపురం స్కూల్ నందు విలీనం చేయటాన్ని నిరసిస్తూ ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బడి బయట ఉన్నాం అయినా కూడా మమ్ములను పట్టించుకున్న నాథుడు లేడని వారు తమ గోడును వెళ్ళబోసుకున్నారు.
Read Also: God Father Teaser: కాపీ చేసి మళ్లీ దొరికిపోయిన తమన్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
Also Read
- Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
- Off The Record : సర్వేపల్లి సవాల్: అక్కడ డ్యూటీ చేయాలంటేనే అధికారుల గుండెల్లో వణుకు!
- Off The Record : కూటమిలో చిచ్చు.. విజయవాడ సీట్ల పంచాయతీ తేలేదెప్పుడు?
- AP Weather: ఏపీలో విభిన్న వాతావరణం.. ఒకవైపు వడగాల్పులు.. మరోవైపు వర్ష సూచన.!
చివరికి పెద్దల సలహా మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తి ,ప్రధాన న్యాయస్థానం, నేలపాడు అమరావతి- పిన్ 522 237 అను అడ్రస్ కు పోస్ట్ కార్డు ద్వారా లేఖలు రాశారు..
గౌరవనీయులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దివ్య సన్నిధానానికి నమస్కరించి వ్రాయునది ఏమనగా?
సార్! నేను అనంతపురం జిల్లా కుందుర్పి మండలం మాయదార్లపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నాను. మా పాఠశాలలోని 6,7,8, తరగతులను బసాపురం ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు. కాని మేము మా ఊరి నుండి దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరంలో కుంట అను ప్రాంతంలో మా పెద్దలు అక్కడే నివసిస్తున్నారు. మేము అక్కడి నుండి పాఠశాలకు చేరుకోవడానికి నాలుగు కిలోమీటర్లు వంకలు వాగలు చెట్ల వెంబడి పుట్ల వెంబడి నడుచుకుంటూ మాయదార్లపల్లి పాఠశాలకు చేరుకుంటున్నాము. మా తరగతులను బసాపురం గ్రామంలో ఉన్న పాఠశాలకు విలీనం చేయడంతో మేము మరల మాయదార్లపల్లి గ్రామం నుండి మరో మూడు కిలోమీటర్లు నడిచి బసాపురం గ్రామంలోని పాఠశాలకు చేరుకోవాలంటే చాలా కష్టం.
అందుకనే మా ఇంట్లో ని పెద్దలు మా చదువులు మధ్యలోని ఆపు చేయించి మమ్ములను మా తోటి విద్యార్థులను బడి మానివేయించి మా పొలాల్లోని పనులకు మా పశువులను గొర్రెలను మేపడానికి మమ్ములను సిద్ధం చేస్తున్నారు. కావున దయగల మహాప్రభువులు మా పాఠశాల తరగతులను మా ఊరిలోనే నిర్వహించే విధంగా చేస్తే బాగా చదువుకుంటాం. లేదంటే మా తల్లిదండ్రులు మమ్ములను ఎటు పనికి రాకుండా పశువుల కాపర్లుగా గొర్రెల కాపర్లుగా తదితర పనులకు పెట్టబోతున్నారు. అంతేకాకుండా మా పాఠశాల నాడు నేడు పనులన్నీ పూర్తి కాబడి సుందరంగా రూపురేఖలు తిద్దుకుంది. కావున తమరు పెద్ద మనసుతో మా పాఠశాల తరగతులను బసాపురం గ్రామంలో విలీనం చేయకుండా …మా చదువులు మధ్యలో ఆగిపోకుండా మమ్మల్ని ఎలాగైనా కాపాడాలని మిమ్ములను వేడుకుంటున్నాము.
అంటూ పోస్ట్ కార్డు ద్వారా ఈరోజు ఉత్తరాలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి రాసుకున్నారు. మరి ప్రధాన న్యాయమూర్తి ఈ చిన్నారుల విన్నపానికి ఎలా స్పందిస్తారో చూద్దాం.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!