High Court: వైఎస్ వివేకా హత్య కేసు.. నిందితులకు బెయిల్ ఇవ్వొద్దు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితులకు బెయిలుపై ఇవాళ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది.. సీబీఐ, నిందితుల తరపున వాదనలు విన్న హైకోర్టు.. తదుపరి విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసింది.. అయితే, సీబీఐ విచారణ ఎప్పుడు పూర్తవుతుందో చెప్పాలని ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది.. వివేకా హత్య కేసు వెనుక కుట్ర ఉందని తెలిపిన సీబీఐ.. జైలులో ఉండే నిందితులు సాక్ష్యులను బెదిరిస్తున్నారని వాదించింది..
Read Also: North Korea: ఉత్తర కొరియాలో తొలి కరోనా కేసు.. దేశవ్యాప్తంగా లాక్డౌన్
Also Read
- Ambati Rambabu : రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పాలన సాగుతోంది.. చంద్రబాబువి గారడీ విద్యలు
- Minister Narayana : విశాఖ అభివృద్ధికి సరికొత్త మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్ తరహాలో సెమీ రింగ్ రోడ్డు
- RK Roja: అసెంబ్లీలోనే బలనిరూపణ జరగాలి.. గవర్నర్ ముందే ఎందుకు? రోజా ఫైర్
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
మరోవైపు, నిందితులు 6 నెలల నుంచి జైలులోనే ఉన్నారని నిందితుల తరపు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. ఏ-4 కన్ఫెషన్ స్టేట్మెంట్ మినహా వేరే సాక్ష్యం కూడా లేదని వాదించారు.. దేవిరెడ్డి శివశంకర రెడ్డి, గజ్జల ఉమామహేశ్వర రెడ్డి, సునీల్ యాదవ్లకు బెయిల్ ఇవ్వాలని హైకోర్టుకు విన్నవించారు న్యాయవాదులు.. ఆంక్షలు విధించైనా బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.. ఇక, నిందితులు బయటకొస్తే సాక్ష్యులను బెదిరించే ప్రమాదం ఉందని సీబీఐ న్యాయవాది వాదించారు.. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు.. విచారణకు వారం పాటు వాయిదా వేసింది.
తాజావార్తలు
-
Beetroot Buttermilk Recipe: నిమిషాల్లో బీట్రూట్ మజ్జిగ రెడీ.. ప్రతిరోజూ తాగితే ముఖం మెరిసిపోతుంది..!
-
Tamilanadu CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్.. దశాబ్దాల నాటి డీఎంకే-ఏఐఏడీఎంకే శకానికి తెర
-
Shubman Gill: ఏబీ డి విలియర్స్ను వెనక్కి నెట్టి.. కోహ్లీ, రోహిత్ సైతం సాధించలేని రికార్డ్ క్రియేట్ చేసిన శుభ్మన్ గిల్
-
Trisha: నీలిరంగు పట్టుచీరలో మెరిసిపోయిన త్రిష.. విజయ్ ప్రమాణ స్వీకార వేడుకలో స్పెషల్ అట్రాక్షన్!
-
Pooja Hegde : పూజాహెగ్డే ‘డబుల్ స్టాండర్డ్స్’.. నెటిజన్స్ ట్రోలింగ్