Harirama Jogaiah: వాలంటీర్ వ్యవస్థపై పవన్ కళ్యాణ్కు హరిరామ జోగయ్య లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harirama Jogaiah Wrote Letter To Pawan Kalyan On AP Volunteers Issue: తన వారాహి యాత్రలో భాగంగా ఏలూరు సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి.. ‘వాలంటీర్ వ్యవస్థ’ టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. ఓవైపు పవన్ వ్యాఖ్యలను వాలంటీర్లు, వైసీపీ నేతలు ఖండిస్తుండగా.. మరోవైపు పవన్ వ్యాఖ్యల్ని కొందరు సమర్థిస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థలోని లోపాల్ని ఎత్తిచూపుతున్నారు. ఇప్పుడు తాజాగా మాజీమంత్రి హరిరామ జోగయ్య వాలంటీర్ వ్యవస్థపై పవన్ కళ్యాణ్కు ఓ లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన వాలంటీర్ల సమస్యల్ని ప్రవస్తావిస్తూ.. వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.
Pawan Kalyan: మచ్ వెయిటింగ్ అనౌన్స్మెంట్ వచ్చేసింది ‘బ్రో’…
Also Read
- Medico Priyanka: రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి.. బ్రెయిన్ డెడ్గా నిర్ధారించిన వైద్యులు..
- VMC: మోగిన మున్సిపల్ కార్మికుల సమ్మె సైరన్.. రేపటి నుంచే..
- CM Chandrababu: గిరిజన ఉత్పత్తుల స్టాళ్ల సందర్శన.. బ్రాండింగ్పై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం..
- AP Assembly: ఈ నెల 17వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
వాలంటీర్ వ్యవస్థ పేరుతో.. సుమారు రెండున్నర లక్షల మంది నెలకు రూ.5 వేల చాలీచాలని జీతంతో బ్రతుకుతున్నారని హరిరామ జోగయ్య ఆ లేఖలో తన ఆవేదన వ్యక్తం చేశారు. కనీస ఉపాధి కరువైన ఈ రోజుల్లో.. ప్రభుత్వం ఎంతమందికి ఉపాధి కల్పిస్తోందని ప్రశ్నించారు. వాలంటీర్ వ్యవస్థలో అధికశాతం వైసీపీ వారే ఉన్నారన్నది వాస్తవమని ఉద్ఘాటించారు. రాష్ట్ర ఎన్నికల మెమో 818 ప్రకారం.. వాలంటీర్ వ్యవస్థలో వైసీపీ వారు ఎక్కువగా ఉండటం వల్లే, ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్ వ్యవస్థని ఉపసంహరించుకోవాలని జీవో ఇవ్వడం జరిగిందని అన్నారు. వాలంటీర్లను సంక్షేమ పథకాల అమలు కంటే.. అధికార పార్టీ తన ప్రయోజనం కోసమే ఎక్కువగా ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. అవసరమైతే వాలంటీర్ వ్యవస్థని రద్దు చేయాలన్న పవన్ సంకల్పం మంచిదేనని సమర్థించారు.
Jeevan Readdy: బీసీలకు ఆర్థిక సాయం చేయని ప్రభుత్వం తెలంగాణ లోనే ఉంది..
అయితే.. ఈ వాలంటీర్ వ్యవస్థని పూర్తిగా రద్దు చేయడం కన్నా, కొన్ని ప్రతిపాదనలతో పునర్నిర్మించుకుంటే మంచిదని హరిరామ జోగయ్య తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. వాలంటీర్ వ్యవస్థలో ఉన్న రెండున్నర లక్షలమంది మహిళలకు వాలంటీర్ ఉద్యోగాలు కల్పించాలని ఆకాంక్షించారు. వాలంటీర్లకు కనీసం 10వ తరగతి విద్యార్హత ఉండాలని, వారికి కనీస వేతనం రూ.10 వేలు కేటాయించాలని కోరారు. జనాభా నిష్పత్తిలో కులాలకు ప్రాధాన్యత కల్పించాలన్నారు. ఈడబ్ల్యూఎస్లో సంవత్సరానికి 8 లక్షల ఆదాయం మించని కుటుంబాలకే ఉద్యోగం అందాలన్నారు. జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన నియామక కమిటీలను ఏర్పాటు చేసి.. అర్హులైన వారికే ఉద్యోగ లబ్ధి కలిగించాలన్నారు. రాజకీయ పార్టీలకు చెందిన వారిని వాలంటీర్లుగా నియమించకూడదని డిమాండ్ చేశారు. అలాగే.. 21 నుండి 30 సంవత్సరాల లోపు వయసున్న వారే ఉద్యోగానికి అర్హులుగా నిర్ణయించాలన్నారు.
తాజావార్తలు
-
AAA Cinemas : వైజాగ్లో బన్నీ కొత్త అడ్డా.. AAA మల్టీప్లెక్స్ గ్రాండ్ ఓపెనింగ్.!
-
DGP Anand : నక్సలిజం పోయింది.. ఇప్పుడు డేంజర్ ఇదే.. డీజీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
-
Congress: ‘‘బీజేపీని మెప్పించే వ్యాఖ్యలు వద్దు’’.. శశి థరూర్పై కాంగ్రెస్ ఫైర్..
-
IND Vs SL: సిరాజ్ మియా వీర విహారం.. 6,1,6,6,6 దూకుడు బ్యాటింగ్తో ఇండియా విజయం..
-
Mamitha Baiju: ‘ప్రేమలు’ బ్యూటీ సంచలన నిర్ణయం.. ఇకపై వాటికి గుడ్బై!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!