AP Half Day Schools: నేటి నుంచి ఒంటిపూట బడులు.. ఆ స్కూళ్లకు మాత్రం సెలవులు..
AP Half Day Schools: ఆంధ్రప్రదేశ్లో ఇవాళ్టి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి.. ఓవైపు ఇవాళ్టి నుంచే టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే కాగా.. ఒంటిపూట బడులు కూడా ఈ రోజు నుంచి ఆరంభం అవుతున్నాయి.. 1వ తరగతి నుండి 10వ తరగతులకు ఉదయం 7.45 నుండి 12.30 వరకు ఒంటిపూట పాఠశాలలను ప్రకటించింది విద్యాశాఖ.. రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, ప్రైవేట్ గుర్తింపు పొందిన అన్ఎయిడెడ్ పాఠశాలలతో సహా అన్ని మేనేజ్మెంట్ పాఠశాలల్లో ఇవాళ్టి నుంచి అంటే 03-4-2023 నుండి చివరి పని దినం వరకు అంటే 30-4-2023 వరకు ఒంటిపూట బడులు నిర్వహిస్తారు..
Read Also: UPI Transaction Limit: ఫోన్ పే, గూగుల్ పేలో రోజూ రూ.లక్షల్లో పంపుతామంటే కుదరదు
Also Read
- వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
- Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
- Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
- AP Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సర్కార్ అలర్ట్.. కీలక ఆదేశాలు జారీ
ఇదే సమయంలో .. ప్రత్యేకంగా ఎస్ఎస్సీ పరీక్షా కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో, పరీక్ష రోజుల్లో (మొత్తం ఆరు రోజులు) ఎలాంటి తరగతులు నిర్వహించారు.. ఈ పాఠశాలలు 03.04.23 నుండి 30.04.23 వరకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ సెలవు దినాలలో ఆరు రోజుల పాటు పరిహార తరగతులను నిర్వహించాలని విద్యాశాఖ స్పష్టం చేసింది.. పరిహార తరగతులు కూడా హాఫ్ డే షెడ్యూల్ను అనుసరించాల్సి ఉంటుంది.. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 3,349 కేంద్రాల్లో టెన్త్ పరీక్షలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే కాగా.. ఆ పాఠశాలల్లో పరీక్షల రోజుల్లో ఎలాంటి క్లాస్లు నిర్వహించరు. మరోవైపు.. ఏప్రిల్ నెలలో 2వ శనివారాన్ని పని చేసేదిగా పరిగణించాలి. అన్ని పాఠశాలల్లో తగినంత తాగునీరు అందించాలని.. బహిరంగ ప్రదేశాల్లో/ చెట్ల కింద తరగతులు నిర్వహించరాని విద్యాశాఖ ప్రొసీడింగ్స్ విడుదల చేసింది.
Read Also: Astrology : ఏప్రిల్ 3, సోమవారం దినఫలాలు
ఇక, విద్యార్థుల ఉపయోగం కోసం ప్రతి పాఠశాలలో కొన్ని ఓరల్ రీ-హైడ్రేషన్ సొల్యూషన్ (ORS) సాచెట్లను అందుబాటులో ఉంచుకోండి, ఏదైనా పిల్లవాడు సన్/హీట్ స్ట్రోక్ బారిన పడినట్లయితే, వైద్య & ఆరోగ్య శాఖ సమన్వయంతో వాటిని ఉపయోగించాలని విద్యాశాఖ కమిషనర్ స్పష్టం చేశారు.. మరోవైపు.. మధ్యాహ్న భోజన సమయంలో స్థానికులతో సమన్వయంతో విద్యార్థులకు మజ్జిగ అందించాలని స్పష్టం చేసింది విద్యాశాఖ.
తాజావార్తలు
-
Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
-
Sorakaya Garelu Recipe: కరకరలాడే కమ్మని సొరకాయ గారెలు.. 10 నిమిషాల్లో ఇలా రెడీ చేసేయండి.!
-
Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
-
Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!