GVL Narasimha Rao: రాష్ట్రంలో శాంతిభద్రతలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GVL Narasimha Rao Sensational Comments On AP Govt: ఆంధ్ర రాష్ట్రంలో శాంతిభద్రతలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దగ్గర ఏపీలో ‘లా అండ్ ఆర్డర్’పై పూర్తి రిపోర్ట్ ఉందన్నారు. విశాఖలో ఎంపీ కుటుంబం కిడ్నాప్ ఘటనలో నిజాలు బయటకు రావాలని డిమాండ్ చేశారు. విశాఖలో భూ మాఫియా జరుగుతోందని ఆరోపించారు. విశాఖ భూ దందాపై గత ప్రభుత్వాలు వేసిన సిట్ రిపోర్టులు ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు. ఆ రిపోర్ట్ ఆధారంగా సీఎం జగన్ భూ సెటిల్మెంట్లు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సిట్ రిపోర్టులు అడిగితే ఇస్తామని పేర్ని నాని అన్నారని.. అవి ఎప్పుడు ఇస్తారో క్లారిటీ ఇవ్వాలని నిలదీశారు. బాపట్ల జిల్లాలో చిన్న పిల్లవాడిని పెట్రోల్ పోసి తగలపెట్టడం అమానుషమని జీవీఎల్ మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తల్లో రాక్షస మనస్తత్వం నింపారని.. వైసీపీ అంటే రాక్షస సంత అని ప్రకటించుకోవాలని ఘాటు వ్యాఖ్యలు సంధించారు. ముఖ్యమంత్రి ఆ పిల్లవాడి కుటుంబానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగనవని చెప్పి, సీఎం తన పదవికి రాజీనామా చేయాలని కోరారు. ఏపీలో ఇసుక, మైనింగ్పై సీబీఐ ఎంక్వరి జరగాలన్నారు. ఏపీలో ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని మండిపడ్డారు.
Tadipatri Crime: తాడిపత్రిలో దారుణం.. మద్యం తాగొద్దన్నందుకు నిప్పంటించాడు
Also Read
- Nara Lokesh: ఇప్పుడు 'మావిగన్'.. రేపు బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ కలిపి ‘బెన్తాహై’ అంటారేమో..!
- Simhachalam Temple Land: సింహాచలం భూముల వివాదంపై హైకోర్టు సీరియస్.. ప్రభుత్వానికి నోటీసులు
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ఇంతకుముందు కూడా.. వచ్చే ఎన్నికల్లో తమకు బీజేపీ అండగా ఉంచకపోవచ్చని సీఎం చేసిన వ్యాఖ్యలపై జీవీఎల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆ వ్యాఖ్యల్ని తప్పుపెట్టిన ఆయన.. ఏపీలో బీజేపీ ఏనాడూ వైసీపీకి అండగా లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రధాన పార్టీగా ఎదిగేందుకు తాము ప్రయత్నిస్తున్నామని.. వైసీపీకి ఇప్పటివరకు బీజేపీ అండగా ఉందనే విధంగా తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జగన్ చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి భ్రమ రాజకీయాలను జగన్ మానుకోవాలని హితవు పలికారు. వైసీపీతో బీజేపీకి ఎలాంటి లింకులు లేవన్న ఆయన.. వైసీపీతో తాము ఎప్పుడూ పోరాటంలోనే ఉన్నామన్నారు. అమిత్ షా వంటి కీలక నేత రాష్ట్రానికి వచ్చి వైసీపీ అవినీతిని ఎండగడుతూ, అన్ని విషయాలపై స్పష్టంగా మాట్లాడితే… మీరు మళ్లీ డ్రామా రాజకీయాలు మాట్లాడతారా? అని మండిపడ్డారు. అమిత్ షా చెప్పినట్టు విశాఖలో భూదందా నిజమేనని, దమ్ముంటే సిట్ నివేదికలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
Ashes 2023: సూపర్ ఫీల్డ్ సెట్ చేసిన బెన్ స్టోక్స్.. తడిసిపోయిన స్టీవ్ స్మిత్ ప్యాంట్!
తాజావార్తలు
-
Congress vs BRS: తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత.. హరీశ్ రావును అడ్డుకున్న పోలీసులు!
-
Ather 450X Overtones: ఏథర్ కొత్త 450X ఓవర్టోన్స్ సిరీస్.. 900W ఫాస్ట్ ఛార్జర్, వాయిస్ కమాండ్తో మరింత స్మార్ట్!
-
Shruti Haasan : ఐడెంటిటీ కోల్పోతున్న శృతి హాసన్
-
Jeans Cleaning Tips: కొత్త జీన్స్ త్వరగా పాతబడుతుందా..? అసలు కారణం మీ ఉతికే విధానమే..!
-
Maharashtra Politics: కాంగ్రెస్లో శరద్ పవార్ పార్టీ విలీనం ? మహారాష్ట్ర రాజకీయాల్లో తెరవెనుక నడుస్తున్న హైడ్రామా ఇదే!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?