GVL Narasimha Rao: రాష్ట్రంలో శాంతిభద్రతలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయి
GVL Narasimha Rao Sensational Comments On AP Govt: ఆంధ్ర రాష్ట్రంలో శాంతిభద్రతలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దగ్గర ఏపీలో ‘లా అండ్ ఆర్డర్’పై పూర్తి రిపోర్ట్ ఉందన్నారు. విశాఖలో ఎంపీ కుటుంబం కిడ్నాప్ ఘటనలో నిజాలు బయటకు రావాలని డిమాండ్ చేశారు. విశాఖలో భూ మాఫియా జరుగుతోందని ఆరోపించారు. విశాఖ భూ దందాపై గత ప్రభుత్వాలు వేసిన సిట్ రిపోర్టులు ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు. ఆ రిపోర్ట్ ఆధారంగా సీఎం జగన్ భూ సెటిల్మెంట్లు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సిట్ రిపోర్టులు అడిగితే ఇస్తామని పేర్ని నాని అన్నారని.. అవి ఎప్పుడు ఇస్తారో క్లారిటీ ఇవ్వాలని నిలదీశారు. బాపట్ల జిల్లాలో చిన్న పిల్లవాడిని పెట్రోల్ పోసి తగలపెట్టడం అమానుషమని జీవీఎల్ మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తల్లో రాక్షస మనస్తత్వం నింపారని.. వైసీపీ అంటే రాక్షస సంత అని ప్రకటించుకోవాలని ఘాటు వ్యాఖ్యలు సంధించారు. ముఖ్యమంత్రి ఆ పిల్లవాడి కుటుంబానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగనవని చెప్పి, సీఎం తన పదవికి రాజీనామా చేయాలని కోరారు. ఏపీలో ఇసుక, మైనింగ్పై సీబీఐ ఎంక్వరి జరగాలన్నారు. ఏపీలో ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని మండిపడ్డారు.
Tadipatri Crime: తాడిపత్రిలో దారుణం.. మద్యం తాగొద్దన్నందుకు నిప్పంటించాడు
Also Read
- Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
- Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
ఇంతకుముందు కూడా.. వచ్చే ఎన్నికల్లో తమకు బీజేపీ అండగా ఉంచకపోవచ్చని సీఎం చేసిన వ్యాఖ్యలపై జీవీఎల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆ వ్యాఖ్యల్ని తప్పుపెట్టిన ఆయన.. ఏపీలో బీజేపీ ఏనాడూ వైసీపీకి అండగా లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రధాన పార్టీగా ఎదిగేందుకు తాము ప్రయత్నిస్తున్నామని.. వైసీపీకి ఇప్పటివరకు బీజేపీ అండగా ఉందనే విధంగా తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జగన్ చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి భ్రమ రాజకీయాలను జగన్ మానుకోవాలని హితవు పలికారు. వైసీపీతో బీజేపీకి ఎలాంటి లింకులు లేవన్న ఆయన.. వైసీపీతో తాము ఎప్పుడూ పోరాటంలోనే ఉన్నామన్నారు. అమిత్ షా వంటి కీలక నేత రాష్ట్రానికి వచ్చి వైసీపీ అవినీతిని ఎండగడుతూ, అన్ని విషయాలపై స్పష్టంగా మాట్లాడితే… మీరు మళ్లీ డ్రామా రాజకీయాలు మాట్లాడతారా? అని మండిపడ్డారు. అమిత్ షా చెప్పినట్టు విశాఖలో భూదందా నిజమేనని, దమ్ముంటే సిట్ నివేదికలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
Ashes 2023: సూపర్ ఫీల్డ్ సెట్ చేసిన బెన్ స్టోక్స్.. తడిసిపోయిన స్టీవ్ స్మిత్ ప్యాంట్!
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో