Ambati Rambabu: వైసీపీ మాస్ పార్టీ.. జగన్ ఎక్కడకు వెళ్లినా లక్షలాది మంది వస్తున్నారు..
Ambati Rambabu: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. మాస్ పార్టీ అని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు.. అందుకే పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్కడకు వెళ్లినా లక్షలాది మంది ప్రజలు తరలివస్తారని అన్నారు. గుంటూరులో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీని మరింత బలోపేతం చేసే దిశగా సంస్థాగత నిర్మాణం చేపట్టాలని జగన్ ఆదేశించారని అంబటి రాంబాబు తెలిపారు. రానున్న 45 రోజుల్లో ఈ సంస్థాగత నిర్మాణ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే సుధాకరబాబుకు ముఖ్య బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. ఇక, వైసీపీ స్థాపించినప్పటి నుంచే పార్టీ సంస్థాగత నిర్మాణానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ పని చేస్తున్నామని తెలిపారు. గ్రామ స్థాయి వరకు వెళ్లి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ సంస్థాగత నిర్మాణాన్ని ఒక మహాయజ్ఞంగా చేపట్టామని పేర్కొన్నారు. జగన్ ఒక్కరితో ప్రారంభమైన పార్టీ ఈ రోజు వేలాదిగా, లక్షలాదిగా, కోట్లాది మంది కార్యకర్తల పార్టీగా మారిందని అంబటి రాంబాబు అన్నారు.
Read Also: GG W vs UPW W: ఉత్కంఠ మ్యాచులో బోణి కొట్టిన గుజరాత్ జెయింట్స్..!
Also Read
- Ambati Rambabu Hunger Strike: నిరాహార దీక్ష చేపట్టిన అంబటి.. ప్రాణాలకు తెగించైనా మీ సంగతి తేలుస్తా..!
- Ambati Rambabu: పోలీసులకు ఫిర్యాదు చేసిన అంబటి రాంబాబు.. న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తా..
- Divyang Shakti Scheme: దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.. వారికోసం మరింత ఆలోచన చేస్తాం..
- Vegetable Market: మరోసారి తెరపైకి కూరగాయల హోల్ సేల్ మార్కెట్ వివాదం
ఇక, మాజీ ఎమ్మెల్యే సుధాకరబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో బాధ్యత కలిగిన ప్రధాన ప్రతిపక్షంగా వైసీపీ పనిచేస్తోందని, ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాయంటూ విమర్శలు చేశారు. వైసీపీ పాలనలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని, మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేశామని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం దుర్మార్గమైన పాలన సాగుతోందని ఆరోపించారు. ఈ పరిస్థితులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాను మరింత బలోపేతం చేసి కూటమి ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో గుంటూరు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
RTC Conductor Jobs: ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..
-
Ukraine: ట్రంప్ను ప్రసన్నం చేసుకునేందుకు ఉక్రెయిన్ మాస్టర్ ప్లాన్!
-
Vaibhav Sooryavanshi: లక్నోపై చేసిన పరుగులు 8.. అయినా అరుదైన రికార్డు సాధించిన వైభవ్ సూర్యవంశీ..
-
Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
-
LSG vs RR: పొదుపుగా బౌలింగ్ చేసిన లక్నో.. టార్గెట్ ఎతంటే?
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?