Guntur: ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన సచివాలయ ఉద్యోగి రాజారావు.. ఎలుకల మందు ఇచ్చి..
- ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన సచివాలయ ఉద్యోగి
- ఎలుకల మందు ఇచ్చి చనిపో అంటూ యువతికి బెదిరింపులు
- రాజారావుపై యువతి పోలీసులకు ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రేమ పేరుతో దారుణాలకు ఒడిగడుతున్నారు కొందరు వ్యక్తులు. ప్రేమ, పెళ్లి పేరుతో అమాయకపు యువతులను లోబర్చుకుని ప్రాణాలు తీస్తున్నారు. చంపడానికి కూడా వెనకాడడం లేదు. ఈ క్రమంలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ప్రేమ పేరుతో యువతిని మోసం చేశాడు సచివాలయ ఉద్యోగి రాజారావు. అంతేకాదు. యువతిని వదిలించుకునేందుకు జనవరి 15న ఎలుకల మందు ఇచ్చి ఆత్మహత్యకు ప్రేరేపించి రాక్షసత్వం ప్రదర్శించాడు రాజారావు. తనను మోసం చేసిన సచివాలయ ఉద్యోగి రాజారావుపై భాదితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
సచివాలయ ఉద్యోగి రాజారావు యువతి చదువుకునేటప్పటి నుంచి ప్రేమ పేరుతో వెంటపడేవాడు. తనను ప్రేమించాలని బెదిరింపులకు పాల్పడేవాడు. ఈ క్రమంలో అతడి ప్రేమలో పడిన యువతికి బిగ్ షాక్ ఇచ్చాడ రాజారావు. జాబ్ వచ్చిన తర్వాత వివాహం చేసుకోమని యువతి కోరగా మొహం చాటేస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలో జనవరి 15న ప్రేమ పెళ్లి వ్యవహారంపై యువతికి రాజారావుకు మధ్య వివాదం చోటుచేసుకుంది.
Also Read
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
- Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
- Ambati Rambabu: పోలీసులను రాజకీయ కక్షకు వాడుతున్నారు.. అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
ఆ యువతిని వదిలించుకునేందుకు నువ్వు చనిపోవాలనుకుంటే ఎలుకల మందు తిని చనిపో అంటూ యువతిని బెదిరించాడు. అంతేకాదు యువతికి ఎలుకల మందు పేస్టు ప్యాకెట్లు తెచ్చి ఇచ్చాడు. దీంతో తీవ్ర మనోవేధనకు గురైన యువతి ఎలుకల మందు తిని అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఇది గమనించిన ఆమె తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు. ప్రేమ, పెళ్లి పేరుతో తనని మోసం చేసిన రాజారావుపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!