Merugu Nagarjuna: రాజకీయాలలో ఎదుగుతున్న ఒక దళితుడిని టార్గెట్ చేస్తున్నారు.. తప్పు తేలితే దేనికైనా సిద్ధం
- మాజీ మంత్రి మేరుగు నాగార్జున కీలక వ్యాఖ్యలు
- ఎవరో ఒక మహిళ నాపై తాడేపల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది- మేరుగు నాగార్జున
- నేను ఆమెను శారీరకంగా లోబర్చుకుని 90 లక్షలు తీసుకున్నానని ఆరోపిస్తుంది- మేరుగు
- నేను ఏ పరీక్ష కైనా సిద్ధం- మేరుగు నాగార్జున
- రాజకీయాలలో ఎదుగుతూ ఉన్న ఒక దళితుడిని.. పేదవాడిని టార్గెట్ చేస్తున్నారు- మేరుగు
- నా తప్పు తేలితే ఉరి శిక్ష కైన సిద్ధం- మేరుగు నాగార్జున.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ మంత్రి మేరుగ నాగార్జున కీలక వ్యాఖ్యలు చేశారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ.. ఎవరో ఒక మహిళ తాడేపల్లి పోలీసు స్టేషన్లో తనపై ఫిర్యాదు చేసిందని.. తాను ఆమెను శారీరకంగా లోబర్చుకుని, రూ. 90 లక్షలు తీసుకున్నానని ఆరోపిస్తుందని అన్నారు. తాను ఏ పరీక్షకైనా సిద్ధం అని తెలిపారు. రాజకీయాలలో ఎదుగుతూ ఉన్న ఒక దళితుడిని, పేదవాడిని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో తన తప్పు ఉందని తేలితే ఉరి శిక్షకైనా సిద్ధమని పేర్కొన్నారు. తనపై కోపం ఉంటే చంపండి.. అంతేగానీ ఇలాంటి దుష్ప్రచారం చేయకండని ఆయన సూచించారు.
Read Also: Congress: హర్యానా ఫలితాలపై తీవ్ర అసంతృప్తి.. ఈసీపై చట్టపరమైన చర్యలకు వెనకాడబోమని హెచ్చరిక
Also Read
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
- Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
- SRM University Harassment Case: ఎస్ఆర్ఎం వర్సిటీలో లైంగిక వేధింపుల కలకలం.. మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిర్యాదుతో..
- Ambati Rambabu Hunger Strike: నిరాహార దీక్ష చేపట్టిన అంబటి.. ప్రాణాలకు తెగించైనా మీ సంగతి తేలుస్తా..!
కుట్ర ప్రకారం ఇలాంటి ఫిర్యాదులు చేస్తున్నారు.. తాను మంత్రిగా ఉన్నప్పుడు అనేక మంది కలిసి ఉంటారు.. కానీ వ్యక్తిగతంగా ఎవరితో పరిచయం లేదని మేరుగ నాగార్జున తెలిపారు. ఈ విషయంలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తా.. ఏ ఆధారంతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తనపై తప్పుడు కేసులు పెట్టబోతున్నారు.. తాను దేనికైనా సిద్ధమని అన్నారు. ఆధారాలు లేని అసత్య ఆరోపణలు చేస్తే ప్రైవేట్ కేసులు పెడతానని వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయంపై పోలీసులు నిజాయితీగా దర్యాప్తు చేయాలని అన్నారు.
Read Also: IND vs NZ: తడబడ్డ టీమిండియా బ్యాటర్లు.. మొదటిరోజు ఆట ముగిసే సరికి
కాగా.. మేరుగ నాగార్జునపై గుంటూరు జిల్లాలో కేసు నమోదైంది. విజయవాడకు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో తాడేపల్లి పోలీసులు కేసును నమోదు చేశారు. తనకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ. 90 లక్షలు తీసుకొని మోసం చేశారని ఆరోపిస్తూ తాడేపల్లి సీఐ కల్యాణ్రాజ్కు ఆ మహిళ ఫిర్యాదు చేసింది. తన వద్ద తీసుకున్న డబ్బులను తనకు తిరిగి ఇవ్వాలని మాజీ మంత్రిని అడిగితే బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో తనకు ఎలాగైనా న్యాయం చేయాలని, మేరుగ నాగార్జున తనకు ఇవ్వాల్సిన రూ. 90లక్షలను తనకు ఇప్పించాలని పోలీసులను ఆ మహిళ కోరారు.
తాజావార్తలు
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
-
RR Vs LSG: మార్ష్ వీర విహారం.. రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ టార్గెట్..
-
Chairmans Desk : ప్రపంచమంతా మాంద్యం గుప్పిట్లో ఉంటే.. దక్షిణాది మాత్రం సేఫ్ జోన్లోనే ఉందా..? |
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!