Merugu Nagarjuna: రాజకీయాలలో ఎదుగుతున్న ఒక దళితుడిని టార్గెట్ చేస్తున్నారు.. తప్పు తేలితే దేనికైనా సిద్ధం
- మాజీ మంత్రి మేరుగు నాగార్జున కీలక వ్యాఖ్యలు
- ఎవరో ఒక మహిళ నాపై తాడేపల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది- మేరుగు నాగార్జున
- నేను ఆమెను శారీరకంగా లోబర్చుకుని 90 లక్షలు తీసుకున్నానని ఆరోపిస్తుంది- మేరుగు
- నేను ఏ పరీక్ష కైనా సిద్ధం- మేరుగు నాగార్జున
- రాజకీయాలలో ఎదుగుతూ ఉన్న ఒక దళితుడిని.. పేదవాడిని టార్గెట్ చేస్తున్నారు- మేరుగు
- నా తప్పు తేలితే ఉరి శిక్ష కైన సిద్ధం- మేరుగు నాగార్జున.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ మంత్రి మేరుగ నాగార్జున కీలక వ్యాఖ్యలు చేశారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ.. ఎవరో ఒక మహిళ తాడేపల్లి పోలీసు స్టేషన్లో తనపై ఫిర్యాదు చేసిందని.. తాను ఆమెను శారీరకంగా లోబర్చుకుని, రూ. 90 లక్షలు తీసుకున్నానని ఆరోపిస్తుందని అన్నారు. తాను ఏ పరీక్షకైనా సిద్ధం అని తెలిపారు. రాజకీయాలలో ఎదుగుతూ ఉన్న ఒక దళితుడిని, పేదవాడిని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో తన తప్పు ఉందని తేలితే ఉరి శిక్షకైనా సిద్ధమని పేర్కొన్నారు. తనపై కోపం ఉంటే చంపండి.. అంతేగానీ ఇలాంటి దుష్ప్రచారం చేయకండని ఆయన సూచించారు.
Read Also: Congress: హర్యానా ఫలితాలపై తీవ్ర అసంతృప్తి.. ఈసీపై చట్టపరమైన చర్యలకు వెనకాడబోమని హెచ్చరిక
Also Read
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Tenali: మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం.. పోలీసుల వేధింపులే కారణమంటూ ఆవేదన.!
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
- Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
కుట్ర ప్రకారం ఇలాంటి ఫిర్యాదులు చేస్తున్నారు.. తాను మంత్రిగా ఉన్నప్పుడు అనేక మంది కలిసి ఉంటారు.. కానీ వ్యక్తిగతంగా ఎవరితో పరిచయం లేదని మేరుగ నాగార్జున తెలిపారు. ఈ విషయంలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తా.. ఏ ఆధారంతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తనపై తప్పుడు కేసులు పెట్టబోతున్నారు.. తాను దేనికైనా సిద్ధమని అన్నారు. ఆధారాలు లేని అసత్య ఆరోపణలు చేస్తే ప్రైవేట్ కేసులు పెడతానని వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయంపై పోలీసులు నిజాయితీగా దర్యాప్తు చేయాలని అన్నారు.
Read Also: IND vs NZ: తడబడ్డ టీమిండియా బ్యాటర్లు.. మొదటిరోజు ఆట ముగిసే సరికి
కాగా.. మేరుగ నాగార్జునపై గుంటూరు జిల్లాలో కేసు నమోదైంది. విజయవాడకు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో తాడేపల్లి పోలీసులు కేసును నమోదు చేశారు. తనకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ. 90 లక్షలు తీసుకొని మోసం చేశారని ఆరోపిస్తూ తాడేపల్లి సీఐ కల్యాణ్రాజ్కు ఆ మహిళ ఫిర్యాదు చేసింది. తన వద్ద తీసుకున్న డబ్బులను తనకు తిరిగి ఇవ్వాలని మాజీ మంత్రిని అడిగితే బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో తనకు ఎలాగైనా న్యాయం చేయాలని, మేరుగ నాగార్జున తనకు ఇవ్వాల్సిన రూ. 90లక్షలను తనకు ఇప్పించాలని పోలీసులను ఆ మహిళ కోరారు.
తాజావార్తలు
-
West Bengal: బెంగాల్ ‘‘పుష్ప’’ అరెస్ట్.. అభిషేక్ సన్నిహితుడి ఆటకట్టు..
-
Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
-
Thaman : ‘ఎల్లమ్మ’ కథపై తమన్ షాకింగ్ కామెంట్స్..
-
Infosys: ఉద్యోగాల ఊస్ట్ సమయంలోనూ ఈ కంపెనీ ఏకంగా కోటి రూపాయల జీతాలు ఎలా ఇస్తోంది?
-
Mamata Banerjee: మమతకు బిగ్ షాక్.. ఇండియా కూటమి సమావేశం వేళ ఎంపీల తిరుగుబాటు..
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!