Prevent Heart Attack: వేకువజాము గుండెపోటుకు బాపట్ల ప్రొఫెసర్ చెక్.. పేటెంట్ ఇచ్చిన కేంద్రం..
- బాపట్ల ఫార్మసీ కాలేజీలో ప్రొఫెసర్ ఘనత..
- తన విద్యార్థులతో కలిసి చేసిన పరిశోధన చేసిన డాక్టర్ వి.సాయికిషోర్..
- పేటెంట్ మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం..
- ప్రజల జీవన శైలిలో వస్తున్న మార్పులపై డా కిషోర్ సాయి పరిశోధన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prevent Heart Attack: గుండెపోటు.. ఇప్పుడు ఇది సర్వ సాధారణంగా వినిపిస్తోంది.. రాత్రి వరకు బాగానే ఉన్నాడు.. తెల్లారేసరికి హార్ట్ ఎటాక్తో చనిపోయాడు అనే మాటలు నిత్యం ఎక్కడో ఓ దగ్గర వింటూనే ఉన్నా.. ఇక, హార్ట్ ఎటాక్కు ఏజ్తో సంబంధంలేకుండా.. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎంతో మంది ప్రాణాలు తీశాయి.. అయితే, బాపట్ల ఫార్మసీ కాలేజీలో ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ వి.సాయికిషోర్ తన విద్యార్థులతో కలిసి చేసిన పరిశోధనకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 25వ తేదీన పేటెంట్ మంజూరు చేసింది.. ప్రస్తుత ప్రజల జీవన శైలిలో వస్తున్న మార్పులపై డా కిషోర్ సాయి పరిశోధన చేశారు.. సాధారణంగా గుండెపోటు ఎక్కువగా తెల్లవారుజామున వస్తోంది. దాని కారకాలు తెల్లవారుజామున విడుదల కావడమే అందుకు కారణమని.. రాత్రి వేళల్లో కొన్ని ప్రత్యేక మెడిసిన్స్ వాడితే తెల్లవారుజామున గుండెపోటు రావనీ, తన పరిశోధనలో తేల్చారు..
Read Also: Allu Arjun : పుష్ప-2 సెన్సార్ రిపోర్ట్ ఇదే.. ఇక థియేటర్స్ లో జాతరే.!
Also Read
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Ambati Rambabu: ఏఐ వీడియో వివాదంలో అంబటి రాంబాబు.. కేసు నమోదు..
- Mudragada Padmanabham సంతాప సభలో ఆసక్తికర దృశ్యం.. ఆలింగనం చేసుకున్న బోండా ఉమ, అంబటి రాంబాబు.!
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
ఇక, ఇప్పటి వరకు తెల్లవారుజామున గుండెపోటు వస్తే ఆ వెంటనే వైద్యం అందడం లేదని ఈ పరిస్థితిని అదిగమించాలన్న ఆలోచనతో పరిశోధకులు ప్రయత్నం చేశారు.. ఈ ప్రతికూలతలను అధిగమించి, గుండె పోటు కారకాలను నిరోధించేలా ఔషధాలు రూపొందించడంపై ఆచార్యుడు సాయి కిషోర్.. రిసెర్చ్ స్టూడెంట్స్ వంశీకృష్ణ, వాణి ప్రసన్న పరిశోధనలు చేశారు. నాలుగున్నర సంవత్సరాలకు పైగా శ్రమించి, గుండెపోటు కారకాలను నిరోధించే ప్రతి నిరోధకాలు శరీరంలో తగిన సమయంలో విడుదల చేయడం ద్వారా ముప్పు లేకుండా చూడవచ్చు అని తెలుసుకున్నారు.. రాత్రి భోజనం తర్వాత 9 గంటలకు ఈ క్యాప్సిల్ వేసుకుంటే, అర్ధరాత్రి రెండు గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రతినిరోధకాలను విడుదల చేసి, గుండెపోటు సమర్థవంతంగా అడ్డుకుంటుందని పరిశోధనల ద్వారా నిరూపించారు.. ఈ సంవత్సరం మే నెలలో పేటెంట్స్ కోసం అప్లై చేస్తే.. తాజాగా పేటెంట్స్ రైట్స్ మంజూరు చేసింది కేంద్రం.. 20 సంవత్సరాలకు పేటెంట్స్ రావడం సంతోషంగా ఉందని తెలిపారు ప్రొఫెసర్ వి.సాయికిషోర్.
తాజావార్తలు
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
-
Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!