Prevent Heart Attack: వేకువజాము గుండెపోటుకు బాపట్ల ప్రొఫెసర్ చెక్.. పేటెంట్ ఇచ్చిన కేంద్రం..
- బాపట్ల ఫార్మసీ కాలేజీలో ప్రొఫెసర్ ఘనత..
- తన విద్యార్థులతో కలిసి చేసిన పరిశోధన చేసిన డాక్టర్ వి.సాయికిషోర్..
- పేటెంట్ మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం..
- ప్రజల జీవన శైలిలో వస్తున్న మార్పులపై డా కిషోర్ సాయి పరిశోధన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prevent Heart Attack: గుండెపోటు.. ఇప్పుడు ఇది సర్వ సాధారణంగా వినిపిస్తోంది.. రాత్రి వరకు బాగానే ఉన్నాడు.. తెల్లారేసరికి హార్ట్ ఎటాక్తో చనిపోయాడు అనే మాటలు నిత్యం ఎక్కడో ఓ దగ్గర వింటూనే ఉన్నా.. ఇక, హార్ట్ ఎటాక్కు ఏజ్తో సంబంధంలేకుండా.. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎంతో మంది ప్రాణాలు తీశాయి.. అయితే, బాపట్ల ఫార్మసీ కాలేజీలో ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ వి.సాయికిషోర్ తన విద్యార్థులతో కలిసి చేసిన పరిశోధనకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 25వ తేదీన పేటెంట్ మంజూరు చేసింది.. ప్రస్తుత ప్రజల జీవన శైలిలో వస్తున్న మార్పులపై డా కిషోర్ సాయి పరిశోధన చేశారు.. సాధారణంగా గుండెపోటు ఎక్కువగా తెల్లవారుజామున వస్తోంది. దాని కారకాలు తెల్లవారుజామున విడుదల కావడమే అందుకు కారణమని.. రాత్రి వేళల్లో కొన్ని ప్రత్యేక మెడిసిన్స్ వాడితే తెల్లవారుజామున గుండెపోటు రావనీ, తన పరిశోధనలో తేల్చారు..
Read Also: Allu Arjun : పుష్ప-2 సెన్సార్ రిపోర్ట్ ఇదే.. ఇక థియేటర్స్ లో జాతరే.!
Also Read
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
- Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
- Ambati Rambabu: పోలీసులను రాజకీయ కక్షకు వాడుతున్నారు.. అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
ఇక, ఇప్పటి వరకు తెల్లవారుజామున గుండెపోటు వస్తే ఆ వెంటనే వైద్యం అందడం లేదని ఈ పరిస్థితిని అదిగమించాలన్న ఆలోచనతో పరిశోధకులు ప్రయత్నం చేశారు.. ఈ ప్రతికూలతలను అధిగమించి, గుండె పోటు కారకాలను నిరోధించేలా ఔషధాలు రూపొందించడంపై ఆచార్యుడు సాయి కిషోర్.. రిసెర్చ్ స్టూడెంట్స్ వంశీకృష్ణ, వాణి ప్రసన్న పరిశోధనలు చేశారు. నాలుగున్నర సంవత్సరాలకు పైగా శ్రమించి, గుండెపోటు కారకాలను నిరోధించే ప్రతి నిరోధకాలు శరీరంలో తగిన సమయంలో విడుదల చేయడం ద్వారా ముప్పు లేకుండా చూడవచ్చు అని తెలుసుకున్నారు.. రాత్రి భోజనం తర్వాత 9 గంటలకు ఈ క్యాప్సిల్ వేసుకుంటే, అర్ధరాత్రి రెండు గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రతినిరోధకాలను విడుదల చేసి, గుండెపోటు సమర్థవంతంగా అడ్డుకుంటుందని పరిశోధనల ద్వారా నిరూపించారు.. ఈ సంవత్సరం మే నెలలో పేటెంట్స్ కోసం అప్లై చేస్తే.. తాజాగా పేటెంట్స్ రైట్స్ మంజూరు చేసింది కేంద్రం.. 20 సంవత్సరాలకు పేటెంట్స్ రావడం సంతోషంగా ఉందని తెలిపారు ప్రొఫెసర్ వి.సాయికిషోర్.
తాజావార్తలు
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!