Ambati Rambabu: జగన్ తిరుమల పర్యటన రద్దుకు ప్రభుత్వమే కారణం..
- వైఎస్ జగన్.. తిరుమల పర్యటన రద్దుకు కారణం ప్రభుత్వమే..
- తిరుమలలో ఉన్న వాతావరణం ప్రజలందరూ గమనించారు..
- జగన్ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు నోటీసులు ఇచ్చారు..
- అన్యమతస్తులు వస్తే డిక్లరేషన్ ఇవ్వాలని బోర్డులు పెట్టారు..
- జగన్ పర్యటన రద్దు అవగానే బోర్డులు తీసేశారన్న అంబటి రాంబాబు..
Ambati Rambabu: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. తిరుమల పర్యటన వాయిదా పడటానికి ప్రభుత్వమే కారణం అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.. వైఎస్ జగన్ తిరుమల పర్యటన వాయిదా పడటంపై స్పందించిన ఆయన.. దీనికి ప్రభుత్వమే కారణం అన్నారు.. నిన్న తిరుమలలో ఉన్న వాతావరణం ప్రజలందరూ గమనించారు.. జగన్ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు నోటీసులు ఇచ్చారు.. అన్యమతస్తులు వస్తే డిక్లరేషన్ ఇవ్వాలని బోర్డులు పెట్టారు.. జగన్ పర్యటన రద్దు అవగానే బోర్డులు తీసేశారని విమర్శించారు.. ఇది వైఎస్ జగన్ పై కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్ర.. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగాగా ఉన్నప్పుడు జగన్ తిరుమల దర్శనానికి వెళ్లారు.. కానీ, అప్పుడు అడ్డుకోలేదు.. కానీ, ఇప్పుడు మతాలు గుర్తు వస్తున్నాయి.. ఇలాంటి దుర్మార్గపు కార్యక్రమాలకు, రాజకీయాలకు దేవుడ్ని వాడుకుంటే ఆ వెంకటేశ్వర స్వామి చూస్తూ ఊరుకోడు అని వ్యాఖ్యానించారు.. జగన్ కు కుట్ర, కుతంత్రాలు తెలియవు.. నిజాయితీగా మాట్లాడటమే తెలుసు అని తెలిపారు మాజీ మంత్రి అంబటి రాంబాబు..
Read Also: Musheer Khan: టీమిండియా ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ సోదరుడికి ముషీర్కు ఘోర ప్రమాదం..
Also Read
- Ambati Rambabu Hunger Strike: నిరాహార దీక్ష చేపట్టిన అంబటి.. ప్రాణాలకు తెగించైనా మీ సంగతి తేలుస్తా..!
- Ambati Rambabu: పోలీసులకు ఫిర్యాదు చేసిన అంబటి రాంబాబు.. న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తా..
- Divyang Shakti Scheme: దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.. వారికోసం మరింత ఆలోచన చేస్తాం..
- Vegetable Market: మరోసారి తెరపైకి కూరగాయల హోల్ సేల్ మార్కెట్ వివాదం
కాగా, ముందుగా నిర్ణయించిన ప్రకారం.. శుక్రవారం రోజు రాత్రికి తిరుమలకు వైఎస్ జగన్ చేరుకోవాల్సి ఉండగా.. ఈ రోజు ఉదయం శ్రీవారిని దర్శించుకునేది ఉంది.. ఇక, జగన్ పర్యటన నేపథ్యంలో.. పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు తిరుమల, తిరుపతికి చేరుకోకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.. వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చారు.. మరోవైపు.. ఉన్నట్టుండి.. తన తిరుమల పర్యటన రద్దు చేసుకుంటున్నట్టు వైఎస్ జగన్ ప్రకటించిన విషయం విదితమే.. అంతేకాదు.. నా మతం మానవత్వం.. డిక్లరేషన్లో రాసుకోండి అంటూ ఈ సందర్భంగా వైఎస్ జగన్ వ్యాఖ్యానించిన విషయం విదితమే..
తాజావార్తలు
-
Salary Delay: సారీ బాస్.. ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! ఈసారి ‘ఫస్ట్’కు శాలరీ రాదు.. ఎందుకో తెలుసా?
-
Putin – Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా ‘ఫుల్’ సపోర్ట్..!
-
AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
-
RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!