YSRCP: తాడికొండ నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలు.. డైలమాలో పడిన ఎమ్మెల్యే గ్రూప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP: గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం అదనపు సమన్వయకర్తగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ను వైసీపీ అధిష్టానం నియమించడంతో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వర్గీయులు భగ్గుమన్నారు. ఎమ్మెల్యే శ్రీదేవితో కలిసి ఏకంగా జిల్లా అధ్యక్షురాలు మేకతోటి సుచరిత ఇంటివద్ద ఆందోళనకు దిగారు. డొక్కా గో బ్యాక్ అంటూ ప్రెస్ మీట్లు పెట్టి మరీ నినాదాలు చేశారు. కానీ రెండు రోజుల్లో నేతలు సన్నాయి నొక్కులు మొదలుపెట్టారు. నిన్నటివరకూ డొక్కాకు అదనపు సమన్వయకర్త పదవి రద్దు చెయ్యాలని అధిష్టానాన్ని డిమాండ్ చేసిన ఎమ్మెల్యే వర్గీయులు ఇప్పుడు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటున్నారు. సమన్వయకర్తగా నియమించిన తర్వాత డొక్కా వ్యూహాత్మకంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. సమన్వయకర్తగా నియమించిన తర్వాత తాడికొండ అడ్డరోడ్డువద్ద సమావేశమవుతున్న ఎమ్మెల్యే వర్గీయులను కలిశారు. మళ్లీ ఎందుకు సమావేశమంటూ వారితో నేరుగా మాట్లాడడంతో అక్కడ నేతలకు ఏం మాట్లాడాలో కూడా అర్దం కాని పరిస్థితి ఏర్పడింది. దీంతో మేము మీకు వ్యతిరేకం కాదంటూ సమాధానమిచ్చారు. అంతటితో ఆగని డొక్కా మొదటిసారిగా తుళ్లూరు మండలం వెంకటపాలెం వెంకటేశ్వరస్వామి దేవాలయానికి వెళ్లారు. వెంకన్నను దర్శించుకున్నారు. ఈ పర్యటనలో ఎమ్మెల్యే వర్గీయులు మినహా మిగతా వైసీపీ నేతలు పాల్గొన్నారు.
Read Also: AP Cabinet Meeting: ఈనెల 29న ఏపీ కేబినెట్ సమావేశం.. ప్రతిపాదనలు పంపాలని సీఎస్ ఉత్తర్వులు
Also Read
- Daggubati Purandeswari: 2024 ఫార్ములానే స్థానిక ఎన్నికల్లోనూ.. పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు
- Konaseema Fishermen: 23 రోజుల తర్వాత శుభవార్త.. గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమం
- YS Jagan: 'సీఎంగా ఏం చేస్తున్నా' అని చంద్రబాబు ప్రశ్నించుకోవాలి.. వైఎస్ జగన్ ఫైర్!
- YS Jagan: వర్షాలు లేక సంక్షోభం వస్తే.. సీఎం చంద్రబాబు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు!
ఈ నేపథ్యంలో తాడికొండ నియోజకవర్గంలో డొక్కా మొదటి పర్యటన తర్వాత ఎమ్మెల్యే శ్రీదేవి వర్గీయులు డైలమాలో పడ్డారు. నిన్నటివరకూ ఎమ్మెల్యే ఉండగా సమన్వయకర్తను ఎలా నియమిస్తారంటూ మాట్లాడిన ఎమ్మెల్యే వర్గీయులు ఇప్పుడు కొత్తరాగం అందుకున్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటూ ప్రకటించారు. సమన్వయకర్తగా నియమించిన తర్వాత నియోజకవర్గానికి వస్తున్నట్లు తమకు సమాచారం ఇస్తే తాము కూడా పాల్గొనేవారమంటున్నారు. పార్టీలో గ్రూపులు లేకుండా అందరినీ కలుపుకుపోవాలని కోరుతున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యే శ్రీదేవికి విలువ తగ్గకుండా చూడాలని కూడా కోరుతున్నారు. నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే శ్రీదేవి, ఎమ్మెల్సీ డొక్కా కలిసి నేతలందరిని సమన్వయం చేస్తే ఇబ్బంది తొలగిపోతుందంటున్నారు. మొత్తానికి డొక్కా తొలి పర్యటన ద్వారా ఎమ్మెల్యే వర్గీయులు డిఫెన్స్లో పడేలా చేశారు. ఎమ్మెల్యే శ్రీదేవి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ కలిసి మాట్లాడుకోవాలని నేతలు కోరుతున్నారు. ఇప్పటికే తాను ఎమ్మెల్యేను కలుస్తానని డొక్కా చెప్పారు. ఇద్దరూ కలిసి సమావేశం ఏర్పాటు చేస్తే అంతా సర్దుకుంటుందని వైసీపీ అభిమానులు కోరుతున్నారు.
తాజావార్తలు
-
IND vs SL: జడేజా ఖాతాలో చెత్త రికార్డు.. అందులో నంబర్ వన్!
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల లాటరీకి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే.?
-
NBK111: స్పీడ్ పెంచిన బాలయ్య .. శుక్రవారం డబ్బింగ్, అక్టోబర్ 5న కొత్త షెడ్యూల్!
-
Russia: రష్యాలో గ్యాస్ కెమికల్ కాంప్లెక్స్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
-
Healthy Lifestyle: ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతకాలని ఉందా.. ఈ టైమ్లోనే బ్రేక్ఫాస్ట్, డిన్నర్ చేయండి!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..