Gudivada Amarnath: సాహితీ ఫార్మా అగ్నిప్రమాదంపై ప్రాథమిక నివేదిక.. యంత్రాంగం పకడ్బందీగా ఉందన్న మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudivada Amarnath Reveals First Report On Sahithi Pharma Fire Accident: సాహితీ ఫార్మాలో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక చేరింది. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. ఈ ఘటనపై డిప్యుటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ సహా వివిధ విభాగాలు విచారణ ప్రారంభించాయని అన్నారు. ఉదయం 11:10 గంటలకు సాల్వెంట్ రికవరీ యూనిట్లో ప్రమాదం జరిగిందని ప్రాథమిక నివేదికలో వెల్లడైందని తెలిపారు. సుమారు ఐదు గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ జరిగిందన్నారు. ఈ ఘటనలో మొత్తం ఏడుగురు తీవ్ర గాయాలపాలవ్వగా.. ఇద్దరు మృతి చెందారన్నారు.
Rashmi Gautham : వెరైటీ డ్రెస్సులో కిల్లింగ్ ఫోజులతో మతిపోగొడుతున్న రష్మీ.
Also Read
- AP Weather Report Today: నేడు ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ!
- AP Schools Reopen: నేటి నుంచే బడి గంట.. 2026-27 అకడమిక్ క్యాలెండర్ విడుదల.. హాలిడేస్ లిస్ట్ ఇదే!
- Anantapur Murder: 20 రూపాయల కోసం గొడవ.. సర్ది చెప్పేందుకు వెళ్లిన వ్యక్తిని కొట్టి చంపిన మామా-అల్లుడు!
- APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
నూకరాజు అనే కార్మికుడు 95 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నారని.. ఆయన పరిస్థితి ప్రమాదకరంగా ఉందని మంత్రి అమర్నాథ్ వెల్లడించారు. మరో ముగ్గురు బాధితులకు 50 శాతం పైగా గాయాలు అయ్యాయన్నారు. వీరిలో అంతర్గత అవయవాలు దెబ్బతినడంతో.. వీరి ఆరోగ్యం కొంత క్రిటికల్గా ఉందన్నారు. తాము మెరుగైన వైద్య సేవలు అందిస్తామని.. అవసరమైతే ఎయిర్ లిఫ్ట్ చేసి, హయ్యర్ మెడికల్ సెంటర్కు బాధితుల్ని పంపించాలని సీఎం ఆదేశించారని తెలియజేశారు. సేఫ్టీ ఆడిట్ విషయంలో యంత్రాంగం పకడ్బందీగా వ్యవహరిస్తోందని అన్నారు. ఎల్జీ పాలిమర్స్, బ్రాండిక్స్ ప్రమాదం తర్వాత తాము కీలక నిర్ణయాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రీన్ ఇండస్ట్రీస్ జోన్గా ఉన్న అచ్యుతాపురంను రెడ్ జోన్గా మార్చడంతో.. అక్కడ ఫార్మా కంపెనీలు ఏర్పాటు అయ్యాయని స్పష్టం చేశారు.
Pawan Kalyan: పవన్ హెచ్చరిక.. సైలెన్సర్లు బిగించుకోకపోతే, మంత్రుల చిట్టా విప్పుతా
కాగా.. సాహితీ ఫార్మా కంపెనీలో రెండు రియాక్టర్లు పేలడంతో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కెమికల్స్ని అన్లోడ్ చేస్తున్న సమయంలో రసాయనాలు ఒత్తిడికి గురవ్వడంతో.. కంటెనర్కు నిప్పంటుకుంది. అది నిమిషాల్లో వ్యాప్తి చెందడంతో.. ఫ్యాక్టరీ మొత్తం మంటలు వ్యాపించాయి. ఈ దెబ్బకు సాహితీ ఫార్మా యూనిట్-1 పూర్తిగా కాలి బూడిదైంది. మంటల్ని ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది.. 10 ఫైరింజన్లు, స్కైలిఫ్టర్ల సహాయంతో 5 గంటలు శ్రమించి, ఎట్టకేలకు మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు.
తాజావార్తలు
-
Sing Geetham : వెండితెరపై సింగీతం రాసిన చందమామ కథ
-
AP Weather Report Today: నేడు ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ!
-
AP Schools Reopen: నేటి నుంచే బడి గంట.. 2026-27 అకడమిక్ క్యాలెండర్ విడుదల.. హాలిడేస్ లిస్ట్ ఇదే!
-
FIFA World Cup 2026: మెస్సీ vs రొనాల్డో పోరు.! అభిమానులు ఎదురుచూస్తున్న డ్రీమ్ మ్యాచ్ ఎప్పుడంటే.?
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
ట్రెండింగ్
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!