దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వైరస్ను గుర్తించడానికి సాంకేతిక విధానం అవసరం. ఇప్పటివరకు ఇలాంటి విధానం కలిగి ఉన్న ల్యాబ్లు దేశంలో పుణె, హైదరాబాద్ నగరాల్లోనే అందుబాటులో ఉన్నాయి. కొంచెం ఆలస్యంగా అయినా తాజాగా ఈ ల్యాబ్ ఏపీలో కూడా ఏర్పాటు కావడం విశేషం. విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో జీనోమ్ సీక్వెన్సింగ్ కేంద్రం అందుబాటులోకి వచ్చింది.
Read Also: రూపాయి పంపి రూ.99వేలు పోగొట్టుకున్నాడు
హైదరాబాద్లోని సీసీఎంబీ ఆధ్వర్యంలో విజయవాడ జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్లో అధికారులు పరీక్షలు నిర్వహించనున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల శాంపిల్స్లో కొన్నింటిని ర్యాండమ్ పద్ధతిలో ఇక్కడి ల్యాబ్లో పరీక్షిస్తారు. దీని ద్వారా అవి ఏ రకానికి చెందిన మ్యుటెంట్లో తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఏపీ నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం హైదరాబాద్లోని సీసీఎంబీకి తరలిస్తున్నారు. దీంతో ఒమిక్రాన్ లాంటి మ్యుటెంట్లను గుర్తించడానికి ఇకపై హైదరాబాద్, పుణె లాంటి నగరాలపై ఏపీ ఆధారపడాల్సిన అవసరం ఉండదు.