Gas Leakage: అచ్యుతాపురం సెజ్లో విషవాయువు లీకేజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ జిల్లాలో విషవాయువు లీకేజ్ కలవరం కలిగించింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం పారిశ్రామికవాడ (సెజ్)లో మంగళవారం మరోమారు విషవాయువు లీకేజీ (Gas Leakage) కలకలం రేపింది. వస్త్ర కంపెనీలో విష వాయువు లీకైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పలువురు మహిళలు అస్వస్థతకు గురయ్యారు. విషవాయువుతో ఇబ్బందులు పడిన మహిళలను అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు.
Monkeypox: కలవరపెడుతోన్న మంకీపాక్స్.. టెన్షన్పెడుతోన్న కొత్త కేసులు
Also Read
- AP IAS Transfers 2026: 22 మంది IAS అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్..
- Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
- OTR : టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావుకు గడ్డుకాలమా? పార్టీలో తగ్గిన ప్రాధాన్యతపై చర్చ
- OTR : మంత్రి పార్థసారధిపై మైనింగ్ ఆరోపణలు.. నూజువీడులో రాజకీయ రగడ
ఇదే సెజ్లో రెండు నెలల కిందట గ్యాస్ లీకైన సంగతి తెలిసిందే. మళ్లీ విషవాయువులు వెలువడటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని కార్మికులు మండిపడుతున్నారు. ఇదిలా వుంటే.. మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈ ఘటనపై స్పందించారు. అచ్యుతా పురం విషవాయువు లీకేజీపై అధికారులతో మాట్లాడారు మంత్రి గుడివాడ అమర్నాథ్. బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
విశాఖ కాదు విషాద పట్నం.. లోకేష్
మరోవైపు సీఎం జగన్ విశాఖపట్నాన్ని విషాదపట్నంగా మార్చేశారని మండిపడ్డారు టీడీపీ నేత నారా లోకేష్. విశాఖలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడంలేదు.రెండు నెలల వ్యవధిలోనే రెండుసార్లు గ్యాస్ లీకేజ్ ఘటనలు జరిగాయంటే ప్రజల ప్రాణాల పట్ల ప్రభుత్వ లెక్క లేనితనం స్పష్టమవుతోంది.విశాఖపట్టణంలో జే గ్యాంగ్ కబ్జాలు, దౌర్జన్యాలు, ప్రమాదాలు, విష రసాయనాల లీకులతో ప్రజలు తమ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బతుకుతున్నారు.
ఎల్జీ పాలీమర్స్ మరణ మృదంగం, సాయినార్ ఫార్మా విషాదం మరువకముందే, అచ్యుతాపురం సెజ్ సీడ్స్ కంపెనీలో రెండోసారి విషవాయువులు లీకై వందలమంది మహిళలు తీవ్ర అస్వస్థతకి గురి కావడం తీవ్ర ఆందోళన కలిగించింది.ఉపాధి కోసం వచ్చిన మహిళల ప్రాణాలు పోయినా ఫర్వాలేదు.. కమీషన్లు నెలనెలా అందితే చాలన్నట్టుంది జగన్ పరిపాలన.చనిపోయాక పరిహారం ఇవ్వడం కాదు సీఎం గారూ! వాళ్లు బతికేలా రక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నారా లోకేష్.
సోము వీర్రాజు ఏమన్నారంటే…
అనకాపల్లి బ్రాండిక్స్ కంపెనీలో రసాయన వాయువు లీక్ తో అస్వస్థతకు గురైన మహిళలకు వేగంగా వైద్యం అందించాలి. రెండు నెలల వ్యవధిలో రెండు పర్యాయాలు రసాయనాలు లీక్ కావడమేంటీ..? ప్రభుత్వం తోలు మందంగా వ్యవహరిస్తోంది. పరిశ్రమలపై ప్రభుత్వం పర్యవేక్షణ విరమించుకుందా..? కార్మికులు అస్వస్థతకు గురైతే ప్రభుత్వం ఏం చేస్తోంది? స్థానిక కార్యకర్తలు కార్మికులకు అండగా ఉండాలన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.
CM JaganmohanReddy: జగన్ని కలిసిన టెక్ మహీంద్ర ఎండీ, సీఈవో
తాజావార్తలు
-
Travis Head: చరిత్ర సృష్టించిన కాటేరమ్మకొడుకు.. ఒక్క ఓటుతో సంచలన విజయం..
-
Tariff Risk: ట్రంప్ మరో షాక్.. భారత వస్తువులపై 100 శాతం టారిఫ్లు విధించేలా చట్టం
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!