పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో వంట గ్యాస్ ధరలు పెరుగుతాయని లేదా సరఫరా నిలిచిపోతుందనే వార్తలపై ప్రభుత్వం , అధికారులు కీలక స్పష్టతనిచ్చారు. ఈ యుద్ధ ప్రభావం దేశంలో వంట గ్యాస్ సరఫరాపై ఏమాత్రం ఉండదని, రాష్ట్రవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరా సజావుగానే కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. అయితే, యుద్ధం కారణంగా గ్యాస్ దొరకడం కష్టమవుతుందనే తప్పుడు ప్రచారాల వల్ల ఆంధ్రప్రదేశ్లో సుమారు 30 శాతం వరకు అదనంగా పానిక్ బుకింగ్స్ నమోదవుతున్నాయని,…