Warning: ఏపీ, ఒడిశాలకు పొంచి ఉన్న కార్చిచ్చుల ముప్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వేసవి కారణంగా దేశమంతటా అధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో అడవుల్లో తీవ్రమైన కార్చిచ్చులు సంభవించే అవకాశాలు ఉన్నాయని ఇంధనం, పర్యావరణం, నీటి వనరుల పర్యవేక్షణ మండలి విడుదల చేసిన అధ్యయనం హెచ్చరికలు జారీ చేసింది. భారతదేశంలో 30 శాతం జిల్లాల్లో తీవ్ర కార్చిచ్చులు సంభవించే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది. ముఖ్యంగా ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా, ఒడిశాలోని కుందమాల్ జిల్లాలకు కార్చిచ్చుల ముప్పు ఉందని వార్నింగ్ ఇచ్చింది.
వరదల నుంచి అనావృష్టికి, అనావృష్టి నుంచి వరదలకు మార్పులు సంభవించే ప్రాంతాల్లో గడిచిన రెండు శతాబ్దాల్లో 89 శాతం కార్చిచ్చులు సంభవించినట్లు సీఈఈడబ్ల్యూ నివేదిక వెల్లడించింది. మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా కార్చిచ్చులు చెలరేగడం సహజమేనని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కార్చిచ్చులను నియంత్రించడానికి ప్రభుత్వాలు అధిక నిధులు కేటాయించాలని అభిప్రాయపడింది. అన్యాక్రాంతమైన అటవీ భూముల పునరుద్ధరణ, అటవీ విస్తీర్ణం పెంచడం ద్వారా కార్చిచ్చులను అడ్డుకోవచ్చని.. అడవి బిడ్డల జీవన ఆధారాన్ని కాపాడుకోవచ్చని సీఈఈడబ్ల్యూ ప్రతినిధి అవినాష్ మహంతి సూచించారు.
Also Read
అటు ఇప్పటికే కార్చిచ్చుల కారణంగా అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ విస్తీర్ణం క్రమంగా తగ్గిపోతోంది. మన తప్పిదాల కారణంగా అమెజాన్ అడవులు పునరుద్ధరణకు నోచుకోవడం లేదు. ఇలాగే జరిగితే అడవుల స్థాయి బాగా తగ్గిపోయి గడ్డిమైదానాలుగా మారే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. తొమ్మిది దేశాలలో దాదాపు 50 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అమెజాన్ అడవులకు ఇప్పుడు గడ్డు రోజులు వచ్చాయి.
https://ntvtelugu.com/woman-gave-birth-to-a-child-by-ivf-after-husband-died/
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!