YSRCP Vs TDP: నగరిలో టెన్షన్.. టెన్షన్ …
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంత్రి ఆర్కే రోజా సొంత నియోజకవర్గం నగరిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఓ వైపు దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతిని పురస్కరించుకుని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు బ్యానర్లు, ఫ్లెక్సీలు కడితే.. మరో వైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహిస్తోన్న బాదుడే బాదుడు కార్యక్రమం సందర్భంగా పెద్ద ఎత్తున బ్యానర్లు, ఫ్లెక్సీలు పెట్టాయి టీడీపీ శ్రేణులు.. దీంతో.. నగరి టౌన్లో ఎటు చూసినా వైసీపీ వర్సెస్ టీడీపీ తరహాలో బ్యానర్లు, ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి.. ఇక, బ్యానర్ల ఏర్పాటు విషయంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాల ఘర్షణ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు.. మరి కాసేపట్లో నగరికి బాదుడే బాదుడు కార్యక్రమానికి చంద్రబాబు రానున్న నేపథ్యంలో.. ఎప్పుడు ఏమి జరుగుతుందోనన్న టెన్షన్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు.
Read Also: Today Business Updates: ఇవాళ్టి బిజినెస్ వార్తల్లోని విశేషాలు
Also Read
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..