ఏపీలో దొంగ ఓట్ల కలకలం ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. దొంగ ఓట్లు వేసేందుకు బయట నుంచి వేల మందిని తిరుపతికి తరలించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తిరుపతిలోని లక్ష్మీపురం, కెనడీనగర్ కూడలి వద్ద తెదేపా నేతలు నిరసనకు దిగారు. ప్రైవేటు బస్సులను ఆపి టీడీపీ నేతలు దాని బైఠాయించారు. ఎన్నికల సంఘం, పోలీసులు దొంగ ఓట్లు మీద ఏ మాత్రం దృష్టి సారించలేదని టీడీపీ నేతలు ఆరోపించారు. మరో వైపు దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని టీడీపీ నేతలు నేతలు అడ్డుకున్నారు. ఓ కళ్యాణ మండపంలో బయటి వ్యక్తులు బస చేశారన్న ప్రచారం నేపథ్యంలో తెదేపా నేతలు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. అలానే బస్సులు, కార్లు ఆపి నకిలీ ఓటర్లను టీడీపీ, కాంగ్రెస్ వర్గీయులు బలవంతంగా దించేశారు. వారి నుంచి నకిలీ ఓటరు కార్డులు స్వాధీనం చేసుకున్నారు. మరో పక్క చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం భీమవరంలో తెదేపా, వైకాపా ఏజెంట్ల మధ్య వివాదం నెలకొంది. ఓటర్లను పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఇరు వర్గాలు ఆరోపించాయి. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో అరగంట సేపు పోలింగ్ నిలిచింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు సర్ది చెప్పారు.
Also Read
- Tags
- fake votes
- tension
- Tirupathi
తాజావార్తలు
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
-
Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్పై పోరాటం!
-
Bangladesh: బంగ్లాదేశ్లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!