Eyeball Tattoo: పిచ్చికి పరాకాష్ట.. కనుగుడ్లపై టాటూ వేయించుకున్న యువకుడు..
- ప్రత్యేక గుర్తింపు కోసం యువకుడి సంచలన నిర్ణయం
- టాటూ ఆర్టిస్ట్గా జగదీష్ ప్రయాణం
- ఐబాల్ టాటూకు రూ.2లక్షలు ఖర్చు
- వైద్యుల హెచ్చరికలు.. చూపు కోల్పోయే ముప్పు
Eyeball Tattoo Goes Wrong: ప్రస్తుత కాలంలో యువత విభిన్నంగా కనిపించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. కానీ, ఆంధ్రప్రదేశ్కు చెందిన జగదీష్ అనే యువకుడు చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి, భయానికి గురిచేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే మొదటిసారిగా ఐబాల్ టాటూ (Eyeball Tattoo) వేయించుకున్న వ్యక్తిగా గుర్తింపు పొందాలని అతను తన కనుగుడ్లపై టాటూ వేయించుకున్నాడు.
Boti Curry Secrets: వాసన రాకుండా బోటి కూర ఇలా చేయండి.. రుచి అదుర్స్!
Also Read
- Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
- Off The Record : టీడీపీ నేతల డబ్బులతో జనసేన సభ్యత్వాలు..?
- Minister Dola Bala Veera Anjaneya Swamy: విజయసాయి రెడ్డికి మంత్రి డోలా కౌంటర్.. పగటి కలలు మానుకో..!
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
ఐటీఐ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన జగదీష్, ప్రస్తుతం టాటూ ఆర్టిస్ట్గా పనిచేస్తున్నాడు. టాటూలు, పియర్సింగ్ వంటి విభాగాల్లో నేపాల్లో శిక్షణ పొందాడు. చిన్నప్పటి నుండి ఏదైనా కొత్తగా, డిఫరెంట్గా చేయాలనే తపనతో అతను ఈ అత్యంత ప్రమాదకరమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. కంటిలో చిన్న నలుసు పడితేనే తట్టుకోలేము, అలాంటిది సూదులతో ఇంకును నేరుగా కంటి లేయర్లలోకి పంపడం అనేది వినడానికే భయంకరంగా ఉంది. ఈ టాటూ ప్రక్రియకు దాదాపు 3 నుండి 4 గంటల సమయం పడుతుంది. దీని కోసం జగదీష్ సుమారు రూ. 2 లక్షలు ఖర్చు చేశాడు (సాధారణంగా ఇది రూ. 5 లక్షల వరకు ఉంటుంది). నిపుణులు , వైద్యులు 50-50 శాతం ప్రమాదం ఉంటుందని, చూపు కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించినా అతను వెనక్కి తగ్గలేదు.
తల్లిదండ్రులకు చెప్పకుండా ఈ పని చేసిన జగదీష్ను చూసి అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. టాటూ వేయించుకున్న తర్వాత కనీసం మూడు నెలల పాటు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే ఇన్ఫెక్షన్ సోకి చూపు శాశ్వతంగా పోయే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రత్యేక గుర్తింపు కోసం ఇలాంటి ప్రాణాంతకమైన ప్రయోగాలు చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
AP Cabinet Key Decision: లడ్డూ కల్తీ వ్యవహారం.. అడ్మినిస్ట్రేటివ్ లోపాలపై ప్రత్యేక కమిటీ విచారణ
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!