AP Cabinet Key Decision: లడ్డూ కల్తీ వ్యవహారం.. అడ్మినిస్ట్రేటివ్ లోపాలపై ప్రత్యేక కమిటీ విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet Key Decision: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం ఉద్దేశపూర్వకంగానే జరిగిందని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నివేదిక స్పష్టం చేసినట్లు మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఈ అంశంపై తాజాగా జరిగిన క్యాబినెట్ సమావేశంలో సమగ్రంగా చర్చించినట్లు ఆయన వెల్లడించారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో టెండర్ ప్రక్రియలో భారీ అవకతవకలు జరిగినట్లు మంత్రి తెలిపారు. వైష్ణవి డైరీ పేరుతో టెండర్లో పాల్గొన్న సంస్థ పూర్తిగా నకిలీ పత్రాలు సమర్పించినట్లు సిట్ నివేదికలో తేలిందన్నారు. మూడు సంవత్సరాల అనుభవం ఉన్నట్లు చూపించినా, ఆ సంస్థకు డైరీ కార్యకలాపాల అనుభవం ఒక్క సంవత్సరానికి కూడా లేనట్లు వెల్లడైందని చెప్పారు.
Also Read
- NEET Paper Leak: రూ. 30 వేలకే నీట్ పేపర్?.. లీక్లో కోచింగ్ సెంటర్లు, హాస్టళ్ల ప్రమేయం..
- Tokyo: టోక్యోలో తప్పిన విమాన ప్రమాదం.. ల్యాండింగ్ అవుతుండగా ఏం జరిగిందంటే..!
- CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్ట్.. సీఎం విజయ్ కీలక నిర్ణయం..
- NEET UG 2026: మే 3న నీట్ పరీక్ష, మే 12న రద్దు.. అసలు ఈ 10 రోజుల్లో ఏం జరిగింది? పూర్తి టైమ్లైన్ ఇదే..
తమ కళ్లముందే ఈ అక్రమాలు జరిగినా అధికారులు, బోర్డు నేతృత్వం వహించిన వారు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తీవ్రమైన తప్పిదమని మంత్రి పేర్కొన్నారు. తెలియకపోతే నిర్లక్ష్యం, తెలిసి కూడా చర్యలు తీసుకోకపోతే నేరంలో భాగస్వామ్యమేనని స్పష్టం చేశారు. సిట్ నివేదికలో ప్రస్తావించిన వారందరినీ నేరస్తులుగానే పరిగణిస్తున్నామని ఆయన అన్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో సప్లిమెంటరీ చార్జ్ షీట్ కోసం ప్రభుత్వం ఎదురుచూస్తోందన్నారు. కోర్టు ఈ పత్రాలను స్వీకరించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. చార్జ్ షీట్లో మరికొందరి పేర్లు లేకపోతే కోర్టు తిరిగి పంపే అవకాశం ఉందని కూడా వివరించారు.
iPhone 17 Buy: ఐఫోన్ లవర్స్కు శుభవార్త.. యూస్ నుంచి ఈజీగా ‘ఐఫోన్ 17’ తెచ్చేసుకోవచ్చు!
అడ్మినిస్ట్రేటివ్ లోపాలు ఉన్నాయా అన్నది తేల్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కమిటీ తక్కువ కాల వ్యవధిలోనే నివేదిక సమర్పించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధ్యులపై చర్యలు తీసుకునే ముందు వారికి తమ వాదన వినిపించే అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ వ్యవహారంలో రాజకీయ కక్షతో చర్యలు తీసుకోవడం లేదని మంత్రి స్పష్టం చేశారు. తిరుమల దేవస్థానం పవిత్రతను కాపాడడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. సిట్ నివేదికలో పేర్కొన్న వారితో పాటు మరికొందరు బాధ్యులు ఉన్నారా అన్నదానిపై కూడా కమిటీ దృష్టి సారించనున్నట్లు తెలిపారు. దీనితో ఈ ఘటనపై ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయం భక్తులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
తాజావార్తలు
-
Peddi: బుచ్చిబాబు మాస్టర్ ప్లాన్.. ‘పెద్ది’ ట్రైలర్ తర్వాత ఫ్యాన్స్కు ఇచ్చే గిఫ్ట్ ఇదే!
-
NEET Paper Leak: రూ. 30 వేలకే నీట్ పేపర్?.. లీక్లో కోచింగ్ సెంటర్లు, హాస్టళ్ల ప్రమేయం..
-
Tokyo: టోక్యోలో తప్పిన విమాన ప్రమాదం.. ల్యాండింగ్ అవుతుండగా ఏం జరిగిందంటే..!
-
LPG Subsidy Cut: సామాన్యుడికి గ్యాస్ షాక్.. ఇకపై సబ్సిడీ కట్!
-
CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్ట్.. సీఎం విజయ్ కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!