Murder For Lady: తాగిన మైకం.. యువతి కోసం స్నేహితుడి దారుణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాగిన మైకం విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. యువతి కోసం తాగిన మైకంలో తోటి స్నేహితుడినే దారుణంగా కొట్టి చంపి అతి తెలివితో బయట పడదాం అనుకున్నాడు…కానీ ఆఖరికి కటకటాల పాలయ్యాడు….అప్పటికే పెళ్ళై పిల్లలున్న ఇద్దరు వ్యక్తులకు పెళ్ళి కానీ ఓ మహిళతో ఏర్పడిన అక్రమసంబంధం హత్య కు దారి తీసింది..అమ్మాయి కోసం జరిగిన ముష్ఠి యుద్ధంలో ఒకరు బలై,మరొకరు జైలుకు వెళ్లి కుటుంబాల్ని రోడ్డున పడేసారు. .గత కొంత కాలంగా వివాహేతర సంబంధాలతో జరుగుతున్న హత్యలు దారుణంగా ఉంటున్నాయి.
తాగిన మైకంలో పెళ్ళాం,పిల్లల్ని వదిలేసి పరాయి ఆడదాని కోసం చంపటానికి లేదా తాము చావటానికైనా సిద్ధం అవుతున్నారు. తాజాగా జరిగిన మర్డర్ కూడా అదే కోవలోకి వస్తుంది..ఒక యువతి కోసం ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ కాస్త హత్య కు దారితీసింది…ఎన్టీఆర్ జిల్లా పెనుగ్రంచిపోలులో ఈ దారుణం చోటు చేసుకుంది…మృతుడు పాపట్ల వంశీకి.. హత్యకు పాల్పడిన రాయల జగదీష్ కు పెళ్ళై పిల్లలు కూడా వున్నారు..గత కొంత కాలంగా ఇద్దరు ఒకే దగ్గర జేసీబీ డ్రైవర్లుగా పని చేస్తున్నారు.
Also Read
- AP Liquor Scam: లిక్కర్ కేసులో అరెస్ట్లపై ఈడీ కీలక ప్రకటన.. రూ.195.33 కోట్ల నష్టం..!
- Indian Crew Tanker Incident: భారత్ నౌకపై దాడి.. మృతుల్లో విశాఖ వాసి
- AP DSC Recruitment: మరో డీఎస్సీ.. నిరాశ చెందిన అభ్యర్థులకు గుడ్న్యూస్
- MLA Chirri Balaraju: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కార్యాలయంలో ఉద్రిక్తత..
అలా కొద్దిరోజుల క్రితం వీరిద్దరికీ ప్రైవేట్ డెంటల్ హాస్పిటల్ లో పని చేస్తున్న జగయ్యపేట కు చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది…రెగ్యులర్ గా ఆమెతో మాట్లాడే వీరి ఇరువురి మధ్య గొడవలు రాసాగాయి. అలా గత పది రోజుల క్రితమే వీరు పని చేస్తున్న చోట గొడవ పడటంతో వీరి యజమాని మందలించి గొడవ ఆపాడు…అక్కడ ఆగిన గొడవ కాస్త పథకం ప్రకారం హత్య చేసే వరకు వెళ్ళింది. .దసరా కావటంతో యజమాని ఇచ్చిన మాములు తీసుకుని ఇద్దరు మరో నలుగురు స్నేహితులతో కలిసి మందు పార్టీ చేసుకోవటానికి వెళ్లారు. రాయల జగదీష్ భారీ మొత్తంలో మద్యం కొనుగోలు చేసి మృతుడు వంశీతో బాగా తాగించి గొడవపడి హత్య చేసాడు.
ఆ సమయంలో అతనికి తోటి స్నేహితులు కూడా సహకరించారు. దీంతో వంశీ హత్య మరింత సులువైంది…ఆపై హత్య నుండి తప్పించుకునేందుకు మృతడు వంశీ బట్టలు మొత్తం తీసేసి ఎన్ ఎస్పీ కాలువలో పడేసారు…అంతేకాకుండా మద్యం సేవించిన తర్వాత వంశీ మత్తులో పడిపోయి ఉన్నాడని తిరిగి మరల వెళ్లి చూసేసరికి వంశీ కనిపించడం లేదంటూ ఓనర్ వెంకటేశ్వరరావుకు చెప్పి వత్సవాయి స్టేషన్ పరిధిలో కేసు పెట్టేందుకు వెళ్లారు నిందితులు. మరుసటి రోజు ఏమీ తెలియనట్లు అందరితో కలిసి స్నేహితుడి కోసం వెతుకుతున్నట్లు డ్రామా ఆడారు….ఆలా సుమారు 20 కిలో మీటర్లు కొట్టుకుని వచ్చిన మృత దేహాన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు అసలు విషయాన్ని తేల్చి నిందితులను అరెస్ట్ చేసారు..
హతడు వంశీకి, నిందితుడు జగదీష్ కి నిండా పాతికేళ్ళు కూడా లేవు …రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలు. వీళ్ళపైనే ఆధారపడ్డ పెళ్ళాం బిడ్డలు ఇప్పుడు దిక్కులేని వారు అయిపోయారు. ఏ మాత్రం బాధ్యత లేకుండా యువతి కోసం గొడవపడి రెండు కుటుంబాలను రోడ్డున పడేశారు.
తాజావార్తలు
-
Jagapathi Babu: ‘పెద్ది’పై కావాలనే నెగిటివిటీ.. గెలిచినా పోరాడాల్సి వస్తోంది !
-
Chicken Biryani Recipe: చికెన్ బిర్యానీ పర్ఫెక్ట్ ఫార్ములా.. నలుగురికి ఎంత బియ్యం, ఎంత చికెన్ వాడాలో తెలుసా..?
-
Iran-US: ఈసారి బాధాకరమైన పరిణామాలుంటాయి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
-
Jagapathi Babu: నువ్వు హీరో అయితే ఈసారి ఏం కట్ చేస్తావ్ బుచ్చిబాబూ? ?
-
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!