Enforcement Directorate: ఎన్నారై అకాడమీలో సోదాలపై ఈడీ ప్రకటన.. భారీగా నగదు, కీలక పత్రాలు స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్ఆర్ఐ ఆస్పత్రులపై తాము చేసిన సోదాల విషయమై ఈడీ ప్రకటన విడుదల చేసింది.. ఈ నెల 2, 3వ తేదీల్లో ఎన్నారై అకాడమీ ఆఫ్ సైన్సెస్లోని కొంతమంది సభ్యులు, ఆఫీస్ బేరర్లపై విజయవాడ, కాకినాడలోని వివిధ ప్రదేశాల్లో సోదాలు నిర్వహించాం… 53 అనుమానస్పదంగా ఉన్న వివిధ స్థిరాస్థులకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నాం. మనీ ల్యాండరింగ్ జరిగినట్టుగా అనుమానం కలిగిన కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.. ఇక, కొన్ని హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నాం… గుంటూరు, హైదరాబాద్తో పాటు ఈ కేసులో ప్రమేయం ఉన్న పలువురి ఆస్తులను స్తంభింప చేశాం.. కొంత నగదును స్వాధీనం చేసుకున్నామని.. ఏపీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ఎస్ ఆధారంగా పీఎంఎల్ఏ కింద దర్యాప్తు చేశామని పేర్కొన్నారు.
Read Also: YS Jagan: బీసీల హృదయంలో జగన్.. జగన్ హృదయంలో బీసీలు
Also Read
- Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
- CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
- OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్... మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
ఇక, సొసైటీకి చెందిన కొంత మంది సభ్యులు సొసైటీ నిధులను మళ్లించారనే ఆరోపణలపై విచారించామని వెల్లడించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. భవనాల నిర్మాణం పేరుతో సొసైటీని పెద్ద ఎత్తున వసూలు చేసి సొమ్ము చేసుకుంటున్నారని పేర్కొంది.. రికార్డుల్లోని లెక్కల కంటే ఎక్కువ మొత్తంలో కోవిడ్ రోగుల నుంచి వచ్చిన డబ్బును మళ్లించారన్న అంశంపై సోదాలు చేపట్టామని.. అన్ని వ్యవహారలపై విచారణ కొనసాగుతోందని వెల్లడించారు.. విజయవాడ, కాకినాడ, గుంటూరు, హైదరాబాద్లలో సోదాలు పూర్తి అయ్యాయి.. ఏపీ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగానే విచారణ జరిగిందని.. సొసైటీ సభ్యులు ఎన్నారై అకాడమీ నిధులతో సొంత భవనాలు నిర్మించుకున్నారని పేర్కొంది. కోవిడ్ సమయంలో భారీగా అక్రమాలు చేసి ఆర్థికంగా లబ్దిపొందారని.. మెడికల్ సీట్ల కేటాయింపుల్లోనూ అక్రమాలు చేశారని.. సొసైటీ అకౌంట్కు వచ్చిన నిధులన్నీ మరో అకౌంట్కు బదిలీ చేశారని.. ఎన్ఆర్ఐఎస్ అనే అకౌంట్ తెరచి నిధులు మళ్లించారని.. 53 ఆస్తులకు సంబంధించి పత్రాలు స్వాధీనం చేసుకున్నాం.. రూ.కోట్ల నిధుల మల్లింపుపై ఆధారాలు లభ్యమయ్యాయని తన ప్రకటనలో పేర్కొంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.
తాజావార్తలు
-
IND Vs IRE: టీమిండియాకు షాక్.. కొంపముంచనున్న వర్షం.. ఐర్లాండ్దే సిరీస్..
-
NTR – Trivikram Movie: రేపే ఎన్టీఆర్-త్రివిక్రమ్ ‘God Of War’ అనౌన్స్మెంట్!
-
Garuda Puran: చనిపోయిన వారి బట్టలు ఇంట్లో ఉంచుతున్నారా? గరుడ పురాణంలో చెప్పిన భయంకరమైన నిజాలు ఇవే!
-
Komatireddy Venkat Reddy : రేవంత్పై కోమటిరెడ్డి ప్రశంసలు.. నల్లగొండలో 12 సీట్లు మావే.!
-
Womens T20 World Cup: ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!