Deputy CM Pawan Kalyan: ఏలూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సుడిగాలి పర్యటన..
- ఏలూరు జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
- కొయ్యలగూడెం, ద్వారకా తిరుమల మండలాల్లో అభివృద్ధి కార్యక్రమాల పరిశీలన..
- ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు..
- ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పవన్ కల్యాణ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏలూరు జిల్లాలోని కొయ్యలగూడెం, ద్వారకాతిరుమల మండలాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు. ప్రత్యేక విమానంలో రాజమండ్రి చేరుకున్న ఆయన అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కొయ్యలగూడెం మండలం రాజవరం చేరుకున్నారు. పొంగుటూరు లక్కవరం మధ్య నిర్మిస్తున్న రహదారి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు డిప్యూటీ సీఎంకు వినతి పత్రాలు అందించారు. అనంతరం ద్వారకాతిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురానికి చేరుకొని సుందరగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్కు అధికారులు, ఆలయ సిబ్బంది పూర్ణ కుంభంతో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారికి పవన్ కల్యాణ్ పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు.
Read Also: Mangalagiri: జీడీపీసీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు ముందు కురగల్లు సొసైటీ బాధితుల ఆందోళన
Also Read
- Polavaram Agency: ఏజెన్సీలో ఇంకా డోలీ మోతలే.. 4 కొండలు దాటి బాలికను మోసుకెళ్లిన గిరిజనులు
- Papikondalu Boat Tour: పాపికొండల విహారయాత్రకు గ్రీన్ సిగ్నల్.. 18 రోజుల తర్వాత మళ్లీ బోటు షికారు
- MLA Chirri Balaraju: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కార్యాలయంలో ఉద్రిక్తత..
- Lemon Prices: అమాంతం పెరిగిన నిమ్మకాయల ధరలు.. రూ.30 నుంచి రూ.130కి..!
ఐఎస్ జగన్నాథపురం గ్రామం నుంచి సుందరగిరి కొండపైకి వెళ్లే రహదారితో పాటు, ఆలయ ప్రదక్షిణ మండప పనులకు పవన్ ప్రారంభించారు. అనంతరం గ్రామంలో నూతనంగా చేపట్టిన మ్యాజిక్ డ్రైన్ పనులను డిప్యూటీ సీఎం పరిశీలించారు. ఇక, పవన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. అయినా పవన్ కల్యాణ్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజల పెద్ద ఎత్తున ప్రాంతానికి తరలి వచ్చారు. గత ఏడాది డిసెంబర్లో ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరో మారు స్వామి వారి దర్శనానికి రావడం, ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు గ్రామంలో పలు అభివృద్ధి పనులను చేపట్టడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ పర్యటనకు జిల్లా ఇంఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
తాజావార్తలు
-
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
-
CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
-
HMD Touch AI: 1950mAh బ్యాటరీతో.. హెచ్ఎమ్డి టచ్ ఏఐ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో విడుదలకు రెడీ!
-
KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
-
Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!