Deputy CM Pawan Kalyan: ఏలూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సుడిగాలి పర్యటన..
- ఏలూరు జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
- కొయ్యలగూడెం, ద్వారకా తిరుమల మండలాల్లో అభివృద్ధి కార్యక్రమాల పరిశీలన..
- ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు..
- ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పవన్ కల్యాణ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏలూరు జిల్లాలోని కొయ్యలగూడెం, ద్వారకాతిరుమల మండలాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు. ప్రత్యేక విమానంలో రాజమండ్రి చేరుకున్న ఆయన అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కొయ్యలగూడెం మండలం రాజవరం చేరుకున్నారు. పొంగుటూరు లక్కవరం మధ్య నిర్మిస్తున్న రహదారి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు డిప్యూటీ సీఎంకు వినతి పత్రాలు అందించారు. అనంతరం ద్వారకాతిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురానికి చేరుకొని సుందరగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్కు అధికారులు, ఆలయ సిబ్బంది పూర్ణ కుంభంతో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారికి పవన్ కల్యాణ్ పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు.
Read Also: Mangalagiri: జీడీపీసీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు ముందు కురగల్లు సొసైటీ బాధితుల ఆందోళన
Also Read
- Lemon Prices: అమాంతం పెరిగిన నిమ్మకాయల ధరలు.. రూ.30 నుంచి రూ.130కి..!
- Home Minister Anitha: 'మావిగన్' పేరు ఎత్తితే జనం నవ్వుకుంటున్నారు.. అనిత సెటైర్లు
- Nimmala Ramanaidu: కేంద్ర జలశక్తి కార్యదర్శికి మంత్రి నిమ్మల కీలక సూచనలు..
- CM Chandrababu: నిర్వాసితుల త్యాగానికి ప్రతిఫలం పోలవరం ప్రాజెక్టు.. మీరు ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు..
ఐఎస్ జగన్నాథపురం గ్రామం నుంచి సుందరగిరి కొండపైకి వెళ్లే రహదారితో పాటు, ఆలయ ప్రదక్షిణ మండప పనులకు పవన్ ప్రారంభించారు. అనంతరం గ్రామంలో నూతనంగా చేపట్టిన మ్యాజిక్ డ్రైన్ పనులను డిప్యూటీ సీఎం పరిశీలించారు. ఇక, పవన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. అయినా పవన్ కల్యాణ్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజల పెద్ద ఎత్తున ప్రాంతానికి తరలి వచ్చారు. గత ఏడాది డిసెంబర్లో ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరో మారు స్వామి వారి దర్శనానికి రావడం, ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు గ్రామంలో పలు అభివృద్ధి పనులను చేపట్టడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ పర్యటనకు జిల్లా ఇంఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
తాజావార్తలు
-
Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..