Deputy CM Pawan Kalyan: ఏలూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సుడిగాలి పర్యటన..
- ఏలూరు జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
- కొయ్యలగూడెం, ద్వారకా తిరుమల మండలాల్లో అభివృద్ధి కార్యక్రమాల పరిశీలన..
- ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు..
- ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పవన్ కల్యాణ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏలూరు జిల్లాలోని కొయ్యలగూడెం, ద్వారకాతిరుమల మండలాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు. ప్రత్యేక విమానంలో రాజమండ్రి చేరుకున్న ఆయన అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కొయ్యలగూడెం మండలం రాజవరం చేరుకున్నారు. పొంగుటూరు లక్కవరం మధ్య నిర్మిస్తున్న రహదారి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు డిప్యూటీ సీఎంకు వినతి పత్రాలు అందించారు. అనంతరం ద్వారకాతిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురానికి చేరుకొని సుందరగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్కు అధికారులు, ఆలయ సిబ్బంది పూర్ణ కుంభంతో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారికి పవన్ కల్యాణ్ పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు.
Read Also: Mangalagiri: జీడీపీసీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు ముందు కురగల్లు సొసైటీ బాధితుల ఆందోళన
Also Read
- Chandrababu on Mega DSC: డీఎస్సీపై వైసీపీ ఆందోళనలకు చంద్రబాబు కౌంటర్.. కీలక వ్యాఖ్యలు
- CM Chandrababu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్.. గంజాయి, రౌడీయిజంపై సంచలన వ్యాఖ్యలు
- Nuzvid Love Marriage Twist: ప్రేమ వివాహం తర్వాత ట్విస్ట్.. భార్యను అప్పగించేందుకు రూ.12 లక్షలు డిమాండ్?
- Polavaram Agency: ఏజెన్సీలో ఇంకా డోలీ మోతలే.. 4 కొండలు దాటి బాలికను మోసుకెళ్లిన గిరిజనులు
ఐఎస్ జగన్నాథపురం గ్రామం నుంచి సుందరగిరి కొండపైకి వెళ్లే రహదారితో పాటు, ఆలయ ప్రదక్షిణ మండప పనులకు పవన్ ప్రారంభించారు. అనంతరం గ్రామంలో నూతనంగా చేపట్టిన మ్యాజిక్ డ్రైన్ పనులను డిప్యూటీ సీఎం పరిశీలించారు. ఇక, పవన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. అయినా పవన్ కల్యాణ్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజల పెద్ద ఎత్తున ప్రాంతానికి తరలి వచ్చారు. గత ఏడాది డిసెంబర్లో ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరో మారు స్వామి వారి దర్శనానికి రావడం, ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు గ్రామంలో పలు అభివృద్ధి పనులను చేపట్టడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ పర్యటనకు జిల్లా ఇంఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
తాజావార్తలు
-
Ananthika Sanilkumar: ‘ఎల్లమ్మ’లో హీరోయిన్ ఫిక్స్.. డీఎస్పీకి జోడీ ఎవరో తెలుసా?
-
Cricket Record: 47 ఏళ్లకు అరంగేట్రం.. 51 ఏళ్ల వయసులో ప్రపంచ రికార్డు.. క్రికెట్లో 96 ఏళ్ల రికార్డు బద్దలు..
-
Kangana Ranaut: కంగనా, రామ్దేవ్ వివాదానికి రాఖీతో ముగింపు.. మిఠాయిలతో మళ్లీ అన్నాచెల్లెళ్ల బంధం!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్న్యూస్
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!