Gorantla Butchaiah Chowdary: విజయసాయిరెడ్డిని కూటమిలో చేర్చుకోవడానికి వీల్లేదు.. సీనియర్ నేత డిమాండ్
- కూటమిలో విజయసాయిరెడ్డిని చేర్చుకోవడానికి వీల్లేదు..
- అలా చేర్చుకుంటారని అనుకోవడం లేదు..
- గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gorantla Butchaiah Chowdary: రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను.. ఇక వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న విజయసాయిరెడ్డి.. ఆ తర్వాత తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.. ఇదే సమయంలో.. చంద్రబాబుతో తనకు ఎలాంటి వ్యక్తిగత వైరం లేదని.. పవన్ కల్యాణ్ తనకు చిరకాల మిత్రుడు అంటూ వ్యాఖ్యానించారు.. అంతేకాదు… ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ప్రస్తావన కూడా తీసుకొచ్చారు దీంతో, విజయసాయిరెడ్డి చూపు.. కూటమి పార్టీల వైపు ఉందా..? అనే ప్రచారం తెరపైకి వచ్చింది.. అయితే, కూటమిలో విజయసాయిరెడ్డిని చేర్చుకోవడానికి వీల్లేదని, అలా చేర్చుకుంటారని అనుకోవడం లేదని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read Also: Butchaiah Chowdary: లోకేష్కి డిప్యూటీ సీఎం పదవి..! బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు
Also Read
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Jakkampudi Raja Protest: పీఎస్ ఎదుట ఆందోళనకు దిగిన జక్కంపూడి..
- Anantha Babu Case: జైల్లో ఇంటి భోజనం కోరిన అనంతబాబు.. కోర్టు కీలక ఆదేశాలు
- Minister Nimmala Ramanaidu: జగన్ పాలనపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు.. మేనమామనని చెప్పి మోసం చేశారు..!
ఒకవేళ బీజేపీ చేర్చుకున్నట్లైతే ఆ పార్టీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు బుచ్చయ్య చౌదరి. అవినీతి అక్రమాలకు పాల్పడిన వాడు ఎవడైనా సరే శిక్షలు తప్పవని, అక్రమాలకు పాల్పడి.. అధికారం పోయిన తర్వాత పార్టీలో చేరిపోదాం అనుకుంటే.. చేర్చుకోవడం సరైంది కాదన్నారు. అలాగే అధికారం వుందా కదా అని మనం కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ప్రజలు ఊరుకోరని గోరంట్ల హెచ్చరించారు. విజయసాయి విశాఖపట్నంలో దోపిడీ చేశారని, కాకినాడ పోర్టును అల్లుడుకు దోచిపెట్టాడని, విశాఖలో లక్షల కోట్లు దోచేశారని.. అవన్నీ కూడా తిరిగి బాధితులకు అప్పగించాలని గోరంట్ల డిమాండ్ చేశారు. ప్రజాబలం తో 164 సీట్లు కూటమికి వచ్చాయని, ఇప్పుడు అక్రమాలు చేసిన నాయకులు వస్తామని చెబితే దేనికోసం అని గోరంట్ల ప్రశ్నించారు. వైసీపీ రాబోయే రోజుల్లో కనుమరుగవుతుందని, ఆ పార్టీలో అందరూ సర్దుకుంటారన్నారు. అక్రమాలు, అవినీతి లేని నాయకులు వస్తే అధిష్ఠానం ఆలోచించుకుంటుందని పేర్కొన్నారు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి.
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్చాట్లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!