Gorantla Butchaiah Chowdary: విజయసాయిరెడ్డిని కూటమిలో చేర్చుకోవడానికి వీల్లేదు.. సీనియర్ నేత డిమాండ్
- కూటమిలో విజయసాయిరెడ్డిని చేర్చుకోవడానికి వీల్లేదు..
- అలా చేర్చుకుంటారని అనుకోవడం లేదు..
- గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gorantla Butchaiah Chowdary: రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను.. ఇక వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న విజయసాయిరెడ్డి.. ఆ తర్వాత తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.. ఇదే సమయంలో.. చంద్రబాబుతో తనకు ఎలాంటి వ్యక్తిగత వైరం లేదని.. పవన్ కల్యాణ్ తనకు చిరకాల మిత్రుడు అంటూ వ్యాఖ్యానించారు.. అంతేకాదు… ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ప్రస్తావన కూడా తీసుకొచ్చారు దీంతో, విజయసాయిరెడ్డి చూపు.. కూటమి పార్టీల వైపు ఉందా..? అనే ప్రచారం తెరపైకి వచ్చింది.. అయితే, కూటమిలో విజయసాయిరెడ్డిని చేర్చుకోవడానికి వీల్లేదని, అలా చేర్చుకుంటారని అనుకోవడం లేదని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read Also: Butchaiah Chowdary: లోకేష్కి డిప్యూటీ సీఎం పదవి..! బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు
Also Read
- MLC AnanthaBabu: ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్.. బెయిల్ రద్దు చేసిన కోర్టు
- CM Chandrababu: మహిళా బిల్లును అడ్డుకోవడం పెద్ద విద్రోహం..
- Dead Body Door Delivery Case: ఎమ్మెల్సీ అనంతబాబు భార్యకు షాక్.. పిటిషన్ కొట్టివేసిన కోర్టు..
- Governor Abdul Nazeer: నేడు ఆదికవి నన్నయ్య వర్సిటీ స్నాతకోత్సవం.. ముఖ్య అతిథిగా గవర్నర్
ఒకవేళ బీజేపీ చేర్చుకున్నట్లైతే ఆ పార్టీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు బుచ్చయ్య చౌదరి. అవినీతి అక్రమాలకు పాల్పడిన వాడు ఎవడైనా సరే శిక్షలు తప్పవని, అక్రమాలకు పాల్పడి.. అధికారం పోయిన తర్వాత పార్టీలో చేరిపోదాం అనుకుంటే.. చేర్చుకోవడం సరైంది కాదన్నారు. అలాగే అధికారం వుందా కదా అని మనం కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ప్రజలు ఊరుకోరని గోరంట్ల హెచ్చరించారు. విజయసాయి విశాఖపట్నంలో దోపిడీ చేశారని, కాకినాడ పోర్టును అల్లుడుకు దోచిపెట్టాడని, విశాఖలో లక్షల కోట్లు దోచేశారని.. అవన్నీ కూడా తిరిగి బాధితులకు అప్పగించాలని గోరంట్ల డిమాండ్ చేశారు. ప్రజాబలం తో 164 సీట్లు కూటమికి వచ్చాయని, ఇప్పుడు అక్రమాలు చేసిన నాయకులు వస్తామని చెబితే దేనికోసం అని గోరంట్ల ప్రశ్నించారు. వైసీపీ రాబోయే రోజుల్లో కనుమరుగవుతుందని, ఆ పార్టీలో అందరూ సర్దుకుంటారన్నారు. అక్రమాలు, అవినీతి లేని నాయకులు వస్తే అధిష్ఠానం ఆలోచించుకుంటుందని పేర్కొన్నారు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి.
తాజావార్తలు
-
Peddi: తమిళ్, మలయాళ బాక్సాఫీస్పై ‘పెద్ది’ దండయాత్ర మొదలు!
-
Pakistan Whitewash: తేలిపోయిన పాకిస్థాన్ బ్యాటర్స్.. బంగ్లాదేశ్ చేతిలో క్లీన్ స్వీప్..!
-
MS Dhoni: ఎంఎస్ ధోనీ క్రేజ్ చూసి పిచ్చెక్కిపోయింది.. మహీ చిరకాల ప్రత్యర్థి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
CM Vijay Anti Corruption Drive: అవినీతి ప్రక్షాళనకు సీఎం విజయ్ కీలక నిర్ణయం.. లంచంపై ఫిర్యాదుకు రూ.1 లక్ష బహుమతి..
ట్రెండింగ్
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!
-
భారత్ లోకి Mini Cooper S GP Inspired Edition.. కేవలం 30 కార్లకే పరిమితం.!