Gorantla Butchaiah Chowdary: విజయసాయిరెడ్డిని కూటమిలో చేర్చుకోవడానికి వీల్లేదు.. సీనియర్ నేత డిమాండ్
- కూటమిలో విజయసాయిరెడ్డిని చేర్చుకోవడానికి వీల్లేదు..
- అలా చేర్చుకుంటారని అనుకోవడం లేదు..
- గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gorantla Butchaiah Chowdary: రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను.. ఇక వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న విజయసాయిరెడ్డి.. ఆ తర్వాత తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.. ఇదే సమయంలో.. చంద్రబాబుతో తనకు ఎలాంటి వ్యక్తిగత వైరం లేదని.. పవన్ కల్యాణ్ తనకు చిరకాల మిత్రుడు అంటూ వ్యాఖ్యానించారు.. అంతేకాదు… ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ప్రస్తావన కూడా తీసుకొచ్చారు దీంతో, విజయసాయిరెడ్డి చూపు.. కూటమి పార్టీల వైపు ఉందా..? అనే ప్రచారం తెరపైకి వచ్చింది.. అయితే, కూటమిలో విజయసాయిరెడ్డిని చేర్చుకోవడానికి వీల్లేదని, అలా చేర్చుకుంటారని అనుకోవడం లేదని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read Also: Butchaiah Chowdary: లోకేష్కి డిప్యూటీ సీఎం పదవి..! బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు
Also Read
- Jakkampudi Raja Protest: పీఎస్ ఎదుట ఆందోళనకు దిగిన జక్కంపూడి..
- Anantha Babu Case: జైల్లో ఇంటి భోజనం కోరిన అనంతబాబు.. కోర్టు కీలక ఆదేశాలు
- Minister Nimmala Ramanaidu: జగన్ పాలనపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు.. మేనమామనని చెప్పి మోసం చేశారు..!
- Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై పవన్ కల్యాణ్.. రెండో రోజు కూడా క్షేత్రస్థాయిలో తనిఖీలు
ఒకవేళ బీజేపీ చేర్చుకున్నట్లైతే ఆ పార్టీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు బుచ్చయ్య చౌదరి. అవినీతి అక్రమాలకు పాల్పడిన వాడు ఎవడైనా సరే శిక్షలు తప్పవని, అక్రమాలకు పాల్పడి.. అధికారం పోయిన తర్వాత పార్టీలో చేరిపోదాం అనుకుంటే.. చేర్చుకోవడం సరైంది కాదన్నారు. అలాగే అధికారం వుందా కదా అని మనం కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ప్రజలు ఊరుకోరని గోరంట్ల హెచ్చరించారు. విజయసాయి విశాఖపట్నంలో దోపిడీ చేశారని, కాకినాడ పోర్టును అల్లుడుకు దోచిపెట్టాడని, విశాఖలో లక్షల కోట్లు దోచేశారని.. అవన్నీ కూడా తిరిగి బాధితులకు అప్పగించాలని గోరంట్ల డిమాండ్ చేశారు. ప్రజాబలం తో 164 సీట్లు కూటమికి వచ్చాయని, ఇప్పుడు అక్రమాలు చేసిన నాయకులు వస్తామని చెబితే దేనికోసం అని గోరంట్ల ప్రశ్నించారు. వైసీపీ రాబోయే రోజుల్లో కనుమరుగవుతుందని, ఆ పార్టీలో అందరూ సర్దుకుంటారన్నారు. అక్రమాలు, అవినీతి లేని నాయకులు వస్తే అధిష్ఠానం ఆలోచించుకుంటుందని పేర్కొన్నారు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి.
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!