Road Accident: రాజమండ్రి సమీపంలో ట్రావెల్స్ బస్సు బోల్తా..
- రాజమండ్రి సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా..
- వైజాగ్ కు చెందిన యువతి మృతి.. 20 మందికి గాయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Road Accident: రాజమండ్రి సమీపంలో కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో వైజాగ్ కు చెందిన యువతి మృతి చెందగా… 20 మంది వరకూ గాయపడ్డారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కు గత రాత్రి బయలుదేరిన కావేరి ట్రావెల్ బస్సు అర్ధరాత్రి సమయంలో రాజమండ్రి గామన్ వంతెన రహదారిపై బోల్తా పడింది. బస్సు బోల్తాపడిన విషయం తెలిసేసరికి జాప్యం జరగడం, పోలీసులు, ఇతర సహాయక సిబ్బంది అక్కడికి చేరుకునేలోపు క్షతగాత్రుల గంటపాటు విలవిల్లాడారు. రాజమహేంద్రవరం నుంచి ఆరు అంబులెన్సులు కాతేరు- కొంతమూరు మధ్య వంతెనపై ఘటనా స్థలానికి చేరుకున్నాయి. క్షతగాత్రులను రాజమహేంద్రవరం జీజీహెచ్ తరలించారు. వీరంతా విశాఖ, అన్నవరం ప్రాంతాలకు చెందినవారుగా తెలుస్తోంది.
Read Also: Nayanthara: నేరుగా ఓటీటీలో రిలీజ్ కానున్న నయనతార మూవీ..?
Also Read
- CM Chandrababu: మహిళా బిల్లును అడ్డుకోవడం పెద్ద విద్రోహం..
- Dead Body Door Delivery Case: ఎమ్మెల్సీ అనంతబాబు భార్యకు షాక్.. పిటిషన్ కొట్టివేసిన కోర్టు..
- Governor Abdul Nazeer: నేడు ఆదికవి నన్నయ్య వర్సిటీ స్నాతకోత్సవం.. ముఖ్య అతిథిగా గవర్నర్
- Rabi Paddy Procurement: రైతులకు గుడ్న్యూస్.. రేపటి నుంచి రబీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
వీరిలో 25 ఏళ్లలోపు విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. క్రేన్ సాయంతో రాత్రి ఒంటి గంట సమయంలో బోల్తాపడిన బస్సును తొలగించి కింద ఉన్న మరికొంతమందిని రక్షించారు. వారంతా బస్సు కింద ఖాళీ ప్రదేశంలో ఇరుక్కోవడంతో ప్రాణాలతో బయటపడగలిగారు. ఎస్పీ నరసింహ కిషోర్ ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు. గాయపడిన వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండడంతో కాకినాడ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో 40 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు. హైదరాబాదులో సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం కోసం పరీక్ష రాస్తే ఎందుకు వెళ్తున్న విశాఖకు చెందిన కళ్యాణి అనే యువతి ఘటనా స్థలంలోని మృతి చెందడంతో తీవ్ర విషాదంగా మారింది. ఘటనపై రాజమండ్రి టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్గా ఇలా ట్రై చేయండి!
-
Tamil Politics: విజయ్పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
-
RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!
-
PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
-
PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?