Pawan Kalyan: అమిత్ షాతో అలాంటి విషయాలు ఎందుకు మాట్లాడతాను
- వైసీపీ నాయకుడు గురించి అమిత్ షా దగ్గర ఏమీ మాట్లాడలేదు
- ఏకాంతంగా జరిగిన చర్చలు బయటకు ఎలా తెలుస్తాయి
- రాజమండ్రి జనసేన మీటింగ్లో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ నాయకుడు గురించి అమిత్ షా దగ్గర ఏమీ మాట్లాడలేదని.. అయినా అమిత్ షాతో ఏకాంతంగా జరిగిన చర్చలు బయటకు ఎలా తెలుస్తాయని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. రాజమండ్రిలో జరిగిన జనసేన సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ‘‘అమిత్షాతో మాట్లాడిన విషయాలు బయటవాళ్లకు ఎలా తెలుస్తాయి. వైసీపీ నేత జైలుకు వెళ్లాలని అడిగితే నాకు క్లాస్ తీసుకున్నారట. ఒకరు జైలుకి వెళ్తే పవన్ కల్యాణ్ ఎదుగుతారా.? జనసేన ఎదుగుతుందా..? ఇలాంటి వారు లేనప్పుడే నేను రాజకీయాల్లోకి వచ్చా. అభివృద్ధి కోసమే అమిత్ షాను కలిశాను. రాజకీయ పార్టీ నడపడం అంత ఈజీ కాదు. కులం గురించి మాట్లాడతానని నన్ను అంటున్నారు. మిగితా నాయకులు కులం గురించి మాట్లాడటం లేదా.? గత్యంతరం లేక.. ఇంత ఓపికతో ఉన్నా.. తమిళనాడు రాజకీయాలు ఎంతో సాఫీగా సాగిపోయాయి. నాకు అసూయ కలిగేంత చక్కగా రాజకీయాలు సాగాయి.’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.
‘‘జనసేనపై రాళ్లు వేద్దామనుకుంటే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. నేను కూడా మనిషినే.. నాకు కూడా కోపాలు ఉంటాయి. మీరు కొడుతూ ఉంటే.. మేము భరిస్తూ ఉంటామా.? కష్టాలు, కన్నీళ్లు మీకే ఉంటాయా.? మీరు ఏమన్నా.. మేము భరిస్తూ ఉండాలా..? భరిస్తాం.. సహిస్తాం అవసరమైతే తాట తీస్తాం.. ఈ మాట చానాళ్ల క్రితమే చెప్పా.’’ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
Also Read
- Deputy CM Pawan Kalyan: గోదావరి పుష్కరాలు ఏర్పాట్లపై సమీక్ష.. పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి
- MLC AnanthaBabu: ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్.. బెయిల్ రద్దు చేసిన కోర్టు
- CM Chandrababu: మహిళా బిల్లును అడ్డుకోవడం పెద్ద విద్రోహం..
- Dead Body Door Delivery Case: ఎమ్మెల్సీ అనంతబాబు భార్యకు షాక్.. పిటిషన్ కొట్టివేసిన కోర్టు..
‘‘కటౌట్ పెట్టుకొని ఈజీగా విజయ్ సీఎం అయిపోయాడు. తమిళ రాజకీయాలు ఎంతో సుఖంగా జరిగిపోయాయి. తమిళ రాజకీయాలు చూసి నాకు అసూయ కలిగింది. అన్ని ప్రాంతాల వారిని ఏకతాటిపై తీసుకురావడానికి కృషి చేస్తున్నాం. పార్టీ నడపటం సింగిల్ లైన్లో ఉంటుంది. నేను అన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటా వాటిని ఆచరించండి విమర్శించవద్దు. అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ శ్రేణులకు పౌరుషం చచ్చిపోయింది. మళ్లీ అందరికీ ఖడ్గ తిక్కన్న కథ చెప్పి పెంచాలి.’’ అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
TMC crisis: టీఎంసీ సమావేశానికి 15 మంది ఎమ్మెల్యేల డుమ్మా.. మమతా పార్టీలో ముదురుతున్న అంతర్గత సంక్షోభం!
-
AP Weather Updates : బయట అడుగు పెడితే భగ్గుమంటోంది.. ఏపీలో రికార్డు వేడి.!
-
Tamil Cinema : కోలీవుడ్ కోసం విజయ్ సర్కార్ సంచలన నిర్ణయం.. వాటన్నిటికి ఇక గ్రీన్ సిగ్నల్
-
CM Vijay: రైతన్నలకు తీపికబురు.. పంట రుణమాఫీ ప్రకటించిన సీఎం విజయ్
-
Life Insurance Mistakes: లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఈ 5 తప్పులు చేయకండి!
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?