CM Chandrababu: మహిళా బిల్లును అడ్డుకోవడం పెద్ద విద్రోహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో సీఎం చంద్రబాబు నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు.. నిడదవోలులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళా రిజర్వేషన్ బిల్లుపై మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం దేశానికి, మహిళలకు చేసిన పెద్ద విద్రోహమని వ్యాఖ్యానించారు.. కాంగ్రెస్ పార్టీతో పాటు వారి మిత్రపక్షాలు మహిళల ఆశలను ద్రోహం చేశాయని విమర్శించారు. ఇది క్షమించరాని నేరమని ఆయన అన్నారు. “మహిళల ఓట్లు అడగాలంటే ముందుగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలి. దానికి అడ్డుపడిన వారు రేపు ఏ మొఖంతో మహిళల దగ్గరకు వెళ్తారు?” అని ఆయన ప్రశ్నించారు. ప్రధానమంత్రి 2029 నాటికి మహిళలకు రిజర్వేషన్ అమలు చేయాలనే సంకల్పం ప్రకటించారని, కానీ కాంగ్రెస్ పార్టీ దీనిని వక్రీకరించి ప్రజల్లో తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
Read Also: Regina: కోల్పోయాకే దాని విలువ తెలిసింది.. రెజీనా కాసాండ్రా ఎమోషనల్ పోస్ట్ వైరల్!
Also Read
- Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై పవన్ కల్యాణ్.. రెండో రోజు కూడా క్షేత్రస్థాయిలో తనిఖీలు
- Deputy CM Pawan Kalyan: గోదావరి పుష్కరాలు ఏర్పాట్లపై సమీక్ష.. పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి
- MLC AnanthaBabu: ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్.. బెయిల్ రద్దు చేసిన కోర్టు
- Dead Body Door Delivery Case: ఎమ్మెల్సీ అనంతబాబు భార్యకు షాక్.. పిటిషన్ కొట్టివేసిన కోర్టు..
దక్షిణ భారత రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని చెప్పడం సరైంది కాదని, మహిళలందరూ ఈ బిల్లుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని అన్నారు చంద్రబాబు.. ఈ బిల్లును అడ్డుకోవడం తీరని ద్రోహమని మరోసారి స్పష్టం చేశారు. అలాగే, ఈ అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కూడా చర్చించినట్లు తెలిపారు. 2017లో టీడీపీ అసెంబ్లీలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా తీర్మానం ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశంపై ప్రచారం చేపడతామని చెప్పారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలకు వివరిస్తామని, కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాకుండా చేస్తామని హెచ్చరించారు సీఎం చంద్రబాబు..
మహిళా రిజర్వేషన్ బిల్లుపై అనూహ్యంగా స్పందించిన చంద్రబాబు.. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో నిరసన ర్యాలీ నిర్వహించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న విపక్షాల వైఖరికి నిరసనగా ఈ ర్యాలీ చేపట్టారు. హెలిప్యాడ్ నుంచి ‘స్వచ్ఛ్ ఆంధ్ర’ సభ వేదిక వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో టీడీపీ మరియు కూటమి మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని, “మహిళా బిల్లు అడ్డుకోవడం ద్రోహం” అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు తో పాటు ఈ ర్యాలీలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు డగ్గుబాటి పురందేశ్వరి (మాధవ్), మంత్రి కందుల దుర్గేష్, సోము వీర్రాజు, నిమ్మల రామానాయుడు తదితర కూటమి నేతలు పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు, మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం మహిళలపై ద్రోహమని తీవ్రంగా వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Vinesh Phogat: ఆసియా క్రీడల ట్రయల్స్లో పాల్గొనేందుకు.. వినేష్ ఫోగాట్కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
-
BVS Ravi: పూరి జగన్నాథ్ ఆగి ఆలోచిస్తే ఆ సినిమా రేంజే వేరుగా ఉంటుంది: బి.వి.ఎస్.రవి
-
Benjamin Netanyahu: ప్రపంచం వ్యతిరేకించినా భారత్ మాత్రం ఇజ్రాయెల్తోనే
-
India-Bangladesh: భారత్-బంగ్లాదేశ్ బోర్డర్లో ఉద్రిక్తత.. బీజీబీ ఎందుకు రెచ్చిపోతోంది?
-
Twisha Sharmas: ట్విషా శర్మ కేసులో మరో బిగ్ ట్విస్ట్.. మృతికి ముందు రూ.20 లక్షల షేర్లపై షాకింగ్ న్యూస్
ట్రెండింగ్
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!