CM Chandrababu: మహిళా బిల్లును అడ్డుకోవడం పెద్ద విద్రోహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో సీఎం చంద్రబాబు నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు.. నిడదవోలులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళా రిజర్వేషన్ బిల్లుపై మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం దేశానికి, మహిళలకు చేసిన పెద్ద విద్రోహమని వ్యాఖ్యానించారు.. కాంగ్రెస్ పార్టీతో పాటు వారి మిత్రపక్షాలు మహిళల ఆశలను ద్రోహం చేశాయని విమర్శించారు. ఇది క్షమించరాని నేరమని ఆయన అన్నారు. “మహిళల ఓట్లు అడగాలంటే ముందుగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలి. దానికి అడ్డుపడిన వారు రేపు ఏ మొఖంతో మహిళల దగ్గరకు వెళ్తారు?” అని ఆయన ప్రశ్నించారు. ప్రధానమంత్రి 2029 నాటికి మహిళలకు రిజర్వేషన్ అమలు చేయాలనే సంకల్పం ప్రకటించారని, కానీ కాంగ్రెస్ పార్టీ దీనిని వక్రీకరించి ప్రజల్లో తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
Read Also: Regina: కోల్పోయాకే దాని విలువ తెలిసింది.. రెజీనా కాసాండ్రా ఎమోషనల్ పోస్ట్ వైరల్!
Also Read
- Minister Nimmala Ramanaidu: జగన్ పాలనపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు.. మేనమామనని చెప్పి మోసం చేశారు..!
- Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై పవన్ కల్యాణ్.. రెండో రోజు కూడా క్షేత్రస్థాయిలో తనిఖీలు
- Deputy CM Pawan Kalyan: గోదావరి పుష్కరాలు ఏర్పాట్లపై సమీక్ష.. పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి
- MLC AnanthaBabu: ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్.. బెయిల్ రద్దు చేసిన కోర్టు
దక్షిణ భారత రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని చెప్పడం సరైంది కాదని, మహిళలందరూ ఈ బిల్లుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని అన్నారు చంద్రబాబు.. ఈ బిల్లును అడ్డుకోవడం తీరని ద్రోహమని మరోసారి స్పష్టం చేశారు. అలాగే, ఈ అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కూడా చర్చించినట్లు తెలిపారు. 2017లో టీడీపీ అసెంబ్లీలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా తీర్మానం ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశంపై ప్రచారం చేపడతామని చెప్పారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలకు వివరిస్తామని, కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాకుండా చేస్తామని హెచ్చరించారు సీఎం చంద్రబాబు..
మహిళా రిజర్వేషన్ బిల్లుపై అనూహ్యంగా స్పందించిన చంద్రబాబు.. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో నిరసన ర్యాలీ నిర్వహించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న విపక్షాల వైఖరికి నిరసనగా ఈ ర్యాలీ చేపట్టారు. హెలిప్యాడ్ నుంచి ‘స్వచ్ఛ్ ఆంధ్ర’ సభ వేదిక వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో టీడీపీ మరియు కూటమి మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని, “మహిళా బిల్లు అడ్డుకోవడం ద్రోహం” అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు తో పాటు ఈ ర్యాలీలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు డగ్గుబాటి పురందేశ్వరి (మాధవ్), మంత్రి కందుల దుర్గేష్, సోము వీర్రాజు, నిమ్మల రామానాయుడు తదితర కూటమి నేతలు పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు, మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం మహిళలపై ద్రోహమని తీవ్రంగా వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Gandhi Sarovar Project : మూసీ ప్రక్షాళనకు బిగ్ బూస్ట్.. గాంధీ సరోవర్కు గ్రీన్ సిగ్నల్
-
WhatsApp Subscription India: ఉచిత వాట్సాప్ యుగానికి ముగింపు?.. భారత్లో చెల్లింపు సేవల ఆరంభం
-
KTR : హామీల ఊసే లేదు.. రాష్ట్రాన్ని మాఫియా నడుపుతోంది
-
Thaman S: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తమన్.. ఆ పిల్లల స్కూల్ ఫీజులు కట్టేసిన మ్యూజిక్ డైరెక్టర్!
-
IPL 2027: గంగూలీ మాస్టర్ ప్లాన్.. ఐపీఎల్ 2027లో ఆ జట్టుకు కోచ్గా యువరాజ్ సింగ్..
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?