MLC elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి వ్యాఖ్యలు వివాదాస్పదం..!
- కలకలం రేపుతోన్న కూటమి అభ్యర్థి రాజశేఖర్ వ్యాఖ్యలు..
- ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో హీట్..
- ఢిల్లీలో ఆప్ పనితీరును ఆదర్శంగా తీసుకోవాలన్న కూటమి అభ్యర్థి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC elections: ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఢిల్లీలో అమ్మ్ ఆద్మీ పార్టీ పనితీరును ఆదర్శంగా తీసుకుని పని చేయాలని పిలుపునివ్వడం ఆశ్చర్యానికి గుర్తు చేసింది. రాజమండ్రిలో జరిగిన తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ సమాయత్తా సమావేశంలో పేరాబత్తుల రాజశేఖర్ వ్యాఖ్యలు వివాదంగా మారాయి. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి.. ఢిల్లీ ఎన్నికల్లో అమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేయవద్దని ప్రచారం చేస్తుంటే.. ఇక్కడ మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా ఉన్న రాజశేఖర్ ఇందుకు విరుద్ధంగా.. ఎన్నికల ప్రచారం చేయడం వివాదాస్పదం అయ్యింది..
Read Also: Sanju Samson: ఐపీఎల్కు ముందు రాజస్థాన్కు భారీ దెబ్బ.. శాంసన్కు గాయం
Also Read
- Jakkampudi Raja Protest: పీఎస్ ఎదుట ఆందోళనకు దిగిన జక్కంపూడి..
- Anantha Babu Case: జైల్లో ఇంటి భోజనం కోరిన అనంతబాబు.. కోర్టు కీలక ఆదేశాలు
- Minister Nimmala Ramanaidu: జగన్ పాలనపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు.. మేనమామనని చెప్పి మోసం చేశారు..!
- Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై పవన్ కల్యాణ్.. రెండో రోజు కూడా క్షేత్రస్థాయిలో తనిఖీలు
అమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు నిబద్ధత పనిచేయటం కారణంగానే ప్రజలు పట్టం కడుతున్నారని కొనియాడారు. అయితే, కూటమిలోని పార్టీల అధినేతలు.. అమ్ ఆద్మీ పార్టీ అవినీతి పార్టీ అని ప్రచారం చేస్తుంటే.. ఎమ్మెల్సీ అభ్యర్థి ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం జనసైనికులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఎమ్మెల్సీ ఓటమి అభ్యర్థి వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు గుసగుసలు లాడుకుంటున్నారు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా రాజశేఖర్ నిలబెడితే.. బీజేపీకి వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేయటం ఏమిటంటూ ముక్కుమీద వేలేసుకుంటున్నారు.. రాజశేఖర్ వ్యాఖ్యలు యాదృచ్ఛికంగా చేశారా..? లేక ఉద్దేశ పూర్వకంగా? వివాదస్పద వ్యాఖ్యలు చేశారా? అంటూ గుసగుసలు ఆడుకుంటున్నారు.. మొత్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్టాపిక్గా మారిపోయాయి.
తాజావార్తలు
-
Bahadurguda: బహుద్దుర్ గుడాలో హైటెన్షన్..!
-
Abhijeet Dipke: సోనమ్వాంగ్చుక్ దీక్ష భగ్నం వేళ అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం..
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ రిటైర్మెంట్.. సెలెక్టర్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు!
-
PV Sindhu: సెమీస్లో అదరగొట్టిన పీవీ సింధు.. జపాన్ ఓపెన్ టైటిల్కు ఒక్క అడుగు దూరంలో
-
CM Chandrababu: టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు క్లాస్.. సమన్వయంపై ప్రత్యేక దృష్టి
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!