MLC elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి వ్యాఖ్యలు వివాదాస్పదం..!
- కలకలం రేపుతోన్న కూటమి అభ్యర్థి రాజశేఖర్ వ్యాఖ్యలు..
- ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో హీట్..
- ఢిల్లీలో ఆప్ పనితీరును ఆదర్శంగా తీసుకోవాలన్న కూటమి అభ్యర్థి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC elections: ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఢిల్లీలో అమ్మ్ ఆద్మీ పార్టీ పనితీరును ఆదర్శంగా తీసుకుని పని చేయాలని పిలుపునివ్వడం ఆశ్చర్యానికి గుర్తు చేసింది. రాజమండ్రిలో జరిగిన తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ సమాయత్తా సమావేశంలో పేరాబత్తుల రాజశేఖర్ వ్యాఖ్యలు వివాదంగా మారాయి. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి.. ఢిల్లీ ఎన్నికల్లో అమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేయవద్దని ప్రచారం చేస్తుంటే.. ఇక్కడ మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా ఉన్న రాజశేఖర్ ఇందుకు విరుద్ధంగా.. ఎన్నికల ప్రచారం చేయడం వివాదాస్పదం అయ్యింది..
Read Also: Sanju Samson: ఐపీఎల్కు ముందు రాజస్థాన్కు భారీ దెబ్బ.. శాంసన్కు గాయం
Also Read
- MLC AnanthaBabu: ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్.. బెయిల్ రద్దు చేసిన కోర్టు
- CM Chandrababu: మహిళా బిల్లును అడ్డుకోవడం పెద్ద విద్రోహం..
- Dead Body Door Delivery Case: ఎమ్మెల్సీ అనంతబాబు భార్యకు షాక్.. పిటిషన్ కొట్టివేసిన కోర్టు..
- Governor Abdul Nazeer: నేడు ఆదికవి నన్నయ్య వర్సిటీ స్నాతకోత్సవం.. ముఖ్య అతిథిగా గవర్నర్
అమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు నిబద్ధత పనిచేయటం కారణంగానే ప్రజలు పట్టం కడుతున్నారని కొనియాడారు. అయితే, కూటమిలోని పార్టీల అధినేతలు.. అమ్ ఆద్మీ పార్టీ అవినీతి పార్టీ అని ప్రచారం చేస్తుంటే.. ఎమ్మెల్సీ అభ్యర్థి ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం జనసైనికులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఎమ్మెల్సీ ఓటమి అభ్యర్థి వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు గుసగుసలు లాడుకుంటున్నారు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా రాజశేఖర్ నిలబెడితే.. బీజేపీకి వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేయటం ఏమిటంటూ ముక్కుమీద వేలేసుకుంటున్నారు.. రాజశేఖర్ వ్యాఖ్యలు యాదృచ్ఛికంగా చేశారా..? లేక ఉద్దేశ పూర్వకంగా? వివాదస్పద వ్యాఖ్యలు చేశారా? అంటూ గుసగుసలు ఆడుకుంటున్నారు.. మొత్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్టాపిక్గా మారిపోయాయి.
తాజావార్తలు
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
-
Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
-
Bajirao Peshwa : గెరిల్లా వార్లో దిట్ట.. బాజీరావు స్టైల్ ఇదే.!
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!