Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Former Rajanagaram Mla Jakkampudi Raja Has Given Clarity On The Campaign That The Jakkampudi Family Is Joining Jana Sena

Jakkampudi Raja: జనసేనలో చేరికపై క్లారిటీ ఇచ్చిన జక్కంపూడి.. చిరంజీవి అంటే మా కుటుంబానికి అభిమానం..!

Published Date :July 9, 2025 , 1:42 pm
By Sudhakar Ravula
  • జక్కింపూడి ఫ్యామిలీ జనసేనలో చేరుతుంది అంటూ ప్రచారం..
  • క్లారిటీ ఇచ్చిన రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా..
  • సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు..
  • చిరంజీవి అంటే మా కుటుంబానికి అభిమానమని స్పష్టం..
Jakkampudi Raja: జనసేనలో చేరికపై క్లారిటీ ఇచ్చిన జక్కంపూడి.. చిరంజీవి అంటే మా కుటుంబానికి అభిమానం..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Jakkampudi Raja: ఓవైపు జక్కింపూడి ఫ్యామిలీ జనసేనలో చేరుతుందనే ప్రచారంపై క్లారిటీ ఇస్తూనే.. మరోవైపు, జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను టార్గెట్‌ చేశారు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా.. గతంలోనూ పవన్‌ను టార్గెట్‌గా విమర్శలు చేసిన ఆయన.. మరోసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్‌పై, జనసేన శ్రేణులపై ఫైర్ అయ్యారు. అధికారంలో ఉన్నా.. అసెంబ్లీకి, మంత్రివర్గ సమావేశాలకు హాజరు కాకుండా సినిమాలు చేసుకుంటున్నారని పవన్‌పై విరుచుకుపడ్డారు.. అయితే, పదవిలో లేకపోయినా మేం నిత్యం ప్రజాక్షేత్రంలోనే ఉంటామని అన్నారు. ఎన్నికల ముందు సోనాలి ప్రీతికి ఏదో అయిపోయిందని గుండెలు బాదుకున్నారని, ప్రస్తుతం రాష్ట్రంలో వేలాది మంది మహిళలు అత్యాచారాలకు గురవుతున్న ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నించారు.

Read Also: EBOO Therapy Treatment: డాక్టర్ ధీరజ్ ‘పెయిన్ రిలీఫ్ & వెల్‌నెస్ సెంటర్’లో EBOO థెరపీ ప్రారంభం

రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన జక్కంపూడి రాజా.. జక్కంపూడి కుటుంబానికి జనసేన పార్టీలో చేరాల్సిన అవసరం లేదని అన్నారు. మా కుటుంబం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో.. వైఎస్‌ జగన్ వెంటే ఉంటామని స్పష్టం చేశారు. జనసేన పార్టీలో చేరడానికి కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నామని ఆ పార్టీ శ్రేణులు చేసిన ఆరోపణలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొట్టి పారేశారు. కొంతమంది సైకో ఫ్యాన్స్ మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మతిభ్రమించి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయంగా ఎదగడానికి పవన్ కల్యాణ్‌ దృష్టిలో పడటం కోసమే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే మాకు సంతోషమేనని అన్నారు. సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు.. చిరంజీవి అంటే మా కుటుంబానికి అభిమానమని స్పష్టం చేశారు. మా తమ్ముడు పెళ్లి శుభలేఖ ఇవ్వడానికి చిరంజీవి వద్దకు వెళ్తే.. మా కుటుంబం గురించి గొప్పగా చెప్పారని గుర్తు చేశారు. జక్కంపూడి కుటుంబం రాజకీయాల్లో ఉండాలని ఏ పార్టీ అయినా కోరుకుంటుందని చిరంజీవి అన్నారని తెలిపారు రాజానగరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత జక్కంపూడి రాజా..

Read Also: Sigachi Factory Blast: సిగాచి పరిశ్రమ పేలుడు.. ఆచూకీ లభించని 8 కార్మికులపై అధికారుల కీలక ప్రకటన..!

రాజమండ్రి ఆంధ్రా పేపర్ మిల్లు. కార్మికుల సమస్యలపై ఉద్యమానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతుంది. ఈ నెల 14వ తేదీలోగా కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని డెడ్ లైన్ ఇచ్చారు. లేనిపక్షంలో నా తల్లి గాని నేను గాని అమరణ నిరాహార దీక్ష చేపడతామని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా హెచ్చరించారు. పేపర్ మిల్లు యాజమాన్యం కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. కొత్త వేతన ఒప్పంద చట్టం అమలు చేయాలని, గుర్తింపు యూనియన్ ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు బకాయిపడిన 50 కోట్ల రూపాయలు తక్షణమే చెల్లించాలని కోరారు. అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన మంత్రి కందుల దుర్గేష్, ఎం.పి. పురంధేశ్వరి, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు మొఖం చాటేశారని ఆరోపించారు. ఎన్నికల ముందు కార్మికులను వాడుకుని అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన పట్టించుకోవడంలేదని జక్కంపూడి రాజా మండిపడ్డారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • Chiranjeevi
  • Jakkampudi family
  • jana sena
  • pawan kalyan

తాజావార్తలు

  • “Dhurandhar The Revenge” చిత్ర యూనిట్‌కు బిగ్‌ షాక్.. విడుదలైన ఫస్ట్ డేనే పాకిస్థాన్‌లో పైరసీ కాపీ ప్రత్యక్షం!

  • Butter Curd Rice : హెల్తీ, రుచికరమైన బటర్ కర్డ్ రైస్.. ఇలా సింపుల్ గా తయారు చేసుకోండి..!

  • IPL 2026 Injury List: గాయాల దెబ్బ, స్టార్ ప్లేయర్స్ ఔట్.. ఐపీఎల్ జట్లకు భారీ షాక్!

  • UstaadBhagatSingh Frist Day Collections : ఉస్తాద్ భగత్ సింగ్ మెుదటి రోజు కలెక్షన్స్.. డిస్ట్రిబ్యూటర్స్ కు భారీ షాక్

  • US-Iran War: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు చావుదెబ్బ.. 16 యుద్ధ విమానాలు ధ్వంసం!

ట్రెండింగ్‌

  • Summer Super Drinks : బాదం షర్బత్ ట్రై చేశారా..? ఎండలో కూల్‌గా ఉండే సూపర్ డ్రింక్.!

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions