Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనను చంపడానికి కూడా ప్రయత్నించారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నన్ను బయటకు రాకుండా అడ్డుకోవాలని చూశారు. ఎన్ని రోజులైనా జైల్లోనే ఉండాలని వెళ్లాను. జైలులో పెడితే భయపడే వ్యక్తిని కాదు అని అంబటి స్పష్టం చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఒకవేళ తప్పు చేసినా వెంటనే క్షమాపణలు చెప్పానని తెలిపారు. అయినప్పటికీ తప్పుడు కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
Read Also: Vishnu Vinyasam Teaser: శ్రీవిష్ణు ‘విష్ణు విన్యాసం’ టీజర్ మామూలుగా లేదుగా!
తన కష్టసమయంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు అంబటి రాంబాబు.. నా ఇంటిపై 7 గంటల పాటు దాడి చేశారు. నా భార్యా పిల్లలను వేధించారు. ఆ దాడిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మానిటర్ చేశారు అని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చేందుకు పోరాడతాం.. నన్ను చంపడానికి ప్రయత్నించారు.. అన్నింటికీ దేవుడే సమాధానం చెబుతాడు అని వ్యాఖ్యానించారు. అలాగే తాను గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి వెంట నడిచానని, ప్రస్తుతం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నానని తెలిపారు. తన బొందిలో ప్రాణం ఉన్నంత వరకు జగన్ వెంటే నడుస్తాను అని స్పష్టం చేశారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, జైలు జీవితాన్ని కూడా ఎంజాయ్ చేశానని అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఇక, పోలీసులు నన్ను ఇబ్బంది పెట్టలేదు.. జైలు బాత్రూమ్లో జారి పడనాన్న అంబటి రాంబాబు ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్ను క్లిక్ చేయండి..
