Dung Cakes Fight : ఘనంగా జరిగిన పిడకల సమరం.. పలువురికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి సంవత్సరం కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పలలో పిడకల సమరం ఆనవాయితీగా వస్తోంది. ప్రేమికులైన వీరభద్రస్వామి, కాళికాదేవిని ఒక్కటి చేసేందుకు రెండు వర్గాలు పిడకలతో హోరాహోరీగా పోరాడి, పిడకల సమరం అనంతరం పంచాయతీ జరిపి స్వామి అమ్మవార్లను ఒక్కటి చేయడం జరుగుతుంది. సుధీర్ఘ చరిత్ర ఉన్న ఈ పిడకల యుద్ధాన్ని ప్రతి ఏటా ఉగాది మురుసటి రోజు దీన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కైరుప్పలలో పిడకల సమరం ఘనంగా జరుపుకున్నారు. గ్రామస్థులు రెండువర్గాలుగా విడిపోయి పిడకలతో కొట్టుకున్నారు. పెద్దరెడ్డి వంశస్థుడైన నరసింహారెడ్డి గుర్రంపై మందీమార్బలం, తప్పెట్లు మేళతాళాలతో సాంప్రదాయ ప్రకారం కారుమంచి గ్రామం నుంచి కైరుప్పల గ్రామానికి ఆదివారం సాయంత్రం వచ్చారు.
వీరభద్రస్వామి, కాళికాదేవి ఆలయంలో పూజలు చేసి వెనుదిరగగానే పిడకల సమరం ప్రారంభమైంది. తమను తాము రక్షించుకుంటూ ఎదుటి వారిపై పిడకలు విసురుకున్నారు. ఒకసారి ఒక వర్గం వారి పైచేయి కాగా.. మరోసారి మరో వర్గం వారిది పైచేయిగా నిలిచింది. అర గంటకుపైగా సాగిన సమరంలో వీరభద్రస్వామి వర్గం విజయం సాధించింది. అయితే పిడకల సమరం ముగిసాక, స్వామి వారి ఉత్సవ విగ్రహాలు పల్లకిలో ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. అయితే పిడకల సమరాన్ని చూసేందుకు వివిధ గ్రామాల నుంచి భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ పిడకల యుద్ధంలో 50 మందికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది.
Also Read
- CM Chandrababu: కాగితాలు తీసుకుని కార్లో వదిలిపెట్టొద్దు, పరిష్కారం చూపండి.. కలెక్టర్లకు సీఎం ఆదేశాలు!
- CM Chandrababu: మంత్రుల రివ్యూకు మినహాయింపు ఉండదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్!
- Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!
- What's Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
https://ntvtelugu.com/tata-groups-will-soon-launch-the-new-app-tata-neu/
తాజావార్తలు
-
Suryakumar-Gill: భారత జట్టులో కీలక మార్పులు.. గిల్, సూర్యకు షాక్ తప్పదా?
-
Dragon – Peddi : ఎన్టీఆర్ – రామ్ చరణ్ మరోసారి.. ఫ్యాన్స్ కు పూనకాలే
-
Easy Evening Snacks : టీ టైమ్ స్నాక్.. కేవలం రవ్వతో కరకరలాడే స్నాక్స్.. ఒక్కసారి చేస్తే వారం రోజులు నిల్వ.!
-
Rajinikanth : ఆ ‘100వ సినిమా’ తీయకుండానే వెళ్ళిపోయారు.. ఆర్బీ చౌదరి పై రజనీకాంత్ ఎమోషనల్..
-
CM Revanth Reddy : దేశానికే మోడల్గా కొడంగల్.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ