Drugs: విజయవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం..!
విజయవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించాయి.. డ్రగ్స్ కొరియర్ కేస్ చిక్కు ముడి విడకముందే నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించింది. నిందితుల నుండి 8 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.. నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో పక్క ప్లాన్ తో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులను అరెస్ట్ చేశారు కర్నూలు పోలీసులు.. మరో ముగ్గురూ పరారీ అయినట్టుగా చెబుతున్నారు.. ఎనర్జీ బూస్ట్లో ఉపయోగించే మెధాంఫిటమైన్ డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు.. కర్నూల్ డ్రగ్స్ విక్రయాలతో విజయవాడ యువకుల సంబంధాలు ఉన్నట్టుగా తేల్చారు.. విద్యార్థులు టార్గెట్గా డ్రగ్స్ వ్యవహారం సాగుతున్నట్టుగా.. ఆన్లైన్ ద్వారా డ్రగ్స్ వ్యవహారం నడుస్తున్నట్లు సమాచారం… బెంగుళూరు, హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ వ్యవహారం నడుస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు..
Read also: Russia-Ukraine war: పుతిన్పై ఆ దేశం నిషేధం.. సెనెట్లో బిల్లు..
Also Read
- Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
- Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
- Petrol and Diesel Shortage in AP: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం ఆరా
మరోవైపు, డ్రగ్స్ కొరియర్ కేసులో ఇప్పటివరకు ఐదుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు.. మరో ఇద్దరు ప్రధాన నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు.. పోలీసు విచారణలో పలు సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.. చెన్నైకి చెందిన డ్రగ్స్ ఎగుమతి చేసే కుప్పుసామి అరుణాచలం వెంకటేశన్ మరియు మరో ఇద్దరు నిందితులతో కలిసి నిషేదిత “Ephedrine” డ్రగ్ ను విదేశాలకు ఎగుమతి చేసి డబ్బు సంపాదించారని.. అందుకోసం కొంతమంది ఆధార్ కార్డులు సేకరించి మార్ఫింగ్ చేశారని.. డ్రగ్స్ ను విదేశాలకు పంపేందుకు విజయవాడ భారతి నగర్ లోని డీఎస్టీ కొరియర్ ఆఫీసులోని తేజ అను ఉద్యోగికి డబ్బు ఆశ చూపించారి.. హైదరాబాద్లోని డీఎస్టీ హెడ్ ఆఫీసులో పని చేస్తున్న మేనేజర్ ఎర్రం శ్యామ్ సుందర్, కీర్తిపాటి ప్రవీణ్ వర్మ, తుమ్మల శ్రీనివాస్లు డ్రగ్స్ ఎగుమతి చేయటానికి లాలూచి పడ్డారని.. వీళ్ల సహకారంతోనే డ్రగ్ ఆస్ట్రేలియాకు ఎగుమతి జరిగిందని విచారణలో తేల్చారు పోలీసులు.. ఇక, నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
ఈ కేసులో మిగిలిన నిందితుల కోసం గాలింపు కొనసాగుతుంది.. డ్రగ్స్ కేసు దర్యాప్తులో భాగంగా మార్చి 30న గుత్తలతేజను బెంగళూరు ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు.. అనంతరం విజయవాడ పటమట పీఎస్ లో గోపిసాయి ఫిర్యాదు మేరకు ఆధార్ కార్డు మార్ఫింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు… డ్రగ్ ఎగుమతి చేసిన కుప్పుసామి అరుణాచలం వెంకటేశన్ ను మే5న అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు.. మే14న కస్టడీకి తీసుకుని విచారించిన సందర్భంలో డీఎస్టీ కొరియర్ సంస్థ ఉద్యోగుల ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి.. అనంతరం మూడు పోలీసు బృందాల ద్వారా నిందితుల గాలింపు చర్యలు చేపట్టారు.. మే 16న డీఎస్టీ కొరియర్ హెడ్ ఆఫీసు ఉద్యోగులైన ఎర్రం శ్యామ్ సుందర్, కీర్తిపాటి ప్రవీణ్ వర్మ, తుమ్మల శ్రీనివాస్లను హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు.. అయితే, మరోసారి డ్రగ్స్ దొరకడం విజయవాడలో కలకలం సృష్టిస్తోంది.
తాజావార్తలు
-
Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
-
యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!