Drugs: విజయవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించాయి.. డ్రగ్స్ కొరియర్ కేస్ చిక్కు ముడి విడకముందే నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించింది. నిందితుల నుండి 8 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.. నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో పక్క ప్లాన్ తో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులను అరెస్ట్ చేశారు కర్నూలు పోలీసులు.. మరో ముగ్గురూ పరారీ అయినట్టుగా చెబుతున్నారు.. ఎనర్జీ బూస్ట్లో ఉపయోగించే మెధాంఫిటమైన్ డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు.. కర్నూల్ డ్రగ్స్ విక్రయాలతో విజయవాడ యువకుల సంబంధాలు ఉన్నట్టుగా తేల్చారు.. విద్యార్థులు టార్గెట్గా డ్రగ్స్ వ్యవహారం సాగుతున్నట్టుగా.. ఆన్లైన్ ద్వారా డ్రగ్స్ వ్యవహారం నడుస్తున్నట్లు సమాచారం… బెంగుళూరు, హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ వ్యవహారం నడుస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు..
Read also: Russia-Ukraine war: పుతిన్పై ఆ దేశం నిషేధం.. సెనెట్లో బిల్లు..
Also Read
- CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో 'బుల్లెట్ మోటార్ సైకిల్' ప్రాజెక్టు ఏర్పాటు..!
- Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
- Inter Results Error: 60 మార్కులొస్తే 6 మార్కులు వేసిన లెక్చరర్.. దిమ్మతిరిగే పనిష్మెంట్ ఇచ్చిన సర్కార్..!
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
మరోవైపు, డ్రగ్స్ కొరియర్ కేసులో ఇప్పటివరకు ఐదుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు.. మరో ఇద్దరు ప్రధాన నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు.. పోలీసు విచారణలో పలు సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.. చెన్నైకి చెందిన డ్రగ్స్ ఎగుమతి చేసే కుప్పుసామి అరుణాచలం వెంకటేశన్ మరియు మరో ఇద్దరు నిందితులతో కలిసి నిషేదిత “Ephedrine” డ్రగ్ ను విదేశాలకు ఎగుమతి చేసి డబ్బు సంపాదించారని.. అందుకోసం కొంతమంది ఆధార్ కార్డులు సేకరించి మార్ఫింగ్ చేశారని.. డ్రగ్స్ ను విదేశాలకు పంపేందుకు విజయవాడ భారతి నగర్ లోని డీఎస్టీ కొరియర్ ఆఫీసులోని తేజ అను ఉద్యోగికి డబ్బు ఆశ చూపించారి.. హైదరాబాద్లోని డీఎస్టీ హెడ్ ఆఫీసులో పని చేస్తున్న మేనేజర్ ఎర్రం శ్యామ్ సుందర్, కీర్తిపాటి ప్రవీణ్ వర్మ, తుమ్మల శ్రీనివాస్లు డ్రగ్స్ ఎగుమతి చేయటానికి లాలూచి పడ్డారని.. వీళ్ల సహకారంతోనే డ్రగ్ ఆస్ట్రేలియాకు ఎగుమతి జరిగిందని విచారణలో తేల్చారు పోలీసులు.. ఇక, నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
ఈ కేసులో మిగిలిన నిందితుల కోసం గాలింపు కొనసాగుతుంది.. డ్రగ్స్ కేసు దర్యాప్తులో భాగంగా మార్చి 30న గుత్తలతేజను బెంగళూరు ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు.. అనంతరం విజయవాడ పటమట పీఎస్ లో గోపిసాయి ఫిర్యాదు మేరకు ఆధార్ కార్డు మార్ఫింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు… డ్రగ్ ఎగుమతి చేసిన కుప్పుసామి అరుణాచలం వెంకటేశన్ ను మే5న అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు.. మే14న కస్టడీకి తీసుకుని విచారించిన సందర్భంలో డీఎస్టీ కొరియర్ సంస్థ ఉద్యోగుల ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి.. అనంతరం మూడు పోలీసు బృందాల ద్వారా నిందితుల గాలింపు చర్యలు చేపట్టారు.. మే 16న డీఎస్టీ కొరియర్ హెడ్ ఆఫీసు ఉద్యోగులైన ఎర్రం శ్యామ్ సుందర్, కీర్తిపాటి ప్రవీణ్ వర్మ, తుమ్మల శ్రీనివాస్లను హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు.. అయితే, మరోసారి డ్రగ్స్ దొరకడం విజయవాడలో కలకలం సృష్టిస్తోంది.
తాజావార్తలు
-
IPL 2026 Playoff Tickets: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ టిక్కెట్స్ షెడ్యూల్ వచ్చేసింది.. ఇక్కడ బుక్ చేసుకోండిలా..
-
Tamil Nadu: షాకింగ్.. 13 ఏళ్ల బాలుడిని చంపి పాతిపెట్టిన మైనర్ స్నేహితులు
-
Kamal Haasan: స్టార్ హీరోల కళ్ళు తెరిపించిన కమల్ హాసన్.. నెట్టింట ప్రశంసల వెల్లువ!
-
Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వీడియో
-
Jananayagan : కళ్లు చెదిరే రేటుకు ‘జననాయగన్’ తెలుగు రైట్స్?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!