Drugs: విజయవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించాయి.. డ్రగ్స్ కొరియర్ కేస్ చిక్కు ముడి విడకముందే నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించింది. నిందితుల నుండి 8 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.. నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో పక్క ప్లాన్ తో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులను అరెస్ట్ చేశారు కర్నూలు పోలీసులు.. మరో ముగ్గురూ పరారీ అయినట్టుగా చెబుతున్నారు.. ఎనర్జీ బూస్ట్లో ఉపయోగించే మెధాంఫిటమైన్ డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు.. కర్నూల్ డ్రగ్స్ విక్రయాలతో విజయవాడ యువకుల సంబంధాలు ఉన్నట్టుగా తేల్చారు.. విద్యార్థులు టార్గెట్గా డ్రగ్స్ వ్యవహారం సాగుతున్నట్టుగా.. ఆన్లైన్ ద్వారా డ్రగ్స్ వ్యవహారం నడుస్తున్నట్లు సమాచారం… బెంగుళూరు, హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ వ్యవహారం నడుస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు..
Read also: Russia-Ukraine war: పుతిన్పై ఆ దేశం నిషేధం.. సెనెట్లో బిల్లు..
Also Read
- Road Accident: రాజమండ్రిలో రోడ్డు ప్రమాదం.. స్కూల్ బస్సు-ఆటో ఢీ..
- ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
- Vijay Sai Reddy: నేను వైసీపీని వీడటానికి అసలు కారణం ఇదే.. విజయసాయిరెడ్డి లేఖలో కీలక విషయాలు..
- CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్న్యూస్
మరోవైపు, డ్రగ్స్ కొరియర్ కేసులో ఇప్పటివరకు ఐదుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు.. మరో ఇద్దరు ప్రధాన నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు.. పోలీసు విచారణలో పలు సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.. చెన్నైకి చెందిన డ్రగ్స్ ఎగుమతి చేసే కుప్పుసామి అరుణాచలం వెంకటేశన్ మరియు మరో ఇద్దరు నిందితులతో కలిసి నిషేదిత “Ephedrine” డ్రగ్ ను విదేశాలకు ఎగుమతి చేసి డబ్బు సంపాదించారని.. అందుకోసం కొంతమంది ఆధార్ కార్డులు సేకరించి మార్ఫింగ్ చేశారని.. డ్రగ్స్ ను విదేశాలకు పంపేందుకు విజయవాడ భారతి నగర్ లోని డీఎస్టీ కొరియర్ ఆఫీసులోని తేజ అను ఉద్యోగికి డబ్బు ఆశ చూపించారి.. హైదరాబాద్లోని డీఎస్టీ హెడ్ ఆఫీసులో పని చేస్తున్న మేనేజర్ ఎర్రం శ్యామ్ సుందర్, కీర్తిపాటి ప్రవీణ్ వర్మ, తుమ్మల శ్రీనివాస్లు డ్రగ్స్ ఎగుమతి చేయటానికి లాలూచి పడ్డారని.. వీళ్ల సహకారంతోనే డ్రగ్ ఆస్ట్రేలియాకు ఎగుమతి జరిగిందని విచారణలో తేల్చారు పోలీసులు.. ఇక, నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
ఈ కేసులో మిగిలిన నిందితుల కోసం గాలింపు కొనసాగుతుంది.. డ్రగ్స్ కేసు దర్యాప్తులో భాగంగా మార్చి 30న గుత్తలతేజను బెంగళూరు ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు.. అనంతరం విజయవాడ పటమట పీఎస్ లో గోపిసాయి ఫిర్యాదు మేరకు ఆధార్ కార్డు మార్ఫింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు… డ్రగ్ ఎగుమతి చేసిన కుప్పుసామి అరుణాచలం వెంకటేశన్ ను మే5న అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు.. మే14న కస్టడీకి తీసుకుని విచారించిన సందర్భంలో డీఎస్టీ కొరియర్ సంస్థ ఉద్యోగుల ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి.. అనంతరం మూడు పోలీసు బృందాల ద్వారా నిందితుల గాలింపు చర్యలు చేపట్టారు.. మే 16న డీఎస్టీ కొరియర్ హెడ్ ఆఫీసు ఉద్యోగులైన ఎర్రం శ్యామ్ సుందర్, కీర్తిపాటి ప్రవీణ్ వర్మ, తుమ్మల శ్రీనివాస్లను హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు.. అయితే, మరోసారి డ్రగ్స్ దొరకడం విజయవాడలో కలకలం సృష్టిస్తోంది.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!