Dr VMR Passed Away: డా.వి.మాలకొండారెడ్డి ఆకస్మిక మృతి
ప్రముఖ విద్యావేత్త, కవి, ఇంజనీర్ డా. వి.మాలకొండారెడ్డి ఆకస్మికంగా కన్నుమూశారు. ఆయనను ఉండేల మాలకొండారెడ్డి అంటేనే అంతా గుర్తుపడతారు. చిన్న తనం నుంచే ఆయన కవిత్వం చెప్పేవారు. చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వ్యవస్థాపకుడిగా ప్రసిద్ధి పొందారు. మాలకొండారెడ్డి 1932 ఆగస్టు 23 న ప్రకాశం జిల్లా లోని ఇనిమెట్ల గ్రామంలో జన్మించాడు. అల్లూరు, నెల్లూరులలో పాఠశాల చదువు ముగించి మద్రాసు గిండీ ఇంజనీరింగు కళాశాలలో బీఈ డిగ్రీ పూర్తిచేశారు.
ఎడిన్బరో యూనివర్శిటీ (బ్రిటన్) నుండి స్ట్రక్చరల్ ఇంజనీరింగులో డాక్టరేట్ సాధించారు. 1955-57లో పి.డబ్ల్యూ.డి.లో సివిల్ ఇంజనీర్గా పనిచేశాడు. తరువాత నాలుగు సంవత్సరాలు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆతర్వాత ఇరవై సంవత్సరాలు వరంగల్ లోని ప్రాంతీయ ఇంజనీరింగ్ కళాశాల (ఆర్.ఈ. సి) లో ప్రొఫెసర్గా పనిచేశారు. 1979లో చైతన్యభారతి ఇంజనీరింగ్ కళాశాల (సి.బి.ఐ.టి) ను స్థాపించారు. ఆ కాలేజీకి మొట్టమొదటి ప్రిన్సిపాల్గా వ్యవహరించారు. ఆ సంస్థకు ఫౌండర్ సెక్రెటరీగా, ఛైర్మన్ (2000-2003) గా, అడ్వైజర్గా సేవలనందించారు.
Also Read
- Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
- Off The Record : టీడీపీ నేతల డబ్బులతో జనసేన సభ్యత్వాలు..?
- Minister Dola Bala Veera Anjaneya Swamy: విజయసాయి రెడ్డికి మంత్రి డోలా కౌంటర్.. పగటి కలలు మానుకో..!
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
అలాగే, జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయానికి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా 1996-2004ల మధ్య సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల అసోసియేషన్కు కార్యదర్శిగాను, జాతీయ స్థాయిలో ఫెడరేషన్ ఆఫ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజస్ అసోసియేషన్స్కు అధ్యక్షుడిగాను ఉన్నాడు. సుజన యూనివర్సల్ ఇండస్ట్రీస్కు, సుజన మెటల్స్ ప్రాడక్ట్స్ లిమిటెడ్కు డైరెక్టర్గా వ్యవహరించారు. ఆయన స్ట్రక్చరల్ ఇంజనీరింగులో ఎన్నో పరిశోధనాపత్రాలు దేశ విదేశ జర్నల్స్లో ప్రచురించారు. 1986లో అంతర్జాతీయ వైద్య మహానగర్ మెడిసిటీని స్థాపించాడు.
హైదరాబాదులో హోటల్ సిద్ధార్థ, నందనం అపార్ట్మెంట్స్, వరంగల్లో సిద్ధార్థనగర్, చైతన్యపురి వంటివాటిని నిర్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సెనెట్ సభ్యుడిగా గౌరవం అందుకున్నారు. ఏపీ సైన్స్ అకాడమీకి ఫెలోసభ్యుడిగా ఉన్నారు. మాలకొండారెడ్డి అనేక పుస్తకాలు ప్రచురించారు. తెలుగు విశ్వవిద్యాలయం ఆయన్ని గౌరవించింది. ఆయన సేవలకు అనేక అవార్డులు లభించాయి. ఇందిరాగాంధీ నేషనల్ అవార్డ్ 2003లో అందుకున్నారు. అమెరికల్ బయోగ్రాఫికల్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ ఆఫ్ లీడర్ షిప్ (1998) అందుకున్నారు. విద్యావేత్త మాలకొండారెడ్డి ఆకస్మిక మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. విద్య, ఇంజనీరింగ్, సేవాల రంగాలకు ఆయన లేని లోటు తీర్చలేనిదన్నారు.
Read Also: Jagan Mohan Reddy: జగన్ టూర్లకు బుల్లెట్ ఫ్రూఫ్ బస్
తాజావార్తలు
-
Rashmika-Mysa: ‘మైసా’ షూటింగ్ అప్డేట్ అదిరిపోయింది..!
-
Punjab Kings Record: మోస్ట్ సక్సెస్ ఫుల్ రన్ ఛేజింగ్లు.. ఐపీఎల్లో టాప్ లేపిన పంజాబ్ కింగ్స్, ఫుల్ లిస్ట్ ఇదే!
-
NBK 111 : బాలయ్య సంచలన నిర్ణయం: రెమ్యునరేషన్ తగ్గించుకున్న నటసింహం.. కారణం అదేనా?
-
Prabhas – Salman Khan : మరోసారి ప్రభాస్ వర్సెస్ సల్మాన్ ఖాన్.. ఇద్దరి మధ్య గట్టి పోటీ
-
SA vs IND Women: భారత్ గెలిచిందోచ్.. ఆల్రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టిన దీప్తి శర్మ.!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!