AP Assembly: అసెంబ్లీ సమావేశాల తొలిరోజే మూడు రాజధానులపై చర్చ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Assembly: గురువారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే తొలిరోజే మూడు రాజధానులపై స్వల్పకాలికంగా చర్చించాలని ప్రభుత్వం యోచిస్తోంది. వచ్చే ఎన్నికలకు మూడు రాజధానుల రెఫరెండం అంశంతోనే వెళ్లాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో రేపటి అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల ఆవశ్యకతపై సీఎం జగన్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తారని తెలుస్తోంది. అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యాన్ని ప్రజల్లోకి సమగ్రంగా తీసుకుని వెళ్లే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోంది. మరోవైపు అమరావతి టు అరసవెల్లి రైతుల పాదయాత్ర జరుగుతుండటంపైనా అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ పాదయాత్ర వల్ల రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య వస్తుందని ప్రభుత్వం వారిస్తోంది.
Read Also: Tammareddy Bharadwaja: కృష్ణంరాజు గురించి మాట్లాడాలంటే నాకు సిగ్గుగా ఉంది
Also Read
- PM Modi 12 Years Governance: డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
- Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
- Pawan Kalyan: 33 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం జరగలేదు.. ప్రైవేటీకరణ జరగకూడదన్నదే మా ఆకాంక్ష!
- Nara Lokesh: డబ్బులిచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదు.. మంత్రి లోకేశ్ ఫైర్!
అటు అసెంబ్లీ సమావేశాలకు వచ్చి చర్చలో పాల్గొనాలని చంద్రబాబును కోరుతున్నట్లు మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్లే పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని చెబుతూ వస్తున్నామని.. దీనిపై చంద్రబాబు మహానాడులో తమకు సవాల్ విసిరారని.. పోలవరం ఆలస్యానికి జగనే కారణం అని నిరూపిస్తామని చెప్పారని.. ఈ అంశంపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. శాసనసభలో అడుగు పెట్టనని చంద్రబాబు మంగమ్మ శపథం చేశారని.. కానీ టీడీపీ సభ్యులు మాత్రం శాసనసభకు వస్తారని.. అంటే టీడీపీకి ఒక విధానం అంటూ లేదా అని నిలదీశారు. టీడీపీ అధినేతది ఒక విధానం.. వాళ్ల నేతలది ఇంకో విధానమా అని సూటి ప్రశ్న వేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు ఓటు వేయటానికి మాత్రం చంద్రబాబు శపథం పక్కన పెట్టి శాసనసభ ప్రాంగణంలో అడుగుపెట్టారని గుర్తుచేశారు. శాసనసభ సమావేశాలకు హాజరవడం ప్రతిపక్ష సభ్యుల బాధ్యత అని తాను గుర్తు చేస్తున్నట్లు మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
POK killings: పీఓకేలో పాక్ హత్యాకాండ.. 30 మంది బ్రిటిష్ ఎంపీల ఆందోళన..
-
Ponguleti Srinivas Reddy : గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో చేసిందేమీ లేదు
-
Tech News: మనల్ని మింగేసే రాక్షసి..! బాంబు పేల్చిన ‘క్లాడ్’
-
Abhai Naveen : కథ పట్టుకెళ్తే గ్లామర్ కావాలంటారు.. హీరోయిన్ల గుట్టు విప్పిన బిగ్ బాస్ అభయ్ నవీన్!
-
Mohammed Siraj: భారత జట్టులో కీలక మార్పు.. సిరాజ్ ఔట్.. అసలు విషయం ఇదే..!
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!