Tammareddy Bharadwaja: కృష్ణంరాజు గురించి మాట్లాడాలంటే నాకు సిగ్గుగా ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tammareddy Bharadwaja: టాలీవుడ్ ఇండస్ట్రీలో నిజాన్ని నిక్కచ్చిగా చెప్పేవారిలో తమ్మారెడ్డి భరద్వాజ ఒకరు. ఏ విషయమైన నిర్మొహమాటంగా చెప్పే తమ్మారెడ్డి భరధ్వాజ.. కృష్ణంరాజు విషయంలో తానూ సరిద్దిదుకోలేని తప్పు చేశానంటూ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. మూడు రోజుల క్రితం సీనియర్ నటుడు కృష్ణంరాజు మృతిచెందిన విషయం విదితమే. ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ నిన్న ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ లో సంతాప సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణంరాజు కుటుంబ సభ్యులతో పాటు మంచు మోహన్ బాబు, మంచు విష్ణు,తమ్మారెడ్డి భరధ్వాజ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరధ్వాజ కృష్ణంరాజు గురించి మాట్లాడుతూ “నేను నిర్మాతగా నిర్మించిన మొదటి సినిమాకు కృష్ణంరాజే హీరో.. నా సోదరుడు డైరెక్టర్. అయితే అప్పటికే కృష్ణంరాజు సీరియస్ హీరో.. డైరెక్టర్ వచ్చి ఆయనతో సినిమాలో పాటలు పాడించడం ఎలా..? అని చెప్పుకొచ్చాడు.
మొదటి సారి నిర్మాతగా చేస్తున్నా భయపడకుండా ఆయన దగ్గరకు వెళ్లి.. మీలాంటి సీరియస్ హీరోలకు పాటలు పెడితే ఏం బావుంటుంది అని ముఖం మీదే చెప్పేశాను.. వెంటనే ఆ ప్లేస్ లో ఇంకో హీరో ఉంటే బూతులు తిట్టేవారు.. కానీ కృష్ణంరాజు మాత్రం అంటే నేను పాటలకు పనికిరాను అంటావ్ అనేసి.. సినిమా మొత్తం సాంగ్స్ లేకుండానే చేశారు. అంతటి గొప్ప వ్యక్తి ఆయన.. ఒకానొక సమయంలో ఆయన ఫోన్ లిఫ్ట్ చేయాలంటే గజగజ వణికిపోయేవాడిని. అలాంటి సిగ్గుమాలిన పని చేశాను నేను.. కృష్ణంరాజు మూడేళ్ళ క్రితం నా దగ్గరకు వచ్చి మూవీ టవర్స్ లో ఒక ఇల్లు కావాలని అడిగారు. వెంటనే నేను.. అది మార్కెట్ రేటు ఉంటుందని చెప్పాను.. ఆయన ఎంతైనా పర్లేదు కొంటాను అని చెప్పారు. అయినా నేను ఒక్క ప్లాట్ ను కూడా కృష్ణంరాజుకు ఇవ్వలేకపోయాను. అది ఎంత సిగ్గుతో కూడిన పనో నాకు తెలుసు. ఆ తరవాత ఆ సిగ్గుతోనే అక్కడి నుంచి బయటికి వచ్చాను. ఆయనకు అలా చేసి ఇప్పుడు ఆయన గురించి మాట్లాడమంటే నాకు సిగ్గుగా ఉంది” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read
తాజావార్తలు
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
-
CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!