Dharmana Prasada Rao: వైసీపీ ప్రభుత్వం మేనిఫెస్టోకి కట్టుబడి పని చేస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dharmana Prasada Rao Says YCP Govt Working By Adhering To Manifesto: తమ వైసీపీ ప్రభుత్వం గత నాలుగేళ్ల నుంచి మేనిఫెస్టోకి కట్టుబడి పని చేస్తోందని, కరప్షన్ లేకుండా పథకాలను అందిస్తున్నామని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. పేదలకు ఆర్థికంగా ఉపశమనం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుందని, ఆ దిశగానే పని చేస్తుందని తెలిపారు. నాడు పాదయాత్రలో జగన్ చెప్పింది చెప్పినట్టే చేస్తున్నారని చెప్పారు. మహిళలు నేడు బలమైనశక్తిగా, కుటుంబానికి లీడర్గా ఎదిగారని తెలిపారు. సమాజానికి చంద్రబాబు నేర్పింది.. ఏ పనికి వెళ్లినా డబ్బులు ఇవ్వడమని చెప్పారు. ఆయన బ్రోకర్ వ్యవస్థని సృష్టించారని ఆరోపించారు.
Pawan Kalyan: ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ పేరు తెలిసిపోయిందిరోయ్.. ఇక రచ్చ షురూ చేయండి
Also Read
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- RAW NTR: 'ఊరు–వాడ' కార్యక్రమంపై 'రా ఎన్టీఆర్' కీలక ప్రకటన.. ఆరోపణలకు కౌంటర్..
- Potti Sriramulu's Sacrifice: 58 రోజుల పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష.. దేశాన్ని కదిలించిన ఉద్యమ చరిత్ర
- CM Chandrababu: టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు క్లాస్.. సమన్వయంపై ప్రత్యేక దృష్టి
పారదర్శకమైన పాలన తీసుకువచ్చిన ప్రభుత్వాన్ని నిలబెట్టాలని మంత్రి ధర్మాన పిలుపునిచ్చారు. మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్న జగన్ ప్రభుత్వానికి మహిళలు అండగా నిలబడాలని కోరారు. ఒకవేళ ఆడవాళ్లు జగన్ ప్రభుత్వాన్ని పడగొడితే.. రేపు ఆడవాళ్లను నమ్మకూడదని అనుకుంటారని పేర్కొన్నారు. మహిళలను అందలం ఎక్కించిన నేతను అక్కున చేర్చుకోవాలని సూచించారు. జగన్ని కాదని మరొకరిని అధికారంలోకి తీసుకొస్తే.. వాళ్లు మహిళల ఎకౌంట్లో పైసా కూడా చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఆహ్వానిస్తారా? తిరష్కరిస్తారా? మీరే నిర్ణయం తీసుకోండని పిలుపునిచ్చారు. చంద్రబాబు కేవలం ఎన్నికల సమయంలోనే ప్రజల ముందుకొస్తారని.. బొట్టు, గాజులు కొనుక్కోవాలని నాలుగు వేలు ఇస్తాడని ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే సంక్షేమం అందించామన్నారు.
Student Suside: ఇంట్లో గొడవ పడి విద్యార్థి ఆత్మహత్య.. శోకసంద్రంలో తల్లిదండ్రులు
అంతకుముందు కూడా.. ప్రజలకు మంచి చేయాలనే ఏకైక లక్ష్యంతోనే తమ ప్రభుత్వం పని చేస్తోందని ధర్మాన చెప్పారు. అవినీతికి తావు లేకుండా అన్ని పథకాలు లబ్ధిదారుల ఇంటికే నేరుగా చేరుతున్నాయని వెల్లడించారు. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలు ప్రజలను బెదిరించేవని విమర్శించారు. తమను ఎవరూ ప్రశ్నించకుండా ఉండేలా నిజాయితీగా పరిపాలన చేస్తున్నామని పేర్కొన్నారు. అవినీతి లేని పరిపాలన ఈ ప్రభుత్వంలోనే ఉందన్నారు.
తాజావార్తలు
-
Fauji: ఇన్స్టాగ్రామ్ను షేక్ చేసిన ప్రభాస్.. ‘ఫౌజీ’ ఫస్ట్ లుక్తో ఆల్టైమ్ రికార్డు!
-
Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
-
Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
-
Reverse Gear Bikes: రివర్స్ గేర్ ఉన్న టూ వీలర్స్ ఇవే.. పార్కింగ్, ఇరుకైన రోడ్లలో డ్రైవింగ్ ఇక సులువు!
-
CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?