Daggubati Purandeswari: ‘మన్ కీ బాత్’ను రాజకీయాలకు ముడి పెట్టొద్దు.. పురందేశ్వరి విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Daggubati Purandeswari About PM Modi Mann Ki Baat Program: ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని రాజకీయాలకు ముడి పెట్టొద్దని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి విజ్ఞప్తి చేశారు. మన్ కీ బాత్లో సామాజిక అంశాలు, మంచి పనులు ఉంటాయని తెలిపారు. ఏపీ బీజేపీ ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమాన్ని విజయవాడలో ప్రారంభించింది. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. జమ్ముకశ్మీర్ లాంటి ప్రాంతాల్లో జరుగుతున్న మంచి పనులు తెలిసేలా చేసేదే ఈ మన్ కీ బాత్ అని అన్నారు. ఒక్క ఉత్తరప్రదేశ్లోనే 30 కోట్ల చెట్లను నాటడానికి అక్కడి ప్రభుత్వం ముందుకొచ్చిందని మోడీ చెప్పారన్నారు. 2500 సంవత్సరాల పురాతన విగ్రహాలను అమెరికా నుంచి తిరిగి తెస్తున్నామని మోడీ తెలిపారన్నారు. మధ్యప్రదేశ్లోని విచార్పూర్ అనే గ్రామాన్ని మినీ బ్రెజిల్గా పేర్కొంటారని, అక్కడి పిల్లల్లో ఫుట్బాల్ క్రీడకి కావాల్సిన నైపుణ్యం వారి జీన్స్లోనే ఉందని కొనియాడారు. విచార్పూర్ ఒక చిన్న ఆదివాసీ గ్రామమని చెప్పారు. మన్ కీ బాత్ ప్రజల్లోకి బాగా చొచ్చుకుపోయిందని చెప్పుకొచ్చారు.
Women Fight in Bus Video: బస్సులో సీటు కోసం దారుణంగా కొట్టుకున్న మహిళలు.. ఓర్నీ..
Also Read
కాగా.. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా మోడీ మొదట హిందీలో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అనంతరం 11:30 నుంచి తెలుగులో మాట్లాడారు. దేశంలో డ్రగ్స్, మత్తు పదార్ధాలు లేకుండా చేయడం.. యువతను వాటి నుంచి దూరం చేయడంపై ప్రధాని ప్రసంగించారు. 75 సంవత్సరాల స్వతంత్రం వేడుకల సమయంలో యువత ప్రాధాన్యత గురించి మోడీ చెప్పారు. పలు దేశాల్లో ఉండిపోయిన భారత కళాకృతులను వెనక్కు తీసుకొచ్చామన్నారు. అలాగే.. తిరుపతిలో భక్తులు, యాత్రికుల కోసం ప్రసాద్ స్కీంను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు.
TFCC Elections: సంతోషపడాలో, సిగ్గుపడాలో తెలియట్లేదు.. ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలపై తమ్మారెడ్డి ఫైర్
తాజావార్తలు
-
OnePlus N6x: వన్ప్లస్ N6x త్వరలో భారత్లోకి.. ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో మరో సంచలనం
-
Palli Chattambi OTT: ఓటీటీలోకి టోవినో థామస్ పీరియడ్ యాక్షన్ డ్రామా… స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
-
Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
-
Windfall Tax: పెట్రోల్-డీజిల్, ఏటీఎఫ్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ పన్ను అకస్మాత్తుగా పెంపు
-
The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!