CPI Ramakrishna: ఏపీలో నియంత పాలన సాగుతోంది.. ఆమెకు న్యాయం చేయాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPI Ramakrishna Fires On AP CM YS Jagan: అమలాపురానికి చెందిన ఆరుద్ర అనే మహిళ సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు ఆత్మహత్యకి పాల్పడిన ఘటనపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రంగా స్పందించారు. సీఎం జగన్కి జనం గోడు వినే తీరిక లేదా? లేకపోతే ఎందుకు వినాలన్న అహంభావమా? అని ప్రశ్నించారు. సీఎంకు విన్నవించే అవకాశం లేక.. ఆ మహిళ సీఎం కార్యాలయం ముందు ఆత్మహత్యకి పాల్పడిందన్నారు. జగన్కి ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి సచివాలయం నుండి పాలన లేదన్నారు. తాడేపల్లిలో సీఎం క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకొని.. ముళ్ళ కంచెలు, పోలీస్ పహారా మధ్య మాత్రమే ఉంటున్నారని మండిపడ్డారు. ప్రజా వినతులు స్వీకరించే ఆలోచన సీఎంకి లేదని పేర్కొన్నారు. వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి అఖిలపక్ష సమావేశాలు జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కేవలం నిర్బంధకాండలు, అణిచివేతలతో.. నియంత పాలన మాత్రమే సాగుతోందని ఆరోపణలు చేశారు. కానిస్టేబుల్ వేధింపుల నుంచి ఆరుద్రని రక్షించి, ఆమెకు న్యాయం చేయాలని కోరారు.
కాగా.. సీఎం అపాయింట్మెంట్ లభించలేదన్న మనస్తాపంతో, ఆరుద్ర అనే మహిళ సీఎం కార్యాలయం ముందే తన మణికట్టు కోసుకుని బలవన్మరణం చెందేందుకు ప్రయట్నించిన విషయం తెలిసిందే. కాకినాడ జిల్లాకు చెందిన ఆరుద్రకు సాయిలక్ష్మీచంద్ర అనే కుమార్తె ఉంది. వెన్నెముక సమస్యతో బాధపడుతున్న ఆ యువతి చికిత్సకు రూ. 2 కోట్లు కావాలని వైద్యులు చెప్పారు. దీంతో తమ ఇంటిని అమ్మాలని ఆరుద్ర నిర్ణయించింది. అయితే.. తమ ఇంటిని అమ్ముకోనివ్వకుండా ఒక కానిస్టేబుల్, మరో వ్యక్తి కలిసి తమని బెదిరిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ని కలిసి, తన గోడు వెళ్లబోసుకుందామని కూతురితో పాటు క్యాంప్ ఆఫీస్కి వచ్చారు. అయితే.. అపాయింట్మెంట్ దక్కకపోవడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Also Read
- Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ
- Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!