CPI Ramakrishna: ఏపీలో నియంత పాలన సాగుతోంది.. ఆమెకు న్యాయం చేయాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPI Ramakrishna Fires On AP CM YS Jagan: అమలాపురానికి చెందిన ఆరుద్ర అనే మహిళ సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు ఆత్మహత్యకి పాల్పడిన ఘటనపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రంగా స్పందించారు. సీఎం జగన్కి జనం గోడు వినే తీరిక లేదా? లేకపోతే ఎందుకు వినాలన్న అహంభావమా? అని ప్రశ్నించారు. సీఎంకు విన్నవించే అవకాశం లేక.. ఆ మహిళ సీఎం కార్యాలయం ముందు ఆత్మహత్యకి పాల్పడిందన్నారు. జగన్కి ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి సచివాలయం నుండి పాలన లేదన్నారు. తాడేపల్లిలో సీఎం క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకొని.. ముళ్ళ కంచెలు, పోలీస్ పహారా మధ్య మాత్రమే ఉంటున్నారని మండిపడ్డారు. ప్రజా వినతులు స్వీకరించే ఆలోచన సీఎంకి లేదని పేర్కొన్నారు. వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి అఖిలపక్ష సమావేశాలు జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కేవలం నిర్బంధకాండలు, అణిచివేతలతో.. నియంత పాలన మాత్రమే సాగుతోందని ఆరోపణలు చేశారు. కానిస్టేబుల్ వేధింపుల నుంచి ఆరుద్రని రక్షించి, ఆమెకు న్యాయం చేయాలని కోరారు.
కాగా.. సీఎం అపాయింట్మెంట్ లభించలేదన్న మనస్తాపంతో, ఆరుద్ర అనే మహిళ సీఎం కార్యాలయం ముందే తన మణికట్టు కోసుకుని బలవన్మరణం చెందేందుకు ప్రయట్నించిన విషయం తెలిసిందే. కాకినాడ జిల్లాకు చెందిన ఆరుద్రకు సాయిలక్ష్మీచంద్ర అనే కుమార్తె ఉంది. వెన్నెముక సమస్యతో బాధపడుతున్న ఆ యువతి చికిత్సకు రూ. 2 కోట్లు కావాలని వైద్యులు చెప్పారు. దీంతో తమ ఇంటిని అమ్మాలని ఆరుద్ర నిర్ణయించింది. అయితే.. తమ ఇంటిని అమ్ముకోనివ్వకుండా ఒక కానిస్టేబుల్, మరో వ్యక్తి కలిసి తమని బెదిరిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ని కలిసి, తన గోడు వెళ్లబోసుకుందామని కూతురితో పాటు క్యాంప్ ఆఫీస్కి వచ్చారు. అయితే.. అపాయింట్మెంట్ దక్కకపోవడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Also Read
- Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
- Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
తాజావార్తలు
-
BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
-
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
-
Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
-
Sanju Samson: ఇక ఫెయిల్ అవ్వడు.. హాఫ్ సెంచరీలే.. సంజు శాంసన్పై సన్నీ కీలక వ్యాఖ్యలు!
-
Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!