CPI Narayana: సీఎం అయ్యాక జగన్ గుణం మారింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPI Narayana Reaction On Amaravati Farmers Padayatra: నేటి నుంచి ప్రారంభమైన అమరావతి రైతుల మహా పాదయాత్ర -2 మీద సీపీఐ నారాయణ స్పందించారు. ఇది అమరావతి రైతుల రెండో పోరాటమని పేర్కొన్నారు. ఏపీ రాజధానిగా అమరావతి ఉంటుందని వైస్ జగన్ హామీ ఇచ్చారని, కానీ సీఎం అయ్యాక ఆయన గుణం మారిపోయిందని అన్నారు. రాష్ట్రాన్ని ధ్వంసం చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాదయాత్రలు, ర్యాలీలంటే.. ఎందుకు సీఎంకి కోపమని ప్రశ్నించారు. మీరు, మా నాన్న కూడా పాదయాత్రలు చేసే ముఖ్యమంత్రులు అయ్యారని సీఎం జగన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సీఎం పదవి నుంచి జగన్ దిగిపోవాలన్న ఉద్దేశంతో రైతులు పాదయాత్ర చేయడం లేదని, కేవలం అమరావతినే ఏపీ రాజధానిగా కొనసాగించాలని కోరుతున్నారని వెల్లడించారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. రానున్న రోజుల్లో ఉద్యమం మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ కూడా అమరావతి రైతుల పాదయాత్రకు మద్దతు తెలిపారు. రైతులు చేపట్టిన ఈ మహా పాదయాత్ర ‘ధర్మయాత్ర’ అని పేర్కొన్నారు. రాజధాని పేరు చెప్పి రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేస్తున్నారని.. రాజధాని వికేంద్రీకరణ ప్రపంచంలోనే ఎక్కడ లేదని అన్నారు. ‘మొదట కులాల మధ్య విద్వేషాలు సృష్టించారు.. ఇపుడు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు’ అంటూ మండిపడ్డారు. విశాఖను రాజధానిగా నియమిస్తే.. రాయలసీమకు అన్యాయం జరుగుతుందన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు రాజధాని కావాలని కోరలేదని.. అభివృద్ధి కావాలన్నారని చెప్పారు. అమరావతి రాజధానికి బిజేపి కట్టుబడి ఉందని కామినేని శ్రీనివాస్ వెల్లడించారు.
Also Read
- OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్కు బ్రేక్!
- Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
- CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
- Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!